English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లో దొంగలు పడ్డారు!

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్త టాస్క్‌లతో అలరిస్తోంది. కాగా నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి దొంగలు వచ్చి, కంటెస్టెంట్స్‌కి సరిపడా ఉన్నంత ఫుడ్‌ని మొత్తం తీసుకెళ్ళిపోయారు. దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళడానికి కారణం అంతకముందు మొదలైన 'సెలబ్రిటీ లీగ్ టాస్క్'. ఈ టాస్క్‌లో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో సెలబ్రిటీ పాత్ర ఇచ్చి, ఆ పాత్రలోనే టాస్క్ సమయం ముగిసేవరకు ఉండాలని బిగ్ బాస్ చెప్పగా, ఎవరు కూడా ఆశించినంతగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ కి కోపం‌ వచ్చి, అందరిని వెళ్ళిపోమని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళారు. "ఎప్పుడు అయితే కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పిస్తారో అప్పుడే ఫుడ్ వస్తుంది" అని చెప్పాడు బిగ్ బాస్. ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం తమకు నచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.

"తిండి దండగ అని సింబాలిక్ గా చెప్తున్నాడు బిగ్ బాస్" అని ఒకరు, "ఇది కదా కావాల్సింది. ఫుడ్ కోసం వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు నిజమైన గేమ్ ఆడుతున్నారు." అని ఇలా నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా ఫుడ్ కోసం అయినా కంటెస్టెంట్స్‌ పర్ఫామెన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారో? లేదో? చూడాలి మరి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.