English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న ఇచ్చిన చెక్ గురించి కాశీ చెప్పేస్తాడా.. మరదలిని ఇరికించేసిన కార్తీక్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -413 లో.....దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే కాంచన వస్తుంది. మళ్ళీ మీరేం చేస్తున్నారు చెప్పండి.. ఇప్పుడు గానీ మళ్ళీ ఎంగేజ్ మెంట్ ఆగిపోతే మా వాళ్ళు బాధపడుతారు. మీరు వాళ్లతో మాటలు పడుతారు. నేను అదంతా భరించలేనని కాంచన ఎమోషనల్ అవుతుంటే.. నువ్వేం కంగారుపడకు అమ్మ గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి తెలుసు.. ఈ ఎంగేజ్ మెంట్ చేసుకోదు ఎలాగైన దీప మాటలు పడాలని ప్లాన్ చేస్తుంది.

కానీ తన చేతనే నిజం ఒప్పుకునేలా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నామని కార్తీక్ కాంచనకి అర్ధం అయ్యేలా చెప్తాడు. మరొక వైపు శ్రీధర్ ఇంటికి వచ్చి.. అల్లుడు మీ నాన్న వచ్చాడాట కదా అని చెప్తాడు. అవును మావయ్య మేమ్ వెళ్తున్నామని కాశీ అంటాడు. ఆ తర్వాత కాశీకి కార్తీక్ ఫోన్ చేసి గౌతమ్ మంచివాడు కాదని సాక్ష్యాలు అన్నీ ఉన్నాయ్ కదా.. అవి పట్టుకొని డైరెక్ట్ మీ జ్యోత్స్న అక్క దగ్గరికి వచ్చేయ్ అని కార్తీక్ చెప్పగానే కాశీ సరే అంటాడు.

ఆ తర్వాత కాశీ ఇంటికి వచ్చి జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. నువ్వు బయట ఉండు అని జ్యోత్స్న అంటుంది. కానీ కాశీ లోపలికి ఒక కవర్ పట్టుకొని వస్తాడు. అప్పడే అక్కడున్న శివన్నారాయణ చూసి ఏంటది అని అడుగుతాడు. ఏం లేదని పారిజాతం అంటుంది. తీరా చుస్తే అందులో జ్యోత్స్న కాశీకి ఇచ్చిన చెక్ ఉంటుంది. అదేంటి గౌతమ్ మంచివాడు కదాని సాక్ష్యాలు తెస్తాడనుకుంటే ఇలా తెచ్చాడని జ్యోత్స్న షాక్ అవుతుంది. మరదలు షాక్ అయినట్లుందని కార్తీక్ అనుకుంటాడు. చెక్కు ఏంటని శివన్నారాయణ అడుగగా.. ఎక్కడ నిజం చెప్తాడోనని జ్యోత్స్న కవర్ చేస్తుంది. బావ ఇదంతా నీ ప్లానా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.