English | Telugu

Karthika Deepam2 : గాయపడిన అత్త మనసు.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -495 లో....సుమిత్ర గురించి దశరథ్ బాధపడతాడు. కార్తీక్ వచ్చి.. మావయ్య అత్త మనసు గాయపడింది. ఇప్పుడు రావడానికి ఇష్టపడడం లేదు.. కొంచెం అత్తకి టైమ్ ఇవ్వండి ఎక్కడున్నా వచ్చేస్తుందని కార్తీక్ దైర్యం చెప్తాడు. పాపం దశరథ్ ని చుస్తే జాలేస్తుంది. అయిన ఏదో కనుక్కుంటానని వెళ్లావు ఏమైంది అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. మమ్మీ దీప దగ్గర ఉందో చుడడానికి వెళ్ళాను కానీ అక్కడ లేదు. . బావ కొత్త గేమ్ స్టార్ట్ చేసాడు.. అదేంటో కనుక్కోవాలని జ్యోత్స్న అంటుంది.

ఆ తర్వాత అసలు అమ్మమ్మ ఇక్కడ ఎందుకు ఉంది.. జ్యోత్స్న వస్తే ఎందుకు చెప్పొద్దన్నావని దీపని శౌర్య అడుగుతుంది. ఇది దాగుడు మూతల ఆట జ్యోత్స్న వస్తే అమ్మమ్మ దొరికిపోతుంది కదా అని దీప అంటుంది. మరొకవైపు నేను వేరొక ఇల్లుకి షిఫ్ట్ అవుతానని శ్రీధర్ తో కాశీ చెప్తాడు. వద్దని అన్నా కూడా కాశీ వినడు.. దాంతో నీ ఇష్టం కానీ మంచి ఇల్లు తీసుకోమని శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణకి జ్యూస్ తీసుకొని వస్తుంది జ్యోత్స్న. వద్దని శివన్నారాయణ అంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని జ్యోత్స్నని దశరథ్ అంటాడు. అసలు మమ్మీ వెళ్లడానికి కారణం నువ్వే కదా డాడీ అని జ్యోత్స్న అంటుంది. ఇద్దరిని విడగొట్టింది. నువ్వే అని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. శివన్నారాయణ బీపీ పెంచుకుంటుంటే.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు జ్యోత్స్న అని పారిజాతం అక్కడ నుండి పంపిస్తుంది.

ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి శౌర్య వచ్చి.. అమ్మమ్మ మీరు దాగుడుమూతలు ఆడుతున్నారంట కదా.. ఇందాక జ్యోత్స్న వచ్చింది.. నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పలేదు. తాత, ముద్దుల తాత కూడా వస్తాడా అని శౌర్య అనగానే నాకోసం ఎవరు రారని సుమిత్ర సమాధానం చెప్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి అమ్మమ్మ రెస్ట్ తీసుకుంటుందని శౌర్యని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.