ఓపెన్ పోర్స్ ను లైట్ గా తీసుకుంటున్నారా.. వీటి వల్ల కలిగే నష్టాలు తెలుసా.!

ఓపెన్ పోర్స్ చర్మ సంరక్షణలో చాలా మంది వింటూ ఉంటారు. చర్మం పై  రంధ్రాలు తెరుచుకుని ఉండటాన్ని ఓపెన్ పోర్స్ అంటారు. ఇది  చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. అయితే, దీన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏదో చిన్న సమస్యలే అని లైట్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో చర్మంపై దారుణమైన ప్రభావం పడుతుంది. ఓపెన్ పోర్స్ వల్ల కలిగే సమస్యలు, నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుంటే.. మొటిమలు , బ్లాక్‌హెడ్స్ పెరగడం.. చర్మ రంధ్రాలు పెద్దవిగా ఉన్నప్పుడు వాటిలోకి దుమ్ము, ధూళి, చెమట , బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి. దీనివల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి మొటిమలు, చీముతో కూడిన  మొటిమలు (అక్నే), బ్లాక్‌హెడ్స్ , వైట్‌హెడ్స్ విపరీతంగా పెరుగుతాయి. వయసు పైబడినట్లు కనిపించడం..  ఓపెన్ పోర్స్ ముఖాన్ని కాంతిహీనంగా మారుస్తాయి. చర్మానికి ఉండే ఎలాస్టిసిటీ తగ్గిపోయి, ముఖంపై ముడతలు , గీతలు త్వరగా వస్తాయి. దీనివల్ల చిన్న వయస్సులోనే పెద్దవారిలా కనిపించే అవకాశం ఉంది. జిడ్డు చర్మం..  ఓపెన్ పోర్స్ ఉన్నవారిలో సెబమ్  ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సెబమ్ అంటే చర్మంలో ఉత్పత్తి అయ్యే నూనె.. దీని వల్ల ముఖం ఎప్పుడూ జిడ్డుగా  అనిపిస్తుంది. మేకప్ వేసుకున్నా కూడా సరిగ్గా నిలవదు, రంధ్రాల మధ్యలోకి మేకప్ చేరి ముఖం చారలుగా మారుతుంది. చర్మం మెరుపు తగ్గడం.. రంధ్రాల కారణంగా చర్మం స్మూత్ గా  ఉండకపోయేసరికి చర్మం కాంతివంతంగా కనిపించదు. దీనివల్ల ముఖం ఎల్లప్పుడూ అలసిపోయినట్లు, కాంతిలేకుండా కనిపిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు.. ఓపెన్ పోర్స్ ద్వారా  బ్యాక్టీరియా చర్మం లోపలి పొరల్లోకి జొరబడి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఎర్రబడటం , మంటకు దారితీస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..  రోజుకు రెండుసార్లు మంచి క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సన్‌స్క్రీన్ వాడటం, ముఖానికి ఐస్ క్యూబ్స్ రాయడం,  మంచి టోనర్ ఉపయోగించడం ద్వారా ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. కాబట్టి, ఓపెన్ పోర్స్ ను అస్సలు లైట్ తీసుకోకూడదు. మొదట్లోనే సరైన స్కిన్ కేర్ పాటించి చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవాలి.                               *రూపశ్రీ.  

ముఖంపై మచ్చలు తగ్గించే బామ్మల చిట్కా

అమ్మాయిలకు తమ ముఖం అందంగా ఉండాలని ఉంటుంది. కానీ ముఖం మీద మచ్చలు, మంగు,  మొటిమల వల్ల పడిన గుంటలు.. చాలా మంది అమ్మాయిల ముఖారవిందాన్ని పాడు చేస్తుంటాయి.  ఇవన్నీ అమ్మాయిల  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే చర్మ సమస్యలు. నేటి కాలంలో వీటికి చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి. ఈ క్రీములు వాడి విసిగిపోయిన వాళ్ళు చివరికి బామ్మల కాలం నాటి చిట్కాల దగ్గరకే వస్తారు.  ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే లభించే పదార్థాలతో చర్మాన్ని మృదువుగా, నిగారింపుగా మార్చుకునే బామ్మల కాలం నాటి రెమెడీ ఏంటో  తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. శనగపిండి.. 2 స్పూన్లు (చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. కస్తూరి పసుపు.. 1/2 స్పూను (యాంటీ బాక్టీరియల్ గుణాలు మచ్చలను తగ్గిస్తాయి) పచ్చి పాలు లేదా పెరుగు..  2 స్పూన్లు (లాక్టిక్ యాసిడ్ గుంటలను, మంగు మచ్చలను తేలికపరుస్తుంది) అలోవెరా జెల్ .. 1 స్పూను (చర్మాన్ని హైడ్రేట్ చేసి గుంటలను పూడ్చడానికి సహాయపడుతుంది) తేనె.. 1/2 స్పూను (సహజమైన తేమను ఇస్తుంది) తయారీ & వాడే విధానం.. ఫేస్ ప్యాక్ తయారీ.. ఒక శుభ్రమైన గిన్నెలో శనగపిండి, కస్తూరి పసుపు, అలోవెరా జెల్, తేనె , సరిపడా పచ్చి పాలు వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. అప్లై చేయడం..  ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, ఈ ప్యాక్‌ను ముఖమంతా, ముఖ్యంగా మచ్చలు , గుంటలు ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. తర్వాత.. 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. స్క్రబ్బింగ్ & వాషింగ్.. ప్యాక్ కొద్దిగా ఆరిన తర్వాత, చేతులను కాస్త తడిచేసి వృత్తాకారంలో  తేలికగా మసాజ్ చేస్తూ చల్లటి నీటితో కడిగేయాలి. ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది? మచ్చలు & మంగు.. పసుపు , పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న నల్లటి మంగు మచ్చలను, పిగ్మెంటిజమ్‌ను త్వరగా తగ్గిస్తాయి. మొటిమల గుంటలు.. అలోవెరా , తేనె చర్మ కణాలను పునరుద్ధరించి క్రమంగా గుంటల లోతును తగ్గించడంలో సహాయపడతాయి. కాంతివంతమైన చర్మం.. శనగపిండి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, తక్షణ నిగారింపును ఇస్తుంది. వారానికి 2 నుండి 3 సార్లు ఈ ప్యాక్ క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. సున్నితమైన చర్మం  ఉన్నవారు ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఈ సహజమైన బామ్మల కాలపు చిట్కాతో రసాయనాలు లేని కాంతివంతమైన, మచ్చలు లేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.!                            *రూపశ్రీ.

గుమ్మడి గింజల నూనె ఇలా తయారు చేసుకుని వాడండి.. జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..!

జుట్టు ఒత్తుగా, అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.  అయితే నేటి కాలంలో బిజీ లైజ్, అధిక ఒత్తిడి,  సరైన హెయిర్ కేర్ రొటీన్ పాటించకపోవడం,  సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల జుట్టు పెరుగుదల దెబ్బతింటుంది.  జుట్టు రాలడానికి కారణం అవుతుంది.  ఈ కారణంగా నేటికాలంలో చాలామంది అమ్మాయిలు జుట్టు పెరుగుదుల కోసం,  జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.  ఎన్నో మార్కెట్ ఉత్పత్తులు వాడటం, ఇంటి చిట్కాలు ప్రయత్నించడం చేస్తుంటారు.  అయితే గుమ్మడి గింజల నూనె జుట్టు సమస్యలకు చెక్ పెడుతుందని అంటున్నారు.   ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టును మూలాల నుండి బలోపేతం చేయడానికి సహాయపడుతుందట.  అసలు గుమ్మడి గింజల నూనె ఎలా తయారు చేయాలి?  గుమ్మడి గింజల నూనెను ఎలా వాడాలి? పూర్తీగా తెలుసుకుంటే.. జుట్టు పెరుగుదల కోసం గుమ్మడి గింజల నూనె.. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ల వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ , జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు జుట్టు రాలడాన్ని నివారించడంలో, జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో , జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో పాత్ర పోషిస్తాయి. ఇంట్లోనే గుమ్మడి గింజల నూనెను ఎలా తయారు చేసుకోవచ్చు. గుమ్మడి గింజల నూనె తయారీకి కావలసిన పదార్థాలు.. 1/2 కప్పు గుమ్మడికాయ గింజలు 1 కప్పు కొబ్బరి నూనె 1 టీస్పూన్ కలోంజి సీడ్స్.. తయారు చేసే విధానం.. గుమ్మడికాయ గింజల నూనె తయారు చేయడానికి, ముందుగా వాటిని శుభ్రమైన నీటితో కడగాలి.  తర్వాత, ఈ విత్తనాలను ఒక పళ్ళెంలో పరచి, తేమ పోయేలా ఆరబెట్టాలి. ఇప్పుడు ఈ గింజలను ఒక బాణలిలో వేసి వేయించుకోవాలి.  అయితే ఎక్కువ మంట మీద వేయించకుండా జాగ్రత్త వహించాలి. ఎక్కువ మంట మీద వేయిస్తే వాటిలో పోషకాలు నశిస్తాయి. ఈ విత్తనాలను చల్లారడానికి ఒక పళ్ళెంలో ఉంచాలి. గుమ్మడి విత్తనాలు చల్లారిన తర్వాత, మిక్సర్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి.  తరువాతి  1 కప్పు కొబ్బరి నూనె వేసి మధ్యస్థ మంట మీద వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడెక్కగానే, అందులో దంచిన గుమ్మడికాయ గింజలను వేయాలి.  అలాగే అందులో 1 టీస్పూన్ కలోంజి సీడ్స్  కూడా కలపాలి. . నూనెను కనీసం 15-20 నిమిషాల పాటు సన్నని మంట మీద వేడి చేయాలి.  గింజలు గిన్నెకు అంటుకోకుండా ఉండేందుకు, వాటిని  కలుపుతూ ఉండాలి.  తర్వాత గ్యాస్ ఆపివేసి, నూనెను చల్లారనివ్వాలి. శుభ్రమైన కాటన్ గుడ్డను ఉపయోగించి నూనెను పాత్రలోకి వడకట్టండి.  ఇప్పుడు ఈ  నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి, గుమ్మడికాయ గింజలతో తయారు చేసిన  నూనె సిద్ధమైనట్టే. ఎలా ఉపయోగించాలి? ఈ నూనెను వారానికి 2-3 సార్లు వాడవచ్చు. తలస్నానం చేయడానికి ముందు, ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని నూనె తీసుకుని, దానితో  తలకు 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఒక గంట తర్వాత, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు పెరుగుదుల మెల్లిగా పుంజుకుంటుంది.                                                                                                                                                     *రూపశ్రీ.

పెర్ఫ్యూమ్ లేకుండానే శరీరం నుండి రోజంతా మంచి సువాస వెదజల్లాలంటే..

 పెర్ఫ్యూమ్ లేకుండానే శరీరం నుండి రోజంతా మంచి సువాస వెదజల్లాలంటే.. శరీరం నుండి మంచి వాసన రావడం గురించి చాలామంది బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.  శరీరం నుండి వచ్చే ఆహ్లాదకరమైన సువాసన ఇతరులను ఆకర్షించడానికి అని కొందరు అనుకుంటారు,  చెమట సమస్య నుండి రక్షణ కోసం అని మరికొందరు అనుకుంటారు. కానీ నిజానికి శరీరం మంచి సువాసనతో ఉంటే వారి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది.  మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది.  చేసే పనుల్లో ఏకాగ్రత మెరుగవుతుంది.  చురుగ్గా ఉండగలుగుతారు.  ఆ తరువాతే ఇతరులను ఆకర్షించడం,  ఇతరులు మాట్లాడాలి అనిపించేలా ఉండటం వంటివి ఉంటాయి.  శరీరం మంచి సువాసనతో ఉండటం అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదని, అది మనిషి అంతర్గత ఆరోగ్యానికి సంబంధించినది కూడా అని ఆయుర్వేదం చెబుతుంది.   పెర్ఫ్యూమ్ లు ఏమీ వాడకుండా శరీరం సహజంగా సువాసన వెదజల్లాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే.. సైన్స్ ఏం చెబుతోంది? చాలామంది చెమట కారణంగా శరీరం నుండి దుర్వాసన వస్తుందని అనుకుంటారు. కానీ నిజానికి చెమటకు ఎలాంటి వాసన ఉండదు.  చర్మంపై ఉండే బ్యాక్టీరియానే దానికి వాసనను ఇస్తుందని సైన్స్ ప్రూవ్ చేస్తోంది. అందుకే సహజంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రహ్మ ముహూర్తం.. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం శరీరంలోని వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దుర్వాసన తొలగించడం.. ప్రతి ఉదయం వెండి లేదా రాగి టంగ్ క్లీనర్ తో  నాలుకను శుభ్రం చేసుకోవాలి. రాగి టంగ్ క్లీనర్  బ్యాక్టీరియాను ఎక్కువసేపు నాలుకకు దూరంగా ఉంచి దుర్వాసనను నివారిస్తుంది. దీని తరువాత, ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని, మౌత్‌వాష్ లాగా కొంతసేపు పుక్కిలించి, ఆపై ఉమ్మివేయాలి. ఇది నోటి మూలల్లో దాగి ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఆయిల్ మసాజ్.. ప్రతిరోజూ స్నానానికి ముందు నువ్వుల నూనె లేదా చందనం నూనెతో శరీరానికి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల  చర్మ రంధ్రాలు బాగా తెరుచుకుని మురికి బయటకు వస్తుంది. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, స్వేద గ్రంథులు సమతుల్యంగా పనిచేయగలుగుతాయి. శుభ్రమైన దుస్తులు.. ప్రతిరోజూ శుభ్రమైన, ఉతికిన , ఎండలో ఆరబెట్టిన దుస్తులను ధరించాలి. కాటన్ దుస్తులు అయితే చాలామంచిది. నైలాన్ లేదా పాలిస్టర్ వంటి కృత్రిమ ఫాబ్రిక్  చర్మానికి గాలి తగలకుండా అడ్డుకుంటాయి , చెమట నిలిచిపోయేలా చేస్తాయి, దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది, శరీర దుర్వాసనకు దారితీస్తుంది. శరీరం సువాసన రావాలంటే.. ఆయుర్వేదంలో స్నానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రసాయనాలు కలిగిన  బాడీ వాష్‌లను ఉపయోగించడానికి బదులుగా, సహజ పదార్థాలతో స్నానం చేయడం మంచిది. ఎందుకంటే ఇది  చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, చాలా కాలం పాటు తాజాగా సువాసన వచ్చేలా చేస్తుంది. సహజ సువాసన కోసం వీటిని వాడాలి.. చందనం శరీర వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది చర్మపు దద్దుర్లు , వాపులను కూడా నయం చేసి, చర్మానికి అద్భుతమైన సువాసనను అందిస్తుంది. ప్రతిరోజూ  స్నానపు నీటిలో ఒక టీస్పూన్ ఎరుపు లేదా పసుపు చందనాన్ని కలపాలి. గసగసాలకు సహజంగా చల్లదనాన్నిచ్చే గుణాలు ఉన్నాయి. స్నానపు నీటిలో గసగసాల వేర్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఈ నీటితో స్నానం చేయాలి. ఇది అధిక చెమట నుండి ఉపశమనం కలిగించి,  శరీరాన్ని తాజాగా, సువాసనగా ఉంచుతుంది. వేప , తులసి చర్మ దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. వేప , తులసి ఆకులను నీటిలో 10 నుండి 15 నిమిషాల పాటు ఉడకబెట్టి, అవి చల్లారిన తర్వాత  స్నానపు నీటిలో కలపాలి. ఇది చర్మ దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. గులాబీ రేకులు , కర్పూరం  చర్మాన్ని శుభ్రపరిచి,  చాలా సేపటి వరకు శక్తివంతంగా ఉంచుతాయి.  స్నానపు నీటిలో తాజా గులాబీ రేకులను , చిటికెడు కర్పూరాన్ని కలపాలి. కర్పూరం చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది, గులాబీ పునరుత్తేజాన్ని అందిస్తుంది. రెండు లేదా మూడు దంచిన యాలకులు, లవంగాలను నీటిలో మరిగించి, ఆ నీటిని  స్నానపు నీటిలో కలపాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ,   శరీరానికి తాజా సువాసనను అందిస్తుంది. పటిక.. పటిక ఒక అద్భుతమైన పదార్థం. దీనికి వాసన లేనప్పటికీ, చర్మం యొక్క pH ను సమతుల్యం చేసే గుణాలు దీనికి ఉన్నాయి. దీనిని చంకలకు రుద్దడం వల్ల చర్మం యొక్క pH సమతుల్యం అయ్యి, దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. ఇది కాకుండా, షియా బటర్, తేనె మైనం, బేకింగ్ సోడా లేదా కొబ్బరి నూనె వంటి పదార్థాలు కలిగిన అల్యూమినియం లేని డియోడరెంట్లను కూడా ఉపయోగించవచ్చు. ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి.                                         *రూపశ్రీ.  

ముల్తానీ మట్టిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే చాలు.. ముఖం అద్దంలా మెరుస్తుంది..!

ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ నేటి కాలంలో మార్కెట్లో ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ముఖాన్ని అద్దంలా మెరిపిస్తుందని యాడ్స్ లోనూ, ప్రమోషన్స్ లోనూ వైరల్ అవుతుంటాయి. కానీ ఇవి చూడటానికి ఉన్నంత ఆకర్షణగా.. మంచి ఫలితాన్ని అయితే ఇవ్వలేవు.  అందుకే చాలా వరకు ఇంటి చిట్కాలే నయం అని, కొన్ని చిన్న టిప్స్ తో చక్కని ఫలితాలు పొందవచ్చని చెబుతారు.  చాలామంది స్కిన్ కేర్ లో ముల్తానీ మట్టి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముల్తానీ మట్టి చర్మంపై ఉన్న అధిక నూనె, దుమ్ము , మురికిని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. అయితే, దీనిని సహజ పదార్థాలతో కలిపినప్పుడు, దాని ప్రభావాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఇది చర్మం  సహజ కాంతిని కాపాడుకోవడంలో సహాయపడుతుందని చెబుతారు.   ముల్తానీ మట్టిని ఏ పదార్థాతో కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే.. రోజ్ వాటర్, ముల్తానీ మట్టి..  జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌తో కలిపి అప్లై చేయడం చాలా మంచిది. పేస్ట్ తయారు చేయడానికి, 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిని 2 నుండి 4 టీస్పూన్ల రోజ్ వాటర్‌తో కలపాలి. ఈ పేస్ట్‌ను  ముఖానికి, మెడకు సున్నితంగా అప్లై చేసి, ఆ తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి,  తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ అధిక జిడ్డును నియంత్రించడానికి, చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి ,  చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచడానికి  సహాయపడుతుంది.బెస్ట్ రిజెల్ట్స్  కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి 1 నుండి 2 సార్లు అప్లై చేయవచ్చు. ముల్తానీ మట్టి, పెరుగు.. ముఖం పొడిబారి, కాంతిహీనంగా లేదా నల్లబడినట్లయితే, తాజా పెరుగుతో కలిపిన ముల్తానీ మట్టిని ఫేస్ ప్యాక్ లా వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిని 1 నుండి 2 టీస్పూన్ల తాజా పెరుగుతో కలిపి చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను  ముఖానికి అప్లే చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాల. ఆ తర్వాత మెల్లగా మసాజ్ చేసి, మామూలు నీటితో కడిగేయాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి,  చర్మాన్ని మునుపటి కంటే శుభ్రంగా , మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్తానీ మట్టి, తేనె.. పొడి , సాధారణ చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి , తేనె మిశ్రమంతో చేసిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసుకోవచ్చు. అవసరమైతే, కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖానికి అప్లై చేసి  10 నుండి 15 నిమిషాల పాటు ఉంచుకుని, ఆ తర్వాత మామూలు నీటితో కడిగేయాలి. తేనె చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది, దీనివల్ల పొడిబారడం తగ్గుతుంది. ఇది ముఖం  సహజ కాంతిని నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది, దీనివల్ల ముఖం మునుపటి కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి, అలోవెరా జెల్..  సున్నితమైన చర్మం ఉన్నా లేదా ఎండవల్ల చర్మం కమిలిపోయినా, తాజా కలబంద జెల్‌తో కలిపిన ముల్తానీ మట్టిని ప్యాక్ లా వేసుకోవడం ప్రయోజనకరం. 2 టీస్పూన్ల ముల్తానీ మట్టితో 1-2 టీస్పూన్ల కలబంద జెల్‌ను కలిపి పేస్ట్ లాగా తయారుచేసి, దానిని  ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి.  10 నిమిషాల పాటు  ఉంచుకోవాలి. ఆ తర్వాత, మామూలు నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి ఉపశమనం కలిగించి, చర్మ చికాకును తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్తానీ మట్టి, పసుపు..  చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, ముల్తానీ మట్టిలో చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని  ముఖానికి పట్టించి,  10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత మామూలు నీటితో కడిగేయాలి.  పసుపులో యాంటీఆక్సిడెంట్ , యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి.  ముల్తానీ మట్టి చర్మం నుండి అదనపు నూనె , మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. పసుపు ఎక్కువ వాడితే చర్మం పసుపు రంగులో కనిపిస్తుంది.  కాబట్టి పసుపును తక్కువగా వేసుకోవడం మంచిది.                                          *రూపశ్రీ.  

మందార పువ్వులను ఇలా వాడితే.. ముఖం మెరిసిపోతుంది..!

మందార పువ్వులను ఇలా వాడితే.. ముఖం మెరిసిపోతుంది..! ముఖం ఎంతో అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఇందుకోసం చాలామంది అమ్మాయిలు మార్కెట్లో దొరికే చాలా రకాల ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు.  వీటి వల్ల అప్పటికప్పుడు ఫలితాలు కనిపించవచ్చు. కానీ దీర్ఘకాల ఫలితాలు మాత్రం చాలా వరకు ఉండవు. పైగా కొన్ని ఉత్పత్తులు చర్మానికి హాని కలిగించి, ముఖ చర్మాన్ని పాడు చేస్తాయి కూడా.  సహజమైన పద్దతిలో ముఖ చర్మాన్ని మెరిపించాలంటే మందార పువ్వులను వాడాలని అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.. ఇంటి చుట్టుప్రక్కల పెరిగే మందారం మొక్కల నుండి మందారం పువ్వులను సేకరించి,  సహజంగా ముఖాన్ని ఎలా మెరిపించాలో తెలుసుకుంటే.. మందార, తేనె ఫేస్ ప్యాక్.. తాజా మందార రేకులను నూరి, దానికి ఒక చెంచా తేనె  ముఖానికి పట్టించాలి. దాన్ని కలిపి 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి.  ఆ తర్వాత  ముఖాన్ని మామూలు నీటితో కడుక్కోవాలి. తేనె చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుంది, మందార పువ్వు చర్మానికి తాజాదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిని వారానికి 1-2 సార్లు ఉపయోగించవచ్చు. మందార పువ్వు, పెరుగు.. చర్మం పొడిగా లేదా నిర్జీవంగా అనిపిస్తే, పెరుగులో మందార పేస్ట్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఎక్స్ ఫోలియేషన్‌కు సహాయపడుతుంది. మందార పువ్వు చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ ప్యాక్ నుఉపయోగించిన తర్వాత మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోకూడదు. మందార, కలబంద జెల్.. మందార పేస్ట్‌ను కలబంద జెల్‌లో కలిపి, ముఖానికి సున్నితంగా రాయాలి. ఈ మిశ్రమం చర్మాన్ని చల్లబరచడానికి , తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.చాలా మంది వేసవి లేదా ఎండ తగిలిన తర్వాత చర్మానికి ఉపశమనం కలిగించడానికి ఇలాంటి ఇంట్లో తయారుచేసిన మిశ్రమాలను ఉపయోగిస్తారు, కానీ ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకంటే మంచిది. లైట్ స్క్రబ్.. ఎండిన మందార పువ్వుల  పొడిని తీసుకోవాలి. దీనికి కొద్దిగా ఓట్స్ లేదా బియ్యం పిండి , రోజ్ వాటర్ కలపాలి. ఇది లైట్ స్క్రబ్ గా పనిచేస్తుంది.  దీనిని చర్మానికి చాలా సున్నితంగా రాయాలి,  గట్టిగా రుద్దకూడదు. సున్నితమైన లేదా మొటిమలు వచ్చే చర్మంపై స్క్రబ్‌లను జాగ్రత్తగా వాడాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.. ఏదైనా ఇంటి చిట్కాను ఉపయోగించే ముందు, చర్మంపై చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.  దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించవచ్చు.  ప్యాచ్ టెస్ట్ చేశాక  మంట, ఎరుపు లేదా దురద వంటివి కలిగితే, వెంటనే వాడకాన్ని ఆపివేయాలి. మందార పువ్వు రాసుకున్న తర్వాత, పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడాలి. మంచి చర్మం కోసం,  స్కిన్ కేర్ టిప్స్ తో పాటు  తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం , తగినంత నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.                                  *రూపశ్రీ.  

జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలా.. ఈ ఒక్క సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు..!

జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలా.. ఈ ఒక్క సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు..! జుట్టు రాలడం, పలచబడటం, నెమ్మదిగా పెరగడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు నేటి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. జుట్టుకు రంగు వేసినంత సులువుగా జుట్టు పర్మినెంట్ గా నల్లా అవ్వదు. అయినా సరే..  సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో, చిట్కాలతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.  వందలు, వేలు పోసి హెయిర్ ఆయిల్స్,  విటమిన్ సప్లిమెంట్లు,  హెయిర్ ప్యాక్ లు,  హెయిర్ కేర్  ట్రీట్రెంట్ లు తీసుకున్నా సరే.. జుట్టు తిరిగి నల్లబడటం,  ఒత్తుగా పెరగడం వంటివి అంత సులువుగా జరగవు. అయితే ఇంట్లోనే జుట్టు అన్ని సమస్యలకు చెక్ పెట్టి, జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేసే చిట్కా ఒకటుంది.  ఇది తయారు చేసుకోవడం,  వాడటం కూడా చాలా సులువు.  అదేంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా వాడాలో తెలుసుకుంటే.. హెయిర్ గ్రోత్ పౌడర్.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి,నల్లగా మారడానికి,  ఒత్తుగా పెరగడానికి ఇంట్లోనే హెయిర్ గ్రోత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు.. గుంటగలర ఆకు.. బెల్లం లేదా కండ చక్కెర.. నల్ల నువ్వులు.. గుంటగలర ఆకు.. ఆయుర్వేదంలో గుంటగలరను భృంగరాజ్‌గా కూడా పిలుస్తారు. జుట్టు సంరక్షణలో బృంగరాజ్ చాలా ప్రసిద్ధి చెందింది.   జుట్టు నల్లగా ఉండేందుకు, జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు, తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు దీన్ని ఉపయోగిస్తారు. భృంగరాజ్‌లో ఉండే కొన్ని సహజ రసాయనాలు జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నువ్వులు.. నువ్వులు అనేక పోషకాలకు నిలయం, నువ్వులలో  ప్రోటీన్,  కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం,  విటమిన్ B సమూహానికి చెందిన కొన్ని పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఈ పోషకాలు శరీర ఆరోగ్యంతో పాటు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందించడంలో సహాయపడతాయి. బెల్లం లేదా కండ చక్కెర.. బెల్లంలో కొంతమేరకు ఐరన్, ఖనిజాలు ఉంటాయి. రుచిని మెరుగుపరుస్తుంది.  కండ చక్కెర సాధారణ పంచదార కంటే భిన్నంగా ఉంటుంది.  ఇది తీపిని ఇస్తూ శరీరానికి చలువ చేస్తుంది. హెయిర్ గ్రోత్ పౌడర్..  గుంటగలర ఆకు పొడి – 100 గ్రాములు  వేయించిన నువ్వుల పొడి – 100 గ్రాములు  బెల్లం పొడి లేదా కండ చక్కెర పొడి – 100 గ్రాములు తయారీ విధానం.. అన్ని పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి.వీటిని వంద గ్రాముల మోతాదులో కాకపోయినా కనీసం వీలైనంత వరకు సమాన పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఎలా తీసుకోవాలి? పైన తయారు చేసుకున్న పౌడిని ఉదయం ఒక టీ స్పూన్,  సాయంత్రం ఒక టీ స్పూన్ పొడిని నేరుగా నోట్లో వేసుకుని గ్లాసు మంచినీరు తాగాలి.  లేకపోతే గోరు వెచ్చని పాలు అయినా తాగవచ్చు. ప్రతి రోజూ పైన చెప్పకున్న హెయిర్ గ్రోత్ పౌడర్ ను కనీసం నెల రోజులు అయినా కంటిన్యూగా వాడుతుంటే నెల రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.                                    *రూపశ్రీ.  

మీ ముఖం మిలమిల మెరవాలంటే.. ఇదిగో బియ్యం పిండిని ఇలా వాడండి..!

 గాజులాంటి చర్మం లేదా కాంతివంతమైన ముఖం అనగానే తరచుగా కొరియన్ స్కిన్ కేర్ గుర్తుకు వస్తుంది. బియ్యాన్ని వందల సంవత్సరాల నుండి  కేవలం ఆహారంగానే కాకుండా చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా , కాంతివంతంగా ఉంచడానికి అమ్మమ్మల చర్మ సంరక్షణలో బియ్యపు పిండి,  బియ్యపు నీరు  ఉండేవి. బియ్యంలోని పిండిపదార్థం, అమైనో ఆమ్లాలు , కొన్ని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఉపరితలాన్ని శుభ్రపరచి, చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.  ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు బదులుగా, సులభంగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో టిప్స్  పాటిస్తే చర్మాన్ని కొరియన్ ల కంటే అందంగా మార్చుకోవచ్చు.  అందులో  భాగంగానే చర్మం అందంగా, మిలమిల మెరవాలంటే..  ఇంట్లోనే బియ్యం పిండిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. ఫేస్ టోనర్.. బియ్యం కడిగిన తర్వాత మిగిలిన నీటిని పారేయకుండా, 20-30 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత, దానిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఎలా ఉపయోగించాలి?   ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, దూది లేదా స్ప్రే సహాయంతో దీనిని అప్లై  చర్మం పై అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. లేదా  చర్మానికి సరిపడితే కొద్దిగా ఆరనివ్వాలి. ప్రయోజనాలు: చర్మం తాజాగా , తేలికపాటి తేమతో ఉన్నట్లు అనిపిస్తుంది.  పొడి చర్మానికి తేమను అందించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫేస్ స్క్రైబ్.. బియ్యపు పిండి చర్మం ఉపరితలం నుండి మృత కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. కావలసిన పదార్థాలు.. 2 టీస్పూన్ల బియ్యం పిండి 1 టీస్పూన్ పెరుగు 1 టీస్పూన్ తేనె ఎలా  చేయాలి? పై పదార్థాలను అన్నీ కలిపి స్క్రబ్ మిశ్రమంగా తయారు చేయాలి.  దీన్ని 1–2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి, ఆ తర్వాత నీటితో కడగాలి. మరీ గట్టిగా రుద్దకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా  సున్నితమైన చర్మం అయితే ఈ స్క్రబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బియ్యం పిండి, కలబంద ఫేస్ ప్యాక్.. చర్మం నిర్జీవంగా కనిపిస్తే, బియ్యపు పిండి , కలబంద జెల్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? రెండు టీస్పూన్ల బియ్యపు పిండి తీసుకోవాలి. దీనికి 1-2 టీస్పూన్ల తాజా కలబంద జెల్ కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ముఖం మీద ఉంచుకుని, ఆ తర్వాత కడిగేయాలి. బియ్యం పిండి, పాలు ఫేస్ ప్యాక్.. పాలు, బియ్యప్పిండి కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి. ఎలా ఉపయోగించాలి? 15 నిమిషాల పాటు ముఖంపై ఉంచుకుని, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది. బియ్యం పిండి,  శనగపిండి ఫేస్ ప్యాక్.. శనగ పిండి ఫేస్ ప్యాక్ చర్మంపై అధిక జిడ్డు ఉన్నట్లు  అనిపిస్తే, బియ్యప్పిండి, శనగపిండి , రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ బియ్యం పిండి, 1 టీస్పూన్ శనగపిండి అవసరమైనంత రోజ్ వాటర్   ప్యాక్‌ను ఎలా అప్లై చేయాలి? శనగపిండి, రోజ్ వాటర్,  బియ్యపు పిండిని కలిపి ముద్దలా చేయాలి.  దీనిని ముఖానికి రాసుకుని వదిలేయాలి. 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. స్కిన్ కేర్ లో బియ్యం వాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.  చర్మంపై మంట, దురద లేదా ఎరుపు వంటివి కనిపిస్తే, వెంటనే వాడటాన్నిఆపివేయాలి.  గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్నప్పుడు  ఇంటి చికిత్సలను ఉపయోగించకుండా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. స్క్రబ్ చేసుకొనేటప్పుడు  మరీ గట్టిగా రుద్దకూడదు. ఇంటి చిట్కాలతో పాటు, సన్‌స్క్రీన్ కూడా వాడాలి.                                     *రూపశ్రీ.  

వర్షాకాలంలో సన్ స్క్రీన్ వాడాలా..అసలు నిజాలేంటి.!

వర్షాకాలంలో సన్ స్క్రీన్ వాడాలా?  అసలు నిజాలేంటి? వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, అవి అనేక కొత్త చర్మ సమస్యలను కూడా వెంట తెస్తాయి. వర్షా కాలంలో సరైన చర్మ సంరక్షణ చాలా అవసరం, కానీ వర్షాకాలంలో ఎండ ఉండదు కాబట్టి సన్‌స్క్రీన్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. ఈ కారణంగా, చాలా మంది వర్షాకాలంలో తమ స్కిన్ కేర్ రొటీన్  నుండి సన్‌స్క్రీన్‌ను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కానీ ఇలా చేయడం సరైనదేనా? వర్షాకాలంలో సన్‌స్క్రీన్‌ను వాడకుండా ఉండాలా? దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెప్తున్నారు?  వివరంగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో సన్ స్క్రీన్.. స్కిన్ కేర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షాకాలంలో ఎండ లేకపోయినా, మేఘాలు దట్టంగా ఉన్నప్పటికీ సూర్యుని నుండి వెలువడే UVA , UVB కిరణాలలో ఎక్కువ భాగం భూమిని చేరుతుంది. ముఖ్యంగా,  ముడతలు, చర్మంపై మచ్చలు , దీర్ఘకాలిక చర్మ నష్టానికి కారణమయ్యే UVA కిరణాలు, మేఘాలను దాటుకుని మరీ రాగవట.  ఇంటి బయటకు వెళ్లేటప్పుడు ఈ కిరణాల నుండి రక్షణ కోసం వర్షాకాలంలో కూడా సన్ స్క్రీన్ ను వాడటం చాలా అవసరం. అయితే, ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. అందువల్ల, చర్మ రకం, బయట గడిపే సమయం , చేసే పనుల  ఆధారంగా సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. వర్షాకాలంలో సన్‌స్క్రీన్ వాడాలా వద్దా, ఏ సన్‌స్క్రీన్ ఉత్తమమైనది, ఎంత మోతాదులో పూయాలి , ఏ తప్పులు చేయకూడదు.. ఇవన్నీ తెలుసుకోవాలి. వర్షాకాలంలో ఏ సన్ స్క్రీన్ ఎంచుకోవాలి.. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి.  SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నది చాలా మంచి  ఎంపికగా పరిగణించబడుతుంది.  PA+++ లేదా PA++++ రేటింగ్ ఉన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది.  జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ లేదా మ్యాట్ ఫినిష్ వాడాలి,  పొడి చర్మానికి, తేమను అందించే ఫార్ములాను ఎంచుకోవాలి.  చెమట పట్టినా లేదా తేలికపాటి వర్షం పడినా, వాటర్ ఫ్రూప్ సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. సన్ స్క్రీన్ ఎలా పూయాలి.. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి,  దీని తర్వాత, తగినంత సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి.  బయటకు వెళ్లే ముందు సుమారు 15-20 నిమిషాల ముందు రాసుకోవాలి.  ఎక్కువసేపు ఆరుబయట ఉన్నట్లయితే, ప్రతి 2-3 గంటలకు మళ్లీ పూయాలి.  ఎక్కువ చెమట పట్టిన తర్వాత, వర్షంలో తడిచిన తర్వాత లేదా ముఖం కడుక్కున్న తర్వాత మళ్లీ రాసుకోవాలి. ఈ స్కిన్ కేర్ టిప్స్ తప్పనిసరి.. ముఖాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి,  చర్మ రకానికి అనుగుణంగా తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి,  తగినంత నీరు త్రాగాలి,  సమతుల్య ఆహారం తీసుకోవాలి,  తడి చర్మాన్ని ఎక్కువ సేపు తేమగా ఉంచకూడదు,  వర్షంలో కూడా గొడుగు లేదా టోపీని వాడాలి.                             *రూపశ్రీ.  

మొటిమల నుండి టానింగ్ వరకు.. ముల్తానీ మట్టి చేసే మ్యాజిక్ ఇది!

మొటిమల నుండి టానింగ్ వరకు.. ముల్తానీ మట్టి చేసే మ్యాజిక్ ఇది! చర్మ సంరక్షణలో చాలా మంది ముల్తానీ మట్టి వాడుతుంటారు. ఇది అదనపు నూనెను పీల్చుకుని, చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలామంది ముల్తానీ మట్టిని  ముఖ , చర్మ సంరక్షణకు సహజమైన ఎంపికగా భావిస్తారు. అందుకే నేటికీ అందుబాటులో ఉన్న అనేక ఫేస్ ప్యాక్‌లు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ముల్తానీ మట్టిని ఉపయోగిస్తున్నారు. అయితే ముల్తానీ మట్టి అందరికీ ఒకే విధంగా పని చేయదు, అలాగే అన్ని చర్మాలకు ఒకే విధంగా ఫలితాన్ని ఇవ్వదు. సరైన పద్దతిలో ఉపయోగిస్తే.. ముల్తానీ మట్టి చర్మం మీద మొటిమల నుండి, ట్యానింగ్ వరకు.. చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జిడ్డు చర్మానికి, మొటిమలకు.. ముల్తానీ మట్టి అదనపు నూనెను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. అందుకే జిడ్డు చర్మం ఉన్నవారు దీనిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. అదనపు నూనెను తగ్గించడం వల్ల కొంతమందిలో మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయి.  అయితే, మొటిమలకు అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి అన్నిసార్లు మొటిమలు తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్పలేం. బ్లాక్ హెడ్స్, టానింగ్.. చర్మంపై ఉన్న మురికిని, అధిక నూనెను తొలగించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. ఇది బ్లాక్‌హెడ్స్ తక్కువగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. ఎండలో చర్మం కమిలిన తర్వాత, పెరుగు, కలబంద జెల్ లేదా రోజ్ వాటర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. అయితే..  చర్మంపై ఉన్న నల్లదనం ఎంత వేగంగా పోవడమనేది వ్యక్తి యొక్క చర్మంపై ఆధారపడి ఉంటుంది. మచ్చలు,  పిగ్మెంటేషన్.. నార్మల్ స్కిన్ కేర్ లో భాగంగా ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా, తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. కొందరు దీనిని పసుపు, కలబంద జెల్ లేదా చందనం పొడితో కలిపి అప్లై చేసుకుంటారు.  నల్ల మచ్చలు లేదా పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి కూడా ముల్తానీ మట్టిని వాడతారు.   వారానికి కనీసం రెండుసార్లు వాడుతూ ఉంటే.. కొన్ని వారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఓపెన్ పోర్స్.. ముల్తానీ మట్టి చర్మానికి స్పష్టమైన మరియు మ్యాట్ రూపాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది, దీనివల్ల చర్మ రంధ్రాలు పెద్దవిగా కాకుండా చిన్నవిగా మారతాయి.  వీటినే ఓపెన్ పోర్స్ అంటూ ఉంటారు.  అయితే  ఇది రంధ్రాల పరిమాణాన్ని శాశ్వతంగా తగ్గించదు. ముఖం కడుక్కున్న తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోవడం, పగటిపూట సన్‌స్క్రీన్ పూసుకోవడం వంటివి చేస్తే ముఖ చర్మ రంధ్రాలు చిన్నవిగా మారతాయి. సరైన విధంగా ఎలా వాడాలి.. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, పెరుగు లేదా కలబంద జెల్‌తో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి.  ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి 10-15 నిమిషాల పాటు అప్లై చేయాలి. పూర్తిగా ఆరిపోకముందే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు దీనిని ఉపయోగించడం సరిపోతుంది.                           *రూపశ్రీ.

వర్షం నీరు జుట్టుకు హాని చేస్తుందా.. అసలు నిజాలు ఇవీ!

వర్షం నీరు జుట్టుకు హాని చేస్తుందా.. అసలు నిజాలు ఇవీ! వేసవిలో ఎండలు బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత వచ్చే వర్షాకాలం చాలా ఊరట ఇస్తుంది. చాలామంది వర్షంలో తడవడాన్ని ఇష్టపడతారు కూడా. కానీ అమ్మాయిలు వర్షానికి భయపడతారు. చాలామంది వర్షంలో  తడిస్తే హెయిర్ ఫాల్ అవుతుందని, డాండ్రఫ్ వస్తుందని అనుకుంటారు. ఈ కారణాలతోనే వర్షం అంటే ఇష్టం ఉన్నా వర్షంలో తడవడానికి భయపడతారు. పైగా వర్షంలో తడిస్తే వెంటనే ఇంటికి వచ్చి మళ్లీ తలస్నానం చేయాలని కూడా అంటుంటారు. కానీ ఇవన్నీ నిజమేనా? వర్షం గురించి ఉన్న అపోహలు, వాస్తవాలు ఏమిటో తెలుసుకుంటే.. వర్షంలో తడిస్తే జుట్టు రాలుతుందా? వర్షపు నీరు మాత్రమే జుట్టు రాలడానికి ప్రత్యక్ష కారణం కాదని అంటున్నారు నిపుణులు.  ఒత్తిడి, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాలు , కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. తల చర్మం ఎక్కువసేపు తడిగా ఉన్నా లేదా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోయినా జుట్టు రాలే సమస్య పెరుగుతుందట. తొలకరి జల్లులు ఎక్కువ నష్టం కలిగిస్తాయా? వేసవి కాలం కారణంగా చాలా కాలం తర్వాత పడే వర్షాలను తొలకరి జల్లులు అంటారు. చాలాకాలం పొడి వాతావరణం తర్వాత కురిసే తొలినాళ్ల వర్షాలు వాతావరణంలోని దుమ్ము, కాలుష్య కారకాలను కిందకు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది.  అలాంటి తొలి వర్షంలో ఎక్కువ సేపు తడవకుండా ఉండటం హెయిర్ కేర్ విషయంలో ఒక మంచి జాగ్రత్త. అయితే, ప్రతీ తొలి వర్షం ఒకేలా ఉండదు.  స్థానిక కాలుష్యం, వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. వర్షంలో తడిచిన తర్వాత జుట్టు కడుక్కోవడం అవసరమా?  కలుషితమైన గాలిలో పడిన వర్షం లో తడిస్తే.. జుట్టును తేలికపాటి షాంపూతో లేదా  శుభ్రమైన నీటితో కడుక్కోవడం చాలామంచిది.  ఇది దుమ్ము, ధూళి , ఇతర కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఎక్కువగా షాంపూ చేయడం , లేదా పదే పదే తలకు షాంపూ  చేసుకోవడం  కూడా జుట్టును పొడిబారేలా చేస్తుంది. వర్షపు నీరు జుట్టును పొడిగా మారుస్తుందా? వర్షపు నీరు జుట్టును పొడిగా మార్చడం అందరి విషయంలో జరగదు.  జుట్టు ఇప్పటికే  పొడిగా ఉన్నా,  జుట్టుకు ఎలాంటి ప్రోడక్ట్ వాడుతున్నారనే విషయం మీద, వర్షం తర్వాత హెయిర్ ను ఏ విధంగా కేర్ తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవసరమైతే తేలికపాటి కండీషనర్ లేదా సీరమ్ ఉపయోగించవచ్చు. తడి జుట్టుకు మళ్లీ షాంపూ చేయవచ్చా? తడి జుట్టును ఎక్కువసేపు కట్టి ఉంచడం వల్ల తల చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. దీనివల్ల దురద, దుర్వాసన లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు.  ముందుగా జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవడం మంచిది. వర్షంలో తడిశాక హెయిర్ కేర్ ఎలా ఉండాలి? వర్షంలో తడిశాక  ఇంటికి చేరుకున్న వెంటనే  జుట్టును శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.  టవల్‌తో మెల్లగా అద్దాలి, అంతే తప్ప , గట్టిగా రుద్దకూడదు.  హెయిర్ డ్రైయర్ ఉపయోగిస్తే ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచాలి. తడి జుట్టును బలంగా దువ్వకూడదు.  తల చర్మాన్ని ఎక్కువ సేపు తడిగా ఉంచకూడదు.  అవసరమైతే  వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ చేయాలి. వీళ్లకు జాగ్రత్త తప్పనిసరి.. తల చర్మం జిడ్డుగా ఉండేవారు,  ఇప్పటికే చుండ్రు ఉన్నవారు,  తల చర్మం సున్నితంగా ఉన్నవారు. తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తులు, జుట్టుకకు ఎక్కువ రసాయన ఉత్పత్తులు వాడేవారు వర్షంలో తడిసిన తరువాత జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.                                   *రూపశ్రీ.

కనుబొమ్మలు, కనురెప్పలు దట్టంగా పెరగాలంటే ఏం చేయాలి!

కనుబొమ్మలు, కనురెప్పలు దట్టంగా పెరగాలంటే ఏం చేయాలి! ముఖారవిందాన్ని పెంచడంలో కళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి.  అమ్మాయిలు అందంలో బాగంగా కళ్లకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కంటి అందాన్ని పెంచడంలో కనుబొమ్మలు,  కనురెప్పలు కీలక  పాత్ర పోషిస్తాయి. కళ్లు  అందాన్ని పెంచడమే కాకుండా, మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తాయి. అందుకే అమ్మాయిలు  తమ కళ్లను సంరక్షించుకోవడానికి, కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవడానికి , కనురెప్పలను దట్టంగా చేసుకోవడానికి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు.   అయితే, మార్కెట్లో లభించే అనేక ఉత్పత్తులు చాలా ఖరీదు మాత్రమే కాదు.. చాలా రసాయనాలతో ఉంటాయి. ఇవి మంచి చేయకపోగా కళ్లకు హాని చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే కళ్లు, కనుబొమ్మలు దట్టంగా పెరిగేలా చేయడానికి  కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. ఆముదం.. ఆముదం నూనెను చాలా కాలంగా వెంట్రుకల సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. దానిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? పడుకునే ముందు దూదితో  కనుబొమ్మలకు, కనురెప్పలకు కొద్దిగా ఆముదం నూనె రాయాలి. ఉదయం శుభ్రమైన నీటితో కడిగేయాలి. ప్రయోజనాలు.. కనుబొమ్మలు మరింత ఒత్తుగా, దట్టంగా మారతాయి. . కనురెప్పల వెంట్రుకలకు తేమ అందుతుంది.  జుట్టు రాలడం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అలోవెరా.. చర్మ, జుట్టు సంరక్షణకు కలబందను చాలా ప్రజాదరణ పొందిన ఇంటి  చికిత్సగా పరిగణిస్తారు. ఎలా అప్లై  చేయాలి? శుభ్రమైన బ్రష్‌ను ఉపయోగించి తాజా కలబంద జెల్‌ను  కనుబొమ్మలకు , కనురెప్పలకు రాయాలి. 20-30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ప్రయోజనాలు.. జుట్టుకు తేమ అందుతుంది.  కనుబొమ్మలు, కనురెప్పలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. కళ్ల చుట్టూ ఉన్న చర్మం కూడా చల్లబడుతుంది. గ్రీన్ టీ బ్యాగ్.. కళ్ల కింద ఉబ్బుగా లేదా అలసటగా అనిపిస్తే, గ్రీన్ టీ బ్యాగులు ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగించాలి? గ్రీన్ టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత  10-15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ప్రయోజనాలు.. కంటి వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కళ్ళకు తాజాదనం కలిగిన అనుభూతి ఉంటుంది.   కళ్ల కింద నల్లటి వలయాల సమస్య నుండి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది. విటమిన్-ఇ.. విటమిన్ ఇ చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. ఇది బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.    ఎలా ఉపయోగించాలి? విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెను తీసి,  కనుబొమ్మలకు , కనురెప్పలకు సున్నితంగా రాయాలి. ప్రయోజనాలు.. జుట్టుకు పోషణ లభిస్తుంది. కనురెప్పలు మరింత దట్టంగా మారతాయి.  కనుబొమ్మల సహజ మెరుపు పెరుగుతుంది.                                       *రూపశ్రీ.

చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..!

 చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, మచ్చలేని చర్మాన్ని కోరుకుంటున్నారు.ముఖ్యంగా అమ్మాయిలకు మచ్చలేని, కాంతివంతమైన చర్మం కావాలని చాలా కోరికగా ఉంటుంది.  దీనిని సాధించడానికి, ఇందుకోసం అమ్మాయిలు  మార్కెట్లో దొరికే చాలా రకాల రసాయన ఉత్పత్తులను ప్రయోగిస్తుంటారు. అయితే  ఈ  రసాయన ఉత్పత్తులను  పూసిన తర్వాత కూడా ఎటువంటి  మార్పు కనిపించదు,  పైగా కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చర్మం మరింత దారుణంగా కూడా మారుతుంది.కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ముఖ చర్మాన్ని చాలా కాంతివంతంగా మార్చుకోవచ్చు.  ఉదయాన్నే కొన్ని టిప్స్ పాటిస్తే ఇది సాధ్యమవుతుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. మీరు ఉదయం నిద్రలేవగానే ఈ సులభమైన ఐస్ ప్యాక్‌ను మీ ముఖానికి పెట్టుకోవచ్చు. ఈ చిట్కా మీ ముఖానికి కాంతినిస్తుంది. ఇది సన్నని గీతలను కూడా తగ్గించవచ్చు. మెరిసే చర్మం కోస ఇంట్లోనే పాటించాల్సిన చిట్కా.. మెరిసే చర్మం కోసం ఉదయం నిద్రలేవగానే  ఒక గిన్నె తీసుకుని, దానిలో ఐస్ క్యూబ్స్ ను వేయాలి. అందులో నీటిని కూడా వేయాలి. తర్వాత ముఖాన్ని ఆ చల్లని నీటిలో ముంచాలి. ఈ చిట్కా  ముఖానికి మెరుపును తెస్తుంది. ప్రయోజనాలు..  ఉదయం కనీసం 15 నుండి 20 సార్లు ఈ నీటిలో  ముఖాన్ని ముంచాలి. చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల  చర్మ రంధ్రాలు కుంచించుకుపోయి, చర్మం బిగువుగా మారుతుంది. చల్లటి నీటికి గురికావడం వల్ల ఉబ్బు , సన్నని గీతలు తగ్గుతాయి. 25 ఏళ్ల తర్వాత ముఖంపై సన్నని గీతలు కనిపిస్తాయి కాబట్టి, ఈ చికిత్స 25 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చికిత్స చిన్న పిల్లలకు తగినది కాదు. ఐస్ వాటర్ థెరపీ ముఖంపై అధిక నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది. తక్షణ మెరుపు కోసం ఐస్ వాటర్ థెరపీని ప్రయత్నించవచ్చు.                              *రూపశ్రీ.

వర్షాకాలంలో మొటిమలు పెరుగుతున్నాయా.. ఈ సింపుల్ స్కిన్ కేర్ ను ఫాలో అయిపోండి!

వర్షాకాలంలో మొటిమలు పెరుగుతున్నాయా.. ఈ సింపుల్ స్కిన్ కేర్ ను ఫాలో అయిపోండి! వర్షాకాలం వేడి నుండి ఉపశమనాన్ని తెస్తుంది, కానీ అనేక సమస్యలను కూడా తెస్తుంది, వాటిలో ఒకటి మొటిమలు. ఈ కాలంలో చిన్న, ఎర్రటి లేదా చీముతో నిండిన మొటిమలు చాలామందికి వస్తుంటాయి. కానీ వర్షాకాలానికి, మొటిమలకు మధ్య ఉన్న సంబంధం చాలా మందికి తెలియదు. అసలు అవి ఎందుకు వస్తాయో..  వాటిని ఎలా వదిలించుకోవాలో కూడా చాలామందికి తెలియదు.  వర్షాకాలంలో వచ్చే మొటిమల ఆట కట్టించడానికి చాలా సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ ను పాలో అవ్వచ్చు. అసలు వర్షాకాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి, వీటిని నివారించడానికి ఏ స్కిన్ కేర్ పాటించాలి? తెలుసుకుంటే.. వర్షాకాలంలో మొటిమలు.. వర్షపు నీటికి ఆమ్ల గుణం ఉండటం వల్ల అది చర్మానికి చికాకు కలిగించి, ఎరుపుదనాన్ని కలుగజేస్తుంది. తేమ కారణంగా చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి, దీనివల్ల చర్మం నేరుగా కాలుష్యం, ధూళి కణాలు , మురికితో రియాక్ట్ అవుతుంది. గాలిలోని తేమలో వృద్ధి చెందే వైరస్‌లు , బ్యాక్టీరియా మొటిమలకు కారణమవుతాయి. మరీ ముఖ్యంగా  ఈ కాలంలో తీసుకునే అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. జిడ్డు చర్మం మొటిమలు రావడానికి మరింత ఎక్కువ కారణం అవుతుంది. మొటిమలను ఎలా నివారించాలి? తేలికగా ఉండే, pH సమతుల్యత గల క్లెన్సర్‌ను ఉపయోగించి, రోజుకు కనీసం రెండుసార్లు  ముఖాన్ని కడుక్కోవాలి. ఇది అదనపు నూనె, మురికి , కాలుష్యాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ముఖం కడుక్కున్న తర్వాత, మొటిమలను నివారించే టోనర్‌ను అప్లై చేయాలి. టీ ట్రీ , కలబంద వంటి పదార్థాలు చాలా బాగా పని చేస్తాయి. చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి వారానికి రెండుసార్లు  చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి.  చర్మ రకాన్ని బట్టి ఎక్స్‌ఫోలియేటర్‌ను ఎంచుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో కూడా చర్మానికి తేమ అవసరం.  ఇందుకోసం, తేలికైన , చర్మరంధ్రాలను మూసివేయని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. బయటకు వెళ్లే ముందు SPF 30 కంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను రాసుకోవడం మర్చిపోకూడదు. ముఖ్యంగా ముఖాన్ని పదేపదే తాకడం మానుకోవాలి,  ముఖ చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది , దానిని పదేపదే తాకడం వల్ల చేతులకు ఉన్న మురికి  ముఖానికి అంటుకుని మొటిమలకు కారణం అవుతుంది.  జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం, అలాగే జుట్టు ముఖానికి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే జిడ్డుగా ఉండే జుట్టు  చర్మాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మొటిమలు రావడానికి కారణం అవుతుంది. వర్షాకాలంలో మొటిమలకు చెక్ పెట్టాలంటే పై చెప్పుకున్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.                               *రూపశ్రీ.

మీ దగ్గర మ్యాక్సీ స్కర్ట్ ఉందా.. ఈ టాప్స్ తో మీ రూపమే మారిపోతుంది!

మీ దగ్గర మ్యాక్సీ స్కర్ట్ ఉందా?  ఈ టాప్స్ తో మీ రూపమే మారిపోతుంది!  ఫ్యాషన్ ప్రపంచంలో కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ట్రెండ్ నుండి బయటకు వెళ్లవు, వాటిలో మ్యాక్సీ స్కర్ట్ ఒకటి. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, చాలా సొగసుగా ఉంటుంది. అంతకంటే  మల్టీ పర్పోస్ వేర్ గా కూడా సహాయపడుతుంది.   కాలేజీకి వెళ్లినా, ఆఫీస్ మీటింగ్‌కైనా, స్నేహితులతో కాఫీ డేట్‌కైనా, లేదా పార్టీకి వెళ్లాలన్నా మ్యాక్సీ స్కర్ట్ చాలా బాగా సెట్ అవుతుంది.  ఈ స్కర్ట్ అన్ని సందర్భాలలో స్టైలిష్ గా కనిపించేలా చేస్తుంది. చాలా మంది మహిళలు మ్యాక్సీ స్కర్ట్‌లను కొనుగోలు చేసినప్పటికీ, వాటితో ఏ టాప్‌ను జత చేయాలనే విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. సరిగా మ్యాచ్ కాని  టాప్‌ను ఎంచుకోవడం వల్ల  మొత్తం లుక్  పాడైపోతుంది. కానీ స్కర్ట్ లోకి మంచి టాప్ సెలెక్ట్ చేసుకుని ధరించినప్పుడు.. మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు.  మ్యాక్సీ స్కర్ట్ కు ఏ టాప్స్ బాగుంటాయో తెలుసుకుంటే.. ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం.. మ్యాక్సీ స్కర్ట్‌తో ఎల్లప్పుడూ  శరీర పైభాగాన్ని సమతుల్యం చేస్తూ, నడుము ఆకృతిని స్పష్టంగా చూపించే టాప్‌ను ఎంచుకోవాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఫిట్టెడ్ షర్టులు, బేసిక్ టీ-షర్టులు, పెప్లమ్ టాప్‌లు, వెస్ట్‌కోట్‌లు , ఆఫ్-ది-షోల్డర్ టాప్‌లు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో,  స్ట్రీట్ ఫ్యాషన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. మ్యాక్సీ స్కర్ట్‌ను కొత్తగా , స్టైలిష్‌గా మ్యాచ్ చేయాలనుకుంటే కింది ఫ్యాషన్ గైడ్  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లోయీ మ్యాక్సీ స్కర్ట్‌తో బేసిక్ టీ-షర్ట్.. వదులుగా ఉండే మ్యాక్సీ షర్ట్ ఉంటే, వేసవి కాలంలో దాన్ని చాలా స్టైలిష్‌గా , సౌకర్యవంతంగా ధరించవచ్చు. ఈ రకమైన స్కర్ట్ కాలేజీకి, కాఫీ డేట్‌కి, ప్రయాణానికి లేదా వీకెండ్ ట్రిప్ కు  చాలా అనువుగా ఉంటుంది. కానీ ఈ స్కర్ట్‌కు ఏ టాప్ జత చేయాలో  అర్థం కాకపోతే, చాలా సింపుల్‌గా ఉండే టాప్‌ను ఎంచుకోవాలి.  ఒకవేళ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఒక సాధారణ తెల్లటి టీ-షర్టు , వదులుగా ఉండే మ్యాక్సీ స్కర్ట్ చాలా కంఫర్ట్ గానూ, స్టైలిష్ గానూ ఉంటుంది. పెప్లమ్ టాప్‌తో మ్యాక్సీ స్కర్ట్.. పెప్లమ్ టాప్స్ నడుమును హైలైట్ చేస్తూ, శరీరాకృతిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.  మ్యాక్సీ స్కర్ట్ వదులుగా ఉంటే, దానితో పెప్లమ్ టాప్ చాలా బాగుంటుంది. ఇది బ్రంచ్ డేట్, షాపింగ్ , ఫ్యామిలీ మీటింగ్స్  వంటి సందర్భాలకు చక్కటి లుక్ ఇస్తుంది. ఆప్-ద- షోల్డర్ టాప్స్.. పార్టీకి లేదా డేట్ నైట్‌కి సిద్ధమవుతున్నట్లయితే, స్కర్ట్‌తో పాటు   ఆఫ్-షోల్డర్ టాప్‌ను ఎంచుకోవచ్చు. ఒకే  రంగు స్కర్ట్ ఉంటే, దానితో నలుపు లేదా ఎరుపు రంగు టాప్ ధరిస్తే బాగుంటుంది.  ఈ లుక్‌ను పూర్తి చేయడానికి స్టేట్‌మెంట్ చెవిపోగులను జోడిస్తే బాగుంటుంది.  హై హీల్స్ లుక్ ను మరింత మెరుగుపరుస్తాయి. ఈ రకమైన శైలి  ట్రెండ్రీ గా, అట్రాక్షన్ లుక్ ను ఇస్తుంది.  అలాగే ఇది ఫోటోస్ కు మరింత అద్బుతంగా కనిపిస్తుంది. ఫార్మల్ షర్డ్ తో.. ఈ రోజుల్లో ఆఫీస్ ఫ్యాషన్‌లో మ్యాక్సీ స్కర్ట్, షర్ట్ కాంబినేషన్  బాగా ప్రాచుర్యం పొందుతోంది.  లుక్ స్టైలిష్‌గా కనిపించడానికి  షర్ట్‌ను కొద్దిగా ప్యాంటులోపలికి టక్ చేసుకోవాలి. దీనితో పాటు బెల్ట్ వాడాలి.  అలాగే, న్యూడ్ లేదా బ్లాక్ హీల్స్ ధరించాలి.  ఆఫీసు, మీటింగ్స్  లేదా వృత్తిపరమైన కార్యక్రమాలకు ఇది మంచి లుక్ గా నిలుస్తుంది.   వెస్ట్ కోట్ తో శాటిన్ మ్యాక్సీ షర్డ్..  పవర్ డ్రెస్సింగ్ ఇష్టమైతే, వెస్ట్‌కోట్ , శాటిన్ మ్యాక్సీ స్కర్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇది పాతకాలపు రిచ్  ఫ్యాషన్ రూపాన్ని ఇస్తుంది కాబట్టి ట్రెండ్‌లో ఉంది. చాలా నాజూకుగా, గ్రాండ్ గా కూడా  కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దీనికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. శరీరాన్ని బట్టి స్కర్ట్ స్టైలింగ్..  పొట్ట ముందుకు పొడుచుకుని ఉంటే, హై-వేస్టెడ్ మ్యాక్సీ స్కర్ట్‌ను ఎంచుకోవాలి. దానిని పెప్లమ్ టాప్‌తో జత చేయాలి. ముదురు రంగులను ఎంచుకోవాలి.  పొట్టిగా ఉన్నవాళ్లు మోనోక్రోమ్ లుక్‌ను ఎంచుకోవాలి. హై-వేస్టెడ్ స్కర్ట్‌ను ఎంచుకుని, దానికి ప్లాట్‌ఫామ్ హీల్స్‌ను జత చేయాలి.  శరీరాకృతి బొద్దుగా ఉంటే, శరీరానికి అతుక్కుపోయే టాప్స్ ధరించాలి. మరీ వదులుగా ఉండే టాప్స్‌ను ధరించడం మానుకోవాలి. ఈ  మిస్టేక్స్ చేయకండి.. ఓవర్‌సైజ్డ్ స్కర్ట్‌ను ఓవర్‌సైజ్డ్ టాప్‌తో ధరించకూడదు. మరీ పొడవుగా ఉండి నేల మీద ఈడ్చుకుపోయే స్కర్టులను ఎంచుకోవద్దు.   ఒకే దుస్తులలో చాలా ప్రింట్లను కలపవద్దు. తప్పుడు పాదరక్షలు మొత్తం రూపాన్ని పాడుచేస్తాయి. కాబట్టి పాదరక్షల ఎంపిక కూడా జాగ్రత్త వహించాలి.                                 *రూపశ్రీ.

వర్షాకాలంలో ముఖానికి ఏ క్రీమ్ ఉత్తమమైనదో తెలుసా!

వర్షాకాలంలో ముఖానికి ఏ క్రీమ్ ఉత్తమమైనదో తెలుసా! వాతావరణం మారిన ప్రతిసారి శరీరంలో మొదటగా ఇబ్బంది పడేది చర్మమే. చర్మం ప్రత్యక్షంగా ప్రభావానికి లోనవుతుంది.  ముఖ్యంగా వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం జిగటగా మారడం మొదలవుతుంది. అందువల్ల  సీజన్ కు తగ్గట్టుగా ఫేస్ క్రీమ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చర్మానికి తగిన క్రీమ్ ను ఎలా ఎంచుకోవాలో.. ఏ క్రీమ్ బాగుంటుందో తెలుసుకుంటే..  ఇలాంటి వాడకండి.. ఫేస్ క్రీములు చాలా రకాలుగా ఉంటాయి. వాటి టెక్చర్ ను బట్టి ఏ చర్మానికి ఏది బాగుంటుందనే విషయం తెలుసుకోవచ్చు.  వర్షాకాలంలో బరువుగా, జిడ్డుతో కూడుకున్న క్రీములను పూయడం వల్ల చర్మ సమస్యలు మరింత పెద్దవి అవుతాయి. అందుకే బరువుగా ఉన్న క్రీములు వాడకూడదు.  దానికి బదులు తేలికపాటి క్రీమ్స్ వాడాలి. జిడ్డు చర్మం వారు.. వర్షాకాలంలో జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ ఆధారిత క్రీములను ఉపయోగించాలి.   పొడి చర్మం. పొడి చర్మం ఉన్నవారికి వర్షాకాలంలో వాతావరణం కారణంగా చర్మం మరింత పొడిబారి  చర్మం పగుళ్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారు  మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. వర్షాకాలంలో ఇవే బెస్ట్.. వర్షాకాలంలో ముఖానికి తేలికైన జిడ్డులేని, వాటర్ బేస్డ్ క్రీములు ఉత్తమంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వర్షాకాలంలో చర్మం కోసం ఏదైనా కొత్త క్రీమ్ కొనాలని అనుకుంటే ముందుగా చర్మం రకం తెలుసుకుని ఆ తర్వాత క్రీమ్ కొనుగోలు చేయడం, దాన్ని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.                                     *రూపశ్రీ.

జుట్టు వేగంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్.. ఒక్కసారి ట్రై చేయండి!

జుట్టు వేగంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్.. ఒక్కసారి ట్రై చేయండి! ఈ రోజుల్లో జుట్టు విరిగిపోవడం, బలహీనంగా మారడం సర్వసాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలడం నుండి ఉపశమనం పొందడానికి  అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు, మార్కెట్లో లభించే షాంపూలు,  లోషన్లు,  ఆయిల్స్.. ఇళా చాలా ట్రై చేస్తారు. కానీ ఇన్ని చేసిన తర్వాత కూడా వారి జుట్టులో ఎటువంటి చెప్పుకోదగ్గ ఫలితం కనిపించదు. అలాంటి వారికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్ బాగా పని  చేస్తుంది. జుట్టు రాలడాన్ని చాలా తొందరగా కంట్రోల్ చేసే అమ్మమ్మల చిట్కా.. ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.  ఆ టిప్ ఏటో.. దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటే.. కొబ్బరి నూనె.. కొబ్బరినూనె అందరికీ తెలిసిందే.. ఇందులో కొత్తగా ఏముందని అందరికీ అనిపిస్తుంది.  కానీ కొబ్బరి నూనెను అప్లై చేయడమే అసలైన సీక్రెట్.  చాలామంది జుట్టుకు నూనెను కొన్ని సెకెన్లలో చకాచకా అప్లై చేసి జడ వేసుకుంటారు.  కానీ అమ్మమ్మల కాలంలో జుట్టుకు నూనె పెట్టే విధానం పూర్తీగా విభిన్నం. పైగా కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని జోడిస్తే జుట్టు మరింత మెరుగ్గా మారుతుంది. కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం.. జుట్టు సంరక్షణకు ఉల్లిపాయ రసం చాలా మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్, జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  జుట్టుకు కొబ్బరి నూనె , ఉల్లిపాయ రసం రాయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. జుట్టు సంరక్షణ కోసం,  కొబ్బరి నూనెతో పాటు ఉల్లిపాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల జుట్టు పొడిబారడం కూడా తగ్గుతుంది. ఎలా అప్లై చేయాలి? రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను, అంతే పరిమాణంలో ఉల్లిపాయ రసంతో కలపాలి. దీనిని  నెత్తికి పట్టించి, ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత, తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. దీనిని వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు రాలడం చాలా తగ్గుతుంది. కొబ్బరినూనె అలోవెరా.. కలబంద జెల్ రాయడం వల్ల తలపై దురద , చికాకు తగ్గుతాయి. కలబందను ఉపయోగించడం వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనె , కలబంద జెల్ కలిపి  జుట్టుకు రాయడం వల్ల దెబ్బతిన్న జుట్టును బాగుచేయడంలో సహాయపడుతుంది.  జుట్టు చాలా పొడిగా ఉంటే,  కొబ్బరి నూనె , కలబంద జెల్ ను  జుట్టుకు రాసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి? రెండు టీస్పూన్ల కలబంద జెల్ ను,  రెండు టీ స్పూన్ల  కొబ్బరి నూనెను తీసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేయాలి.  ఈ పేస్ట్‌ను  జుట్టుకు పట్టించాలి. 45 నిమిషాల తర్వాత, తేలికపాటి షాంపూతో  జుట్టును కడగాలి. పైన పేర్కొన్న రెండు సీక్రెట్ టిప్స్ జుట్టు రాలడాన్ని ఆపడంలో చాలా సహాయపడతాయి.  జుట్టు పెరగడానికి కూడా తోడ్పడతాయి.                                       *రూపశ్రీ..

ఈ స్ర్కబ్ రాస్తే చాలు.. పాదాల మీద నలుపు, డెడ్ స్కిన్ పోయి కాంతివంతమవుతాయి!

ఈ స్ర్కబ్ రాస్తే చాలు.. పాదాల మీద నలుపు,  డెడ్ స్కిన్ పోయి కాంతివంతమవుతాయి! ఎండ తగలడం వల్ల చర్మం నల్లబడుతుంది. చేతులు, పాదాలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పాదాలపై చెప్పుల గుర్తులు పడతాయి, చేతులు కూడా నల్లగా అవుతాయి. వేసవిలో చెప్పులు, హీల్స్ ధరించడం వల్ల పాదాలు నల్లబడతాయి. దీన్నే టానింగ్ అంటారు.  నల్లబడిన పాదాలను తిరిగి కాంతివంతంగా మార్చుకోవడానికి, పాదాల మీద ఉండే మృత చర్మ కణాలు తొలగడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. టానింగ్ తొలగించే స్ర్కబ్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకుని వాడాలో తెలుసుకుంటే.. శనగపిండి స్ర్కబ్.. టానింగ్‌ను తొలగించడానికి,  శనగపిండితో చేసిన స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. ఈ స్క్రబ్‌ను ఉపయోగించడం వల్ల  పాదాలపై ఉన్న టానింగ్ చాలా తగ్గుతుంది. ఈ స్క్రబ్‌ను ఎలా తయారు చేయాలంటే.. స్ర్కబ్.. కావలసిన పదార్థాలు..  పాదాల నుండి టానింగ్ , మృత చర్మాన్ని తొలగించడానికి,  శనగపిండి స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. శనగపిండి స్క్రబ్‌ను ఉపయోగించడం వల్ల టానింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ స్క్రబ్‌ను తయారు చేయడం చాలా సులభం. స్క్రబ్‌ను తయారు చేయడానికి, రెండు షాంపూ ప్యాకెట్లు, రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా , నిమ్మరసం తీసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. ఎలా వాడాలి.. తయారు చేసిన స్ర్కబ్ ను  వెంటనే  పాదాలకు అప్లై చేయాలి. 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రమైన నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ను వారానికి 2 నుండి 3 సార్లు అప్లై చేయాలి. దీనివల్ల చర్మం నల్లబడటం  తగ్గుతుంది. చేతుల టానింగ్..  చేతులపై ఉన్న నల్ల మచ్చలను, టానింగ్ ను తొలగించడానికి ఈ  స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. ఈ స్క్రబ్ చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  చేతులు మరియు పాదాల చర్మం నల్లగా మారినట్లయితే, ఈ స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. టానింగ్ ఎలా తగ్గించాలి? బేకింగ్ సోడా చనిపోయిన చర్మాన్ని, మురికిని తొలగించి,  చర్మాన్ని స్ఫటికంలా నిర్మలంగా ఉంచుతుంది. శనగపిండి చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి, టానింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. షాంపూ కూడా చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  చర్మం టానింగ్‌ను తగ్గించుకోవాలనుకుంటే, ఈ స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు.                                 *రూపశ్రీ

చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్.. వీటితో జాగ్రత్త!

చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్.. వీటితో జాగ్రత్త!  ఈ రోజుల్లో స్కిన్ కేర్ అమ్మాయిల లైఫ్ స్టైల్ లో  ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దుమ్ము, కాలుష్యం , మారుతున్న వాతావరణం కారణంగా, చర్మం నిరంతరం బయట నుండి నష్టాన్ని ఎదుర్కొంటుంది, అందుకే  చర్మాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చర్మానికి మేలు కలించడం కంటే.. చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. చర్మానికి హాని కలిగించే కొన్ని సాధారణ స్కిన్ కేర్ టిప్స్ ఉన్నాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.  సాధారణంగా ఎంతో మంచివి అనుకునే ఆ టిప్స్ కారణంగానే నేటికాలంలో చాలామంది చర్మ సమస్యలు ఎక్కువ ఎదుర్కుంటున్నారు. కాబట్టి, చర్మానికి హాని కలిగించే సాధారణ స్కిన్ కేర్ మిస్టేక్స్  ఏమిటో తెలుసుకుంటే.. సన్ స్క్రీన్.. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. UV కిరణాలు చర్మాన్ని త్వరగా వృద్ధాప్యం చెందేలా చేస్తాయి, చర్మంపై మచ్చలను పెంచుతాయి,  చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అయితే ఎండలో వెళ్తున్నప్పుడు తప్ప చాలా మంది  సన్ స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు, కానీ సాధారణ రోజులలో ముఖ్యంగా వర్షం పడే  రోజులలో కూడా దీనిని ఉపయోగించడం ముఖ్యం. ఇంటి చిట్కాలు.. నిమ్మరసం, టూత్‌పేస్ట్ లేదా ఇతర వంటగది చిట్కాలను నేరుగా ముఖానికి పూస్తుంటారు. దీనివల్ల చర్మం కమిలిపోవడం,  రంగు మారడం,  చర్మంపై మచ్చలు పెరగడం వంటివి జరిగేలా చేస్తాయి. ఇలాంటి  చికిత్సలు ముఖ్యంగా మొటిమలు వచ్చే లేదా సున్నితమైన చర్మానికి హానికరం. సోషల్ మీడియా టిప్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చర్మ సంరక్షణ చిట్కాలు ఎక్కువగా ఫ్రూవ్ కానివే అయి ఉంటాయి.  చాలామంది వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి టిప్స్ చెబుతూ ఉంటారు. మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్ లేదా ఎగ్జిమా వంటి సమస్యలకు సరైన,  ఫ్రూప్ చేయబడిన ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అంతేకానీ సోషల్ మీడియాలో చూసి ఎప్పుడూ అనుసరించకూడదు. స్కిన్ కేర్ అంటే.. చాలామంది  అమ్మాయిలు  తమ చర్మ సంరక్షణను కేవలం ముఖానికే పరిమితం చేసుకుంటారు, కానీ మెడ, ఛాతీ , చేతులపై కూడా చర్మం తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ భాగాలకు మాయిశ్చరైజర్ , సన్‌స్క్రీన్ రాయడం కూడా చాలా అవసరం. ఫేస్ వాష్.. పదే పదే  ముఖం కడుక్కోవడం లేదా కఠినమైన సబ్బులను వాడటం వల్ల చర్మపు పొర దెబ్బతిని, చర్మం పొడిబారడం, సెన్సిటివిటీ పెరగడం, చివరికి మొటిమలు కూడా రావడం జరుగుతుంది. క్రీమ్స్, లోషన్లు...  తడి చర్మంపై క్రీములు, లోషన్లు వంటి పదార్థాలను పూయడం వల్ల వాటి ప్రభావాలు తీవ్రమై, మంట , చికాకు కలిగే ప్రమాదం పెరుగుతుంది. రెటినోల్ , ఎక్స్‌ఫోలియేటింగ్ యాసిడ్‌ల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ముఖం తుడితే విధానం.. టవల్‌తో ముఖాన్ని రుద్దుతూ తుడుస్తూంటారు.  ఇలా  తుడుచుకోవడం చర్మానికి హానికరం. దీనివల్ల చర్మంపై లైట్ గా  వాపు , మచ్చలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, ముఖాన్ని మెల్లగా తట్టడం ద్వారా తుడుచుకోవాలి. ఇదే మంచి పద్దతి. స్కిన్ కేర్ ప్రోడక్ట్.. చాలా పవర్పుల్ గా  పనిచేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ను  అకస్మాత్తుగా వాడటం చర్మానికి హానికరం కావచ్చు. ఇది చర్మపు రక్షణ పొరను దెబ్బతీసి, చికాకు లేదా రియాక్షన్స్ కు  కారణం అవుతుంది. పైన చెప్పుకున్న స్కిన్ కేర్ పద్దతులు అందరూ చాలా సాధారణం అనుకుంటారు. కానీ ఇవి చర్మానికి మేలు చేయకపోగా హాని ఎక్కువ చేస్తాయి. కాబట్టి జాగ్రత్త పడాలి.                                *రూపశ్రీ.

ప్రతి రాత్రి ముఖానికి కుంకుమాది తైలం రాసుకుంటే ఏం జరుగుతుంది.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..!

ప్రతి రాత్రి ముఖానికి కుంకుమాది తైలం రాసుకుంటే ఏం జరుగుతుంది.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..! ఆయుర్వేదంలో చర్మ సంరక్షణ కోసం చాలా రకాల పద్దతులు ఉన్నాయి.  లేపనాలు,  తైలాలు.. క్రీములు కూడా ఉంటాయి.  కానీ చర్మం కోసం ఆయుర్వేదంలో చాలా గొప్ప తైలం ఉంది.  అదే కుంకుమాది తైలం.  ఇది  చర్మానికి ఒక అద్భుతమైన చికిత్స చేస్తుంది.  దీనిని ప్రతిరోజూ రాసుకుంటే, మచ్చలు, సన్నని గీతలు, పొడిబారడం, మొటిమలు మొదలైన ముఖ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి.  ఇది చర్మాన్ని చాలా కాలం పాటు యవ్వనంగా, మచ్చలేనిదిగా ఉంచుతుంది. కుంకుమాది తైలంలో కుంకుమపువ్వు మాత్రమే కాకుండా, చర్మానికి మేలు చేసే అనేక ఇతర మూలికలు కూడా ఉంటాయి. కుంకుమ పువ్వు నూనె లేదా కుంకుమాది తైలం ఏది మేలు? కుంకుమపువ్వు చర్మానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే కుంకుమాది నూనె మంచిదా లేక కుంకుమపువ్వు నూనె మంచిదా అనే ప్రశ్న తలెత్తుతుంది. కుంకుమాది నూనె అంటే ఇతర మూలికలు లేదా నూనెలతో కలిపి తయారు చేసిన కుంకుమపువ్వు నూనె. మనం స్వచ్ఛమైన కుంకుమపువ్వు నూనెను ముఖానికి రాసుకున్నప్పుడు, అది చర్మంలోకి తగినంత లోతుగా చొచ్చుకుపోదు, దానివల్ల వచ్చే మెరుపు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కుంకుమాది నూనెలో నువ్వుల నూనె, కుంకుమపువ్వు, మంజిష్ఠ, లొద్దుగ , అతిమధురం, చందనం..  చర్మం యొక్క లోపలి పొరలలోకి చొచ్చుకుపోయే అనేక ఇతర మూలికలు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ చర్మానికి అత్యంత ప్రయోజనకరమైనవి. అంతేకాకుండా, కుంకుమపువ్వు యొక్క గుణాలు కూడా చర్మం  లోపలి పొరలలోకి చొచ్చుకుపోయి, లోపలి నుండి ప్రయోజనాలను అందించి, దీర్ఘకాలం పాటు కాంతిని నిలుపుతాయి. కుంకుమాది నూనె చర్మంలోకి శోషించబడి, లోపలి పొరల నుండి పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది, వాపును తగ్గిస్తుంది, చర్మ స్థితిని  మెరుగుపరుస్తుంది , చర్మాన్నిఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది. ఇంట్లోనే కుంకుమాది తైలం ఇలా చేస్కోవచ్చు.. సుమారు 100 మిల్లీలీటర్ల కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకోవాలి. అందులో కొంత కుంకుమపువ్వు కలపాలి, కుంకుమపువ్వు మంచి నాణ్యతగా ఉన్నది తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. తరువాత, చిటికెడు మంజిష్ఠ వేరు పొడి, కొంచెం లొద్దుగ వేరు, అర చెంచా అతిమధురం పొడి లేదా వేరు ముక్కలు,   కొన్ని చుక్కల స్వచ్ఛమైన చందనం నూనె కలపాలి. చందనం నూనె బదులు చందనం పొడి లేదా చందనం ముక్క ఉన్నా సరిపోతుంది. ఈ పదార్థాలన్నింటినీ మందపాటి అడుగు ఉన్న పాత్రలో వేసి, మధ్యమధ్యలో కలుపుతూ, 30 నుండి 40 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. నూనెను ఎక్కువ సేపు మరిగించకూడదు. అది మాడిపోకుండా చూసుకోవాలి.  తరువాత మంటను ఆపివేసి, చల్లారనివ్వాలి. సూనె చల్లారిన తర్వాత, ఒక పలుచని కాటన్  వస్త్రం ఉపయోగించి దానిని ఒక పాత్రలోకి వడకట్టాలి. నూనె డైరెక్ట్ సూర్యరశ్మికి గురికాకుండా ఉండేందుకు, దానిని ముదురు రంగు సీసాలో ఉంచాలి.  ఈ నూనె మూడు నెలలు కదపకుండా,  సూర్యరశ్మి తగలకుండా వెలుతురు ఎక్కువగా లేని ప్రాంతంలో స్టోర్ చేయాలి. ఇలా చేస్తే 3 నెలల తర్వాత అద్బుతమైన రిజెల్ట్ ఇచ్చే  కుంకుమాది తైలం తయారైనట్టే. ప్రయోజనాలు.. కుంకుమాది నూనె ఒకటి రెండు చర్మ సమస్యలకు మాత్రమే కాకుండా చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే ఈ నూనె  పని.  దీన్ని రోజూ రాసుకుంటే, కొన్ని వారాల్లోనే  చర్మంపై ఉన్న మచ్చలు లేదా గందరగోళంగా ఉన్న చర్మపు రంగు మెరుగుపడుతుంది. మంజిష్ఠ , అతిమధురం మెలనిన్ రియాక్షన్ ను తగ్గిస్తాయి. దీని అర్థం, చర్మానికి ముదురు రంగును ఇచ్చే మెలనిన్ తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్ వంటివి మెల్లిగా తగ్గుతాయి. ఈ నూనె ప్రత్యేకంగా మొటిమల మచ్చలు, మెలస్మా , సూర్యరశ్మి వల్ల ఏర్పడే మచ్చలకు చికిత్స చేస్తుంది. నువ్వుల నూనె చర్మానికి లోతుగా తేమను అందించి, తేమను నిలుపుతుంది. అందువల్ల చాలా పొడిగా,  పొలుసులుగా ఉండే చర్మం ఉన్నవారు కుంకుమాది నూనె రాసుకుంటే చాలామంచి ప్రయోజనం ఉంటుంది. కుంకుమాది నూనెలోని లొద్దుగ,  చందనంలో ఉండే చల్లదనాన్నిచ్చే గుణాలు మొటిమల బారిన పడే చర్మానికి ఉపశమనాన్ని అందిస్తాయి. వాటిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.  ఈ నూనెలోని ఇతర మూలికలలో చర్మాన్ని రిపేర్ చేసే గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొల్లాజెన్‌ను మెరుగుపరచడానికి, చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి , క్రమంగా సన్నని గీతలను తగ్గించడానికి పనిచేస్తాయి. కుంకుమాది తైలంలో  కళ్ల చుట్టూ సున్నితంగా మర్దన చేయడం వల్ల నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు . కళ్లలో పిగ్మెంటేషన్ మరియు బలహీనత కారణంగా ఈ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఎలా ఉపయోగించాలంటే.. కుంకుమాది నూనెను రాత్రిపూట ఉపయోగించడం ఉత్తమం, ఎందుకంటే ఇది చర్మాన్ని బాగుచేసే నూనె.  రాత్రిపూట మెరుగైన ఫలితాలను అందిస్తుంది. రాత్రి సమయమే చర్మం తనను తాను బాగుచేసుకునే సమయం, కాబట్టి ఈ నూనెను ఉపయోగించడానికి ఇది సరైన సమయం. కుంకుమాది తైలం  ఉపయోగించేటప్పుడు క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి.. చర్మాన్ని బాగుచేయడానికి కుంకుమాది తైలం రాసుకున్న తర్వాత, ముఖానికి మరే ఇతర మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లేదా మేకప్ మొదలైనవి రాసుకోకూడదు. ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, కొన్ని చుక్కల కుంకుమాది నూనెను అరచేతిలో వేసుకుని గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ తర్వాత, దానిని ముఖంపై వృత్తాకార కదలికలతో సున్నితంగా రాయాలి. రాసిన తర్వాత, అది చర్మంలోకి ఇంకడానికి కొంత సమయం ఇచ్చి, ఆ తర్వాతే నిద్రపోవాలి.  పగటిపూట కుంకుమాది నూనెను పూయాలనుకుంటే, కేవలం ఒక చుక్క తీసుకుని మాయిశ్చరైజర్‌లో కలపాలి. దానిపై తప్పకుండా బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను పూయాలి.  కుంకుమపువ్వు ఫోటోసెన్సిటివిటీకి కారణం కావచ్చు, అంటే దానిని పూసిన తర్వాత సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే కుంకుమాది తైలం వాడిన తర్వాత ఎండలోకి వెళ్లకూడదు. మెరుగైన ఫలితాల కోసం 4 నుండి 5 వారాల పాటు నిరంతరం వాడండి.                                          *రూపశ్రీ.