English | Telugu

Brahmamudi : అప్పు మొదటి వంట.. కళ్యాణ్ ఏం చెప్పనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -492 లో.. కళ్యాణ్ తను గతంలో రాసిన పుస్తకం దొరకడంతో దాన్ని తీసుకుని ఆ పుస్తకం పబ్లిష్ చేసిన పబ్లీషర్ దగ్గరకు వెళ్లడంతో అతడు గతంలో నీకు ఇవ్వాల్సిన డబ్బులు అంటు ఆరు వేలు చేతిలో పెటతాడు. కవితలు ఆపి, కథలు రాయమని చెప్తాడు. మరోవైపు అప్పూ చక్కగా జీన్స్ మీద కాస్త పొడవాటి టాప్ వేసుకునివేసుకునిమెడలోమెడలో పసుపు తాడు పైకి వేసుకుని చేతిలో గరిటె పట్టుకుని వంట చేస్తుంది. వంట అంటే మంట పెట్టుడే అనుకున్నా.. ఇందులో ఇన్ని వేయాల్నా.. ఇందులో సగం ఐటమ్స్ లేనే లేవు.. కూర ఎట్లుంటదో ఏంటో.. కవిగాడు ఎట్లా తింటాడో ఏమోనని అప్పు తనలో తానే మాట్లాడుకుంటూ.. వీడేంది ఇంకా రాలేదనినుకుంటుంది అప్పు ఇంతలో కళ్యాణ్ వచ్చి. అప్పూ. అని పిలుస్తాడు.

కవి వస్తున్నా‌నంటూ వంట పూర్తికావడంతో, స్టవ్ ఆఫ్ చేసి కళ్యాణ్ ముందుకు వస్తుంది. లేట్ అయ్యింది ఏందిరా భయ్.. నాకు ఇక్కడ టెన్షన్ అయితోందని అప్పు అంటుంది. ఎందుకు అప్పు టెన్షన్ అని కళ్యాణ్ అంటాడు. హా.. నన్ను ఎత్తుకునిపోయినట్లు నిన్ను కూడా ఆ అనామిక ఎత్తుకుని పోతుందని అప్పు అనగానే.. కవి కూడా నవ్వుతాడు. సరే కాళ్లు చేతులు కడుక్కునిరా.. నేను అన్నం పెడతానంటుంది అప్పు. కళ్యాణ్ అలా వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు.. అచ్చం అమ్మాయిలా.. వండిన వంటకాలన్నీ తెచ్చేస్తుంది. కళ్యాణ్ వచ్చి కూర్చుంటాడు. పక్కనే కూర్చున్న అప్పు.. తనకు, కవికి కంచంలో అన్నం పెడుతూ.. ఏమైనా జాబ్ దొరికిందా అని అడుగగా.. జాబ్ దొరకలేదు కానీ‌జీతం దొరికింది. 6 వేలు అంటూ జేబులోంచి తీసి చూపిస్తాడు. జీతం ఏందని అప్పు అనగానే.. అదే అప్పు.. అప్పట్లో మా వదిన నాకు తెలియకుండా నా కవితలు బుక్ వేయించింది కదా.. ఆ బుక్ తాలూకా పబ్లీషర్స్‌ని కలిస్తే.. అప్పటి నుంచి ఇవ్వాలనుకుంటున్న రాయల్టీని ఇప్పుడు అందించారని కళ్యాణ్ అంటాడు. దాంతో అప్పు చాలా సంతోషిస్తుంది. అబ్బా కరెక్ట్ టైమ్‌కి ఇచ్చిండ్రా భయ్.. మరి కవితలు రాయడం గురించి అదీ అడగలేదా అని అప్పు అనగానే.. కవితలకు ఇప్పుడు అంత డిమాండ్ లేదట.. నన్ను కథలు రాయమన్నారంటూ కళ్యాణ్ జరిగింది చెబుతాడు.

మరి రాస్తావా? అయినా మీ ఇంట్లో రోజుకో బాగోతం జరుగుతుంది కదా.. అవే రాసెయ్ అని అప్పు అనగానే.. వెంటనే కవి కోపంగా వేలు చూపిస్తూ.. హేయ్ అని కోపంగా అంటాడు. దాంతో అప్పు నవ్వేస్తుంది.‌నిజంగానే ట్రై చెయ్‌రా.. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావ్ అని అంటూనే.. సరేలే తిను.. మంచిగా లేకపోతే తిట్టుకోకని కూర వేస్తుంది. మనకు ఇదైనా దొరికింది.. మా ఇంట్లో అన్నం ప్లేట్ ముందు పెట్టుకుని తినకుండా చాలాసార్లు లేచి వెళ్లిపోయాను.. అన్నం విలువ.. ఆకలి విలువ అప్పుడు తెలియలేదు.. ఇప్పుడు తెలుస్తోందని కళ్యాణ్ అంటాడు. అప్పు కూడా కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంది. ఇక అన్నం కలిపి తిన్న కళ్యాణ్ ఆ రుచిని చూసి ఆగిపోతాడు. తాను చేసిన వంట ఎలా ఉందా? అన్నట్లుగా కళ్యాణ్ వైపు కన్ను ఆర్పకుండా చూస్తుంది అప్పు. ఇంతకీ ఆ కర్రీ ఎలా ఉంది? కళ్యాణ్ ఏం అన్నాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.