English | Telugu

Duvvada Madhuri vs Tanuja : కడుపు మాడ్చుకున్న దువ్వాడ మాధురి.. భరణి కోసమేనా!

బిగ్ బాస్ సీజన్-9 లో దువ్వాడ మాధురి హౌస్ లోకి వెళ్ళిన నుండి కంటెంట్ ఇవ్వడానికి ఫుల్ ట్రై చేస్తోంది. ఎక్కడ స్కోప్ దొరికితే అక్కడ గొడవేసుకొని, జనాల మీద అరిచేసి కంటెంట్ ఇస్తుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మార్నింగ్ సాంగ్ కి అందరు డ్యాన్స్ చేసి ఎక్కడివాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. ఇక సంజన, మాధురి ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు.

రాత్రి తనూజతో జరిగిన గొడవ గురించి సంజనతో మాధురి చెప్పింది. నాకు నిన్న వచ్చిన కోపానికి బీపీ పైవరకు వెళ్లిపోయింది‌‌.. ఎందుకులే గొడవ అని పడుకుండిపోయానని మాధురి అంది. ఇంతలో మార్నింగ్ తినడానికి ఏం చేస్తున్నారంటూ తనూజ వచ్చి అడిగింది. అది మీరే చెప్పాలంటూ మాధురి అంది. కూరగాయలు ఉండేదాన్ని బట్టి వండేది నువ్వు కదా అని తనూజ అంటుంది‌‌. నువ్వేం చెప్తే అది వండాలని చెప్పావ్ కదా అని మాధురి అంటుంది‌. ఇన్ని రోజులు నేను ఏం చెప్తే అది వండావా అని తనూజ అడిగింది. నిన్న కూడా నువ్వు చెప్పావ్ కదా రైస్ ఇంత వండాలని, ఇలా చపాతీ కావాలనంటూ మాధురి చెప్పింది. సరే మార్నింగ్ రైస్ ఏం వండుతావని అడుగుతున్నానని తనూజ అంటే అందుకే అడుగుతున్నా నువ్వేం రైస్ చేయమంటే అది చేస్తా.. నాకు తెలియట్లేదు తనూజ..నిన్న నాకు ఆకలేసింది.. ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగాను దానికే నువ్వు అరిచావ్. అందుకే నీతో డిస్కస్ చేయాలని లేదంటూ మాధురి ఆకలి మంటని బయటపెట్టింది.

ఫుడ్ విషయంలో కూడా దెబ్బలాడితే మా ఇంట్లో వాళ్లు చూస్తే హర్ట్ అవుతారు.. మధ్యాహ్నం అన్నం తినకే కదా నీతో ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగానంటూ మాధురి ఎమోషనల్ అయింది. దీంతో ఏం తెలీనట్లు దివ్యని పిలిచి ఆవిడ ఎక్స్‌ట్రా చపాతీ అడిగితే ఇవ్వలేదా అంటూ తనూజ అడిగింది. అదేంటి ఇచ్చా కదా అని దివ్య అంటే.. అది కాదు ఇంకొకటి అడిగా.. లేవు అంటే పిండి చేసుకుంటానని కూడా అన్నా.. తనూజయే కదా వద్దున్నావంటూ మాధిరి సూటిగా అడిగింది. ఆకలేస్తేనే కదా అడుగుతాను.. నేను ఈ పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా అడిగానా అని మాధురి చెప్పింది. ఇక తనూజ ఆన్సర్ ఇవ్వకుండా కుకింగ్ టీమ్ ప్లస్ కెప్టెన్‌ని పిలిచి మీటింగ్ పెట్టింది.

భరణి హౌస్ లోకి వెళ్ళిన నుండి మాధురి తనకి కేరింగ్ చూపిస్తుంది. నిన్న భరణికి ప్రేమగా ప్లేట్ లో అన్నం పెట్టి ఇచ్చింది. తనకి సంభందించిన ప్రతీ విషయంలో మాధురి ఇంట్రెస్ట్ చూపిస్తుందంటూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి‌. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే భరణి, మాధురి కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు రీల్స్ కూడా చేస్తున్నారు. మరి మాధురిని భరణి ఏం అయినా అన్నాడా లేక తనూజపై ఉన్న కోపంతో మాధురి కడపు మాడ్చుకుందా తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.