English | Telugu

శ్రద్దా చాలా హాట్ అంటున్న జానీ మాస్టర్

ఢీ సీజన్ 14 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, హీరోయిన్ శ్రద్దాదాస్ జడ్జెస్ గా వచ్చారు. ఈ షోలో హైపర్ ఆది కామెడీ కామన్ అనే విషయం అందరికీ తెలుసు. ఆది పక్కనే ఉన్న అఖిల్ ని ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లయ్యిందని అడిగాడు. పదేళ్లు అయ్యింది అని అఖిల్ అనేసరికి ఎంత సంపాయించావ్ అని మళ్ళీ ఆది అడుగుతాడు. బానే సంపాయించా అన్నాడు. "అసలు ఏమీ చేయకుండానే ఇంత సంపాదించావంటే, ఏమన్నా చేసుంటే ఇంకెంత సంపాదించేవాడివో" అంటూ పంచ్ వేశాడు. దానికి అందరూ గట్టిగా నవ్వేశారు.

అనంతరం జడ్జి శ్రద్దాని ఆది ఒక క్వశ్చన్ అడిగాడు. "గణేష్, జానీ మాస్టర్స్ ఇద్దరిలో ఎవరు నాటీ? ఎవరు స్వీటీ? అని అడిగాడు. జానీ మాస్టర్ నాటీ.. గణేష్ మాస్టర్ స్వీటీ అని శ్రద్దా ఆన్సర్ ఇచ్చింది. పక్కన కూర్చుని ఎంత ఇబ్బంది పెట్టకపోతే అలా మాట్లాడుతుంది చెప్పు అని ఆది అన్నాడు. తర్వాత శ్రద్దా జానీ మాస్టర్ ఇవాళ నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పేసరికి.. ఏమన్నాడని ఆది చాలా ఇంటరెస్టింగ్ గా అడిగాడు. నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్ అన్నాడు.. అని చెప్పడంతో ఆది సడెన్ గా కూర్చున్నవాడల్లా లేచి నిలబడి నాకు తెలిసి పశుపతి కూడా అరుంధతిని కొంచెమే ఇబ్బంది పెట్టుంటాడు. జానీ మాస్టర్ మాత్రం... బాబోయ్ అంటూ అతనికి ఆది దణ్ణం పెట్టేస్తాడు. ఆది పంచ్ కి అందరూ గట్టిగా నవ్వేశారు. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.