English | Telugu

టీఆర్పీలో నెంబర్ వన్ గా నిలిచిన గుండెనిండా గుడిగంటలు!

తెలుగు టీవీ సీరియల్స్ అన్నింటిలో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ప్రతీ వారం అత్యధిక టీఆర్పీ వస్తుంది. అయితే గత నాలుగు నెలల క్రితం వరకు బ్రహ్మముడి సీరియల్ నెంబర్ వన్ లో నిలవగా.. ప్రస్తుతం ఆ రికార్డుని గుండెనిండా గుడిగంటలు సీరియల్ బ్రేక్ చేసింది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో బాలు, మీనాల పాత్రలు తెలుగువారికి తెగ నచ్చేస్తాయి. మొదట్లో తాగుతూ భాద్యత లేకుండా కన్పించిన బాలు, మీనాని పెళ్ళి చేసుకొని కామన్ మ్యాన్ గా మారిపోయాడు. ఇక బాలు వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే తనని జైలులో పెట్టించడంతో.. అమ్మ ప్రేమకి దూరమయ్యాడు. ఇక వాళ్ళ అమ్మ చేసే అప్పులకి ఇళ్ళంతా బాదల్లోకి వెళ్ళడంతో కుటుంబ భారాన్ని బాలు తీసుకుంటాడు. బాలుని అర్థం చేసుకునే భార్యగా మీనా సపోర్ట్ ఇస్తుంది. ఇదే ప్రస్తుతం ఈ సీరియల్ ని నెంబర్ స్థానంలో నిల్చోబెట్టింది. అయితే స్టార్ మా సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి కొత్త సీరియల్స్ రావడంతో సాయంత్రం టైమ్ స్లాట్ నుండి బ్రహ్మముడి సీరియల్ ని తీసి మధ్యాహ్నం టైమ్ స్లాట్ లో వేయడంతో బ్రహ్మముడి టీఆర్పీ పడిపోయింది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 9.27 తో అగ్రస్థానంలో ఉండగా, పడమటి సంధ్యారాగం 9.11 తో రెండో స్థానంలో ఉంది. కార్తీకదీపం-2 సీరియల్ 8.90 రేటింగ్ తో మూడో స్థానంలో ఉండగా, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి 8.47, మేఘసందేశం సీరియల్ కి 8.38 రేటింగ్ వచ్చేసింది. ఇక ఈ వారం టాప్-5 లో మూడు స్టార్ మా సీరియల్స్ చోటు దక్కించుకున్నాయి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.