English | Telugu

Brahmamudi : రేవతిని కుటుంబానికి దగ్గర చేస్తానని మాటిచ్చిన కావ్య.. శ్రీను దొరుకుతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -777 లో..... కావ్యకి రేవతి గురించి మొత్తం చెప్తుంది ఇందిరాదేవి. రేవతి పెళ్లి చేసుకొని వచ్చాక సుభాష్, అపర్ణ ఇద్దరు ఇంట్లో నుండి గెంటేసారు.. అపర్ణ కోపంతో నీ ఆస్తులు వీటి కోసమే కదా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు తీసుకొని వెళ్ళిపోమని అపర్ణ పేపర్స్ రేవతి మొహంపై విసిరేస్తుంది. నాకు వద్దని రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా కావ్యకి వివరంగా చెప్తుంది ఇందిరాదేవి. మీరేం కంగారు పడకండి అమ్మమ్మ గారు రేవతిని ఈ కుటుంబానికి నేను దగ్గర చేస్తానని ఇందిరాదేవితో చెప్తుంది కావ్య.

మరొకవైపు అపర్ణ తనలో తనే రేవతి కొడుకు స్వరాజ్ ని గుర్తుచేసుకొని నవ్వుకుంటుంది. అప్పుడే సుభాష్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. దాంతో స్వరాజ్ గురించి చెప్తుంది ఆ బాబు.. ఎంత బాగా మాట్లాడాడో మళ్ళీ ఒకసారి తనని కలవాలని ఉందని అపర్ణ అనగానే అనుకో జరుగుతుందని సుభాష్ అంటాడు. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి ఎప్పటిలాగే కావ్యకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది.

రేపు అప్పు కేసు నుండి బయటకు వస్తుందని ఆశ పడుతున్నావా అసలు జరగదని యామిని అనగానే తనపై కావ్య కోప్పడుతుంది. అప్పుని కేసు నుండి ఎలా బయటపడెయ్యాలని కావ్య ఆలోచిస్తుంటే.. రాజ్ దగ్గరికి యామిని వచ్చి మాట్లాడుతుంది. మరోవైపు శ్రీను వాళ్ళ అమ్మకి ఎలాగైనా కాల్ చేస్తాడు.. ఆ ఫోన్ కాల్ సిగ్నల్ ట్రేస్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది కదా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.