English | Telugu

Brahmamudi : ఇంట్లో కాళీగా భర్త.. ఆఫీస్ లో బిజీగా భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారకమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -549 లో.. అనామిక మనిషిని జాబ్ నుండి తీసేసీ సెక్యూరిటీ పోస్ట్ ఇస్తుంది కావ్య. ఇలా ఎవరైనా ఆఫీస్ కి ద్రోహం చెయ్యాలని చూస్తే ఇలా సెక్యూరిటీ జాబ్ కాదు.. ఇక పోలీస్ స్టేషనే అని కావ్య ఎంప్లాయిస్ కి వార్నింగ్ ఇస్తుంది. మేడమ్ మీకు పెళ్లి అయి ఎన్ని రోజులు అవుతుంది. ఆరు నెలలు అవుతుందా అని శృతి కావ్యని ఆడుతుంది. నీకు తెలియదా.. ఆరు నెలలు మూడు సార్లు అయింది.. ఎందుకు అడిగావని కావ్య అనగానే.. ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట మీరు రాజ్ సర్ లాగే చేస్తున్నారని శృతి అంటుంది.

రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడో లేదో అని అపర్ణ, ఇందిరాదేవిలు డిస్కషన్ చేసుకుంటుంటే.. ఏంటి అత్త కోడళ్ళు గుసగుసలు పెట్టుకుంటున్నారని రుద్రాణి అంటుంది. దాంతో నీ భర్త ఎక్కడున్నాడో వెతకమని చెప్పాము. తెలిస్తే నీ దరిద్రం మాకు వదిలిపోతుంది కదా అని ఇందిరాదేవి అనగానే.. వద్దు నేను ఎక్కడికి వెళ్ళనని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ టీ షర్ట్ లుంగీ కట్టుకొని కిందకి వస్తాడు. అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. కాలిగా ఉన్నా అని సింబాలీక్ గా ఇలా వేసుకున్నానని రాజ్ అంటాడు. అపుడే కావ్య ఫోన్ చేస్తుంది. నేను ఆఫీస్ కి వెళ్లకుంటే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉంటాయ్.. రమ్మని బ్రతిమిలాడడానికి కాల్ చేస్తుంది.. మీ అప్పలమ్మ అని రాజ్ వాళ్ళతో అంటాడు. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయా అని అంటాడు. లేదు ఇప్పడే ఫాస్ట్ గా అవుతున్నాయని కావ్య అంటుంది. మరెందుకు కాల్ చేసావని రాజ్ అడుగుతాడు. లాప్ టాప్ పాస్ వర్డ్ చెప్పండి అని కావ్య అడుగుతుంది. చెప్పను.. నువ్వు సీఈఓ అయ్యావ్ కదా కనిపెట్టమని రాజ్ అంటాడు.

మరొక వైపు కళ్యాణ్ రైటర్ దగ్గరికి వెళ్తాడు. తనకి అవకాశం ఇవ్వమని అడుగుతాడు. దాంతో అతను కళ్యాణ్ ని అవమానిస్తాడు. కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ కిచెన్ లోకి వెళ్లి అపర్ణ, శాంతలని డిస్టర్బ్ చేస్తుంటాడు. హాల్లో కూర్చొని పని మనిషికి అది తీసుకొని రా.. ఇది తీసుకొని రా అంటూ పని చెప్తాడు.‌ రాజ్ ని కాళీగా ఉన్నావంటూ అందరు ఏదో ఒకరకంగా ఎగతాళిగా మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.