English | Telugu

బాల‌య్యా మ‌జాకా.. రానాని ఆడేసుకున్నాడుగా!

`ఆహా` ఓటీటీ కోసం హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా మారిన విష‌యం తెలిసిందే. `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో కు బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఎపిసోడ్ తో ఈ టాక్ షో మొద‌లైంది. అప్ప‌టి నుంచి పేరుకు త‌గ్గ‌ట్టే అన్‌స్టాప‌బుల్ గా ర‌న్న‌వుతూ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. తాజాగా ఎమిద‌వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని `ఆహా` టీమ్ రిలీజ్ చేసింది.

ఈ ఎపిసోడ్ కి రానా ద‌గ్గుబాటి గెస్ట్ గా రాబోతున్నారు. ప్రోమోలో బాలయ్య .. హీరో రానాని గ‌ట్టిగానే ఆడేసుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. షో లోకి ఎంట్రీ ఇచ్చిన రానా .. "నా షోలో బెస్ట్ ఎపిసోడ్ ప్ర‌తీ సీజ‌న్ లో మీదే" అనడం దానికి బాల‌య్య "కొత్త‌గా ఏదైనా చెప్పు బాల‌కృష్ణ అంటేనే బెస్ట్" అని అన‌డం...`ఫ‌స్ట్ టైమ్ బాల‌కృష్ణ టాక్ షో చేస్తున్నాడంటే నీకు ఏమ‌నిపించింది?' అని రానాని బాల‌య్య అడిగితే... "మేమంతా ట్రైన్ లో వ‌స్తుంటే మీరు మాత్రం బుల్లెట్ ట్రైన్‌లో వ‌చ్చార‌నిపించింది" అన్నాడు రానా.

Also read:"నేను ఇండ‌స్ట్రీకి పెద్ద‌దిక్కుగా ఉండ‌ను".. చిరంజీవి సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

`లాక్‌డౌన్ టైమ్ లో వ్యాక్సిన్ వ‌స్తుంద‌నుకుంటే నీ పెళ్లి న్యూస్ వ‌చ్చిందేంట‌య్యా బాబూ'.. అని బాలయ్య అన‌డంతో అంతా గొల్లున న‌వ్వేశారు. ఇక మాట‌ల్లోనే ఫోన్ తీసి, "రానా ద‌గ్గుబాటి అని గూగుల్ చేస్తే.. నువ్వు ఎంత మందికి నో చెప్పావో.. ఎంత మందికి హ్యాండిచ్చావో గూగుల్ చెబుతుంది" అనేశాడు. వెంట‌నే రానా `అది ఊరికే సార్ కావాల‌ని వాళ్ల‌కు వాళ్లే రాసేసుకుంటారు` అనగానే ఆ మాట‌ల‌కు బాల‌య్య ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ అదిరింది.

Also read:'అఖండ' క‌లెక్ష‌న్ల‌ను త‌ట్టుకోలేక దిగాలుప‌డ్డ వ్య‌తిరేక వ‌ర్గం!

'అంద‌గాడు గురించి రాస్తారులే.. ఆర‌డుగుల బుల్లెట్టు'.. అంటూ మ‌రో పంచ్ పేల్చారు. అంతేనా ప్రోమో చివ‌ర్లో `కొంచెం బ్యాలెన్స్ వ‌చ్చేసింది. అప్ప‌ట్లో పూల‌రంగ‌డిలా తిరిగే వాడివి'.. అని బాల‌య్య అన‌డంతో `ఓహో ఈ షో ఇలాగెలుతోందా?'.. అని రానా అన‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఈ నెల 7న ఈ ఎపిసోడ్ `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రోమోనే ఈ రేంజ్ లో వుంటే ఎపిసోడ్ ర‌చ్చ ర‌చ్చే అంటున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.