English | Telugu

మోనిత జైలుకు వెళ్లినా... కార్తీక్ ఫ్యామిలీకి టెన్షన్ ఎందుకంటే?

మోనిత అరెస్టుతో కార్తీక్, దీప కుటుంబానికి ఇక ఎటువంటి అడ్డు లేదని... కథ సుఖాంతం అవుతుందని భావించిన వీక్షకులకు 'కార్తీక దీపం' సీరియల్ దర్శకుడు ట్విస్ట్ ఇస్తున్నాడు. కథను మరింత కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తాజా ఎపిసోడ్స్ ద్వారా స్పష్టం చేస్తున్నాడు. కార్తీక్ ఫ్యామిలీకి మోనిత అడ్డు ఇంకా తగ్గలేదని టెన్షన్ తప్పదని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశాడు.

మోనితను కార్తీక్ హత్య చేశాడని అభియోగం మీద పోలీసులు అతడిని అరెస్టు చేయడం, సరిగ్గా తీర్పు వెలువరించే సమయంలో ఎవరినైతే తన భర్త హత్య చేశాడని అంటున్నారో ఆమెను కోర్టులోకి దీప తీసుకురావడంతో కథ మొత్తం మారిపోయింది.‌ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబును నిర్దోషిగా విడుదల చేయడంతో పాటు కోర్టు సమయాన్ని వృథా చేయడంతోపాటు హత్యకు గురైన నాటకాన్ని ఆడిన మోనితకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

కార్తీక్ ఇంటికి... మోనిత జైలుకు వెళ్లడంతో వంటలక్క అలియాస్ దీప జీవితంలో ఎటువంటి టెన్షన్ లేదని అభిమానులు హ్యాపీ ఫీలయ్యారు.‌ అయితే, కార్తీక్ వీర్యం ద్వారా మోనిత కృత్రిమ ఈ పద్ధతుల ద్వారా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆ బిడ్డను అడ్డుపెట్టుకుని ఎలాగైనా కార్తిక్ చేత తాళి కట్టించుకుని ప్రయత్నం చేస్తుందని కార్తీక్ తల్లి సౌందర్య అనుమానపడుతుంది. అదేవిధంగా మోనిత కూడా జైలు నుంచి కార్తీక్ ఇంటికి రత్నసీత చేత ఒక బ్యాక్ పంపిస్తుంది. అందులో చిన్న పిల్లల ఫోటోలు ఉంటాయి. మనకు పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటాడని, ఈ ఫోటోలో మీ పడక గదిలో అంటిస్తే సంతోషిస్తానని, ప్రతి అడుగులోనూ గుర్తొస్తున్నావని, మన బాబు కి మీ నాన్నగారి పేరు ఆనంద్ పెట్టానని మోనిత ఓ లేఖ రాస్తుంది. చివర్లో ఇట్లు నీ సహధర్మచారిణి 2 అని పేర్కొంటుంది. అలాగే దీప ఫోనులో తాను బెదిరింపులకు పాల్పడిన వీడియోలను రత్న సీత చేత డిలీట్ చేయిస్తుంది. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది. తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.