English | Telugu

అధికారం కోసం ఓ అత్త... మమకారం కోసం కోడళ్ళు

'దేవతలారా దీవించండి' అనే అద్భుతమైన సీరియల్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీ తెలుగు, ఇప్పుడు 'కోడళ్ళు మీకు జోహార్లు' అనే మరో ఆసక్తికరమైన సీరియల్ తో ఈ సోమవారం నుండి ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. అత్తాకోడళ్ల ఆధిపత్యపోరు నేపధ్యంగానే వస్తున్నప్పటికీ, ఈ సీరియల్ కాస్త భిన్నంగా హాస్యభరిత మరియు ప్రతీకార సన్నివేశాలతో తెరకెక్కించబడింది. ఈ సీరియల్ ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రసారం కానుంది.

పవిత్ర, కౌస్తుభా మని, దుర్గశ్రీ, మరియు నాగార్జున ప్రధానపాత్రదారులుగా వస్తున్న ఈ సీరియల్, ఇప్పటికే విడుదలైన ప్రోమోతో అందరిని ఆకట్టుకుంటుంది. కథలోపటికీ వెళ్తే, కుటుంబ సభ్యులని మోసంచేస్తూ రేఖ (పవిత్ర) తన అక్కకొడుకు శేఖర్ నుండి కుటుంబవ్యాపారాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అంతేకాకుండా, వ్యాపారంలో తన కొడుకు తారక్ (నాగార్జున) పలుకుబడిని పెంచుకుంటూ పోతుంది. తన అధిపత్యానికి ఎటువంటి హాని కలగకూడదని, సున్నితస్థురాలైన మిథునని (కౌస్తుభా మని) ఇంటి కోడలిగా తెచ్చుకుంటుంది. ఐతే, మిథున చెల్లెలైన వైష్ణవి (దుర్గశ్రీ) ఎప్పటికప్పుడు రేఖ ఆగడాలకు మరియు తన ఆధిపత్యకాంక్షలకు అడ్డుకట్టవేస్తూ తన అక్కని కాపాడుకుంటూవస్తుంది.

ఈవిధంగా, రేఖ మరియు మిథున మధ్య జరిగే ఆధిపత్యపోరాటం కొన్నిసార్లు నవ్వులుపూయిస్తూ మరికొన్ని సార్లు ఉద్వేగాన్ని రేకెత్తిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది.ఈ సీరియల్ ప్రారంభోత్సవం సందర్బంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ (తెలుగు) శ్రీమతి అనురాధ గూడూరు మాట్లాడుతూ, 'కోడళ్ళు మీకు జోహార్లు' సాధారణంగా అత్తాకోడళ్ల నేపథ్యంలో వచ్చే కథాంశాలకన్నా భిన్నంగా ఉంటుందని, ఇందులోని సన్నివేశాలు నిజజీవితంలో ఒక సాధారణ కుటుంబంలో జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటాయని చెప్పారు. అలాగే ఈ సీరియల్ పాసిటివిటీని పెంపోందిస్తుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఈ వినూత్న కథాంశాన్ని ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.