English | Telugu

Bigg Boss 9 Telugu : డీమాన్ మాట వినకుండా ఓడిపోయిన శ్రీజ.. లీడ్ లో భరణి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఒక్కో రోజు ఒక్కోలా కంటెస్టెంట్స్ ఆటతీరు సాగుతోంది. ఇక భరణి, శ్రీజల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. హౌస్ పర్మినెంట్ హౌస్ మేట్ ఎవరవుతారని ఇద్దరి మధ్య టాస్క్ ల మీద టాస్క్ లు జరుగుతున్నాయి. మొన్నటి టాస్క్ లో శ్రీజ విన్ అయింది. అందులో సంచాలక్ నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు.. తర్వాత మాధురికి సంఛాలక్ ఇవ్వగా శ్రీజ టీమ్ విన్ అయింది. దాంతో ఆ టాస్క్ ని నిన్న బిగ్ బాస్ రద్దు చేసాడు. నిన్న హౌస్ లో మొత్తం మూడు టాస్క్ లు జరుగగా.. మొదటి టాస్క్ మెయిజ్ టాస్క్. అందులో భరణి చెయ్ కి గాయం ఉండడంతో తన తరుపున దివ్య ఆడింది. ఫస్ట్ టాస్క్ లో దివ్య, శ్రీజ పోటీ పడగా అందులో దివ్య గెలుస్తుంది.

దాంతో శ్రీజ డిస్సపాయింట్ అవుతుంది. అసలు లక్ కలిసి రావడం లేదు.. గెలిచిన ఒక్క టాస్క్ కూడా రద్దు అయిందని శ్రీజ బాధపడుతుంది. రెండో టాస్క్ లో భరణి, రాము ఒక జట్టు.. శ్రీజ, కళ్యాణ్ ఒక జట్టుగా ఉన్నారు. అందులో భరణి టీమ్ టాస్క్ ని ఎనిమిది నిమిషాల్లో పూర్తిచేస్తే శ్రీజ టీమ్ రెండు నిమిషాల్లో పూర్తిచేసింది. ఇందులో కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ గా ఆడటంతో శ్రీజ టీమ్ విన్ అయింది. మూడో టాస్క్ లో భరణి టీమ్ నుండి ఇమ్మాన్యుయల్ ని తోసుకోగా.. శ్రీజ టీమ్ నుండి ఎవరిని తీసుకువాలో శ్రీజ కన్ఫ్యూషన్ లో పడింది. అయితే నేను ఆడుతానని డీమాన్ అంటాడు. నీకు ఎవరిపై నమ్మకం ఉంటే వాళ్ళని ఆడించమని డీమాన్ అంటాడు. దాంతో కళ్యాణ్ ని శ్రీజ సెలక్ట్ చేసుకుంటుంది. ఆ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ విన్ అవుతాడు.

మూడు టాస్క్ లలో భరణి రెండు విన్ అయి కోటపై తన రెండు జండాలని ఎగురవేస్తాడు. శ్రీజ ఒక్క గేమ్ విన్ అవుతుంది ఒక్క జెండా ఎగురవేస్తుంది. ఇక టాస్క్ లలో భరణి టీమ్ తనూజకి ఛాన్స్ ఇవ్వలేదని తను మాధురికి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. నన్ను ఆడనివ్వలేదంటే నాపై నమ్మకం లేదన్నట్లే కదా అని తనూజ చెప్తుంది‌. మాధురి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.