English | Telugu

బిగ్‌బాస్ హౌస్ లో అవినాష్‌ రొమాన్స్.. లైట్స్ ఆఫ్ చేసిన బిగ్‌బాస్

బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వా ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. అందరు టైడ్ గా కన్పిస్తున్నారు. వెళ్లి అందరు ఒక గంట పడుకోండి అనగానే అందరు హ్యాపీగా వెళ్లి పడుకుంటారు. అందరు పడుకున్నాక అవినాష్ పక్కన తన భార్య అనుజ వచ్చి పడుకుంటుంది. దాంతో అవినాష్ ఒక్కసారిగా లేచి సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. బ్లాక్ డ్రెస్ వేసుకున్నావ్ నేను వేసుకొని వస్తానని డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు.

ఆ తర్వాత అనుజ అందరితో మాట్లాడుతుంది. ఆ తర్వాత అనూజని పక్కకి తీసుకొని వెళ్లి తన పర్ఫామెన్స్ గురించి అడుగుతాడు. ఓల్డ్ వాళ్ళతో కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చెయ్.. మిగతా అంత ఒకే అని చెప్తుంది. అప్పుడే బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చెయ్యమన్నారు. కదా అవినాష్ యాక్షన్ రూమ్ కి రమ్మని పిలుస్తాడు. దాంతో ఇద్దరు యాక్షన్ రూమ్ కి వెళ్తారు. బిగ్ బాస్ వాళ్ళ కోసం క్యాండిలైట్ సెట్ ని అరెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేస్తాడు. లైట్స్ ఆఫ్ చేస్తే ఏంటి కెమెరాలు ఉన్నాయ్ కదా.. ప్లీజ్ బిగ్ బాస్ కాస్తా అటు తిప్పుకోండి అని అవినాష్ అంటాడు.

ఆ తర్వాత నేను నిన్ను మిస్ అవుతున్నాను.. రోజు టీవీలో చూస్తున్నానని అనూజ అనగానే అవినాష్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత అనూజ ఒక టాస్క్ ఆడుతుంది. అందులో కొంత అమౌంట్ మరియు కిచెన్ టైమ్ అని ఉంటుంది. ఇక కిచెన్ టైమ్ తీసుకోకుండా ప్రైజ్ మనీకి ఆడ్ అయ్యేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక అనూజ, అవినాష్ బయటకు వచ్చేటప్పుడు లోపల ఏదో జరిగినట్టుగా యాక్ట్ చేస్తుంటారు. అది చూసిన రోహిణి.. లోపల ఏం లేదు డొల్లా అంటుంది. ఇక అనూజ అందరి ముందు అవినాష్ ని హగ్ చేసుకొని.. అమ్మో అందరు చేస్తున్నారని అంటుంది. ఇక తన సమయం అయినందున అందరికి బై చెప్పేసి మెయిన్ గేట్ నుండి వెళ్తుంది అనూజ. తను బయటకు వెళ్తుంటే ఐ లవ్ యూ అనూ అంటు అవినాష్ గట్టిగా అంటాడు. ఇక ఇదంతా చూసిన టేస్టీ తేజ ఎమోషనల్ అవుతాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.