English | Telugu

Brahmamudi : నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -511 లో.. కళ్యాణ్ హాస్పిటల్ కి వస్తాడు. అమ్మకి ఏం కాదురా.. రేపు మనతో మాట్లాడుతుందని రాజ్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. నాకు అన్నయ్యని చూస్తుంటే భయమేస్తుంది. మీరు అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళండి పెద్దనాన్న.. నేను పెద్దమ్మ దగ్గర ఉంటానని కళ్యాణ్ అంటాడు. వాడిప్పుడు వచ్చే సిచువేషన్ లో లేడని సుభాష్ అంటాడు. అన్నయ్య పెద్దనాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళు.. తనకి టెన్షన్ గా ఉందట.. పెద్దమ్మ గురించి కాదు పెద్దనాన్న గురించి కూడా ఆలోచించమని రాజ్ తో కళ్యాణ్ అనగానే.. నువ్వు ఇక్కడే ఉండు డాడ్ ని దింపేసి వస్తానని అంటాడు.

మరొకవైపు అందరు ఇంట్లో అపర్ణ గురించి బాధపడుతుంటారు. రుద్రాణి, రాహుల్ లు ఇదే కరెక్ట్ టైమ్.. ఇప్పుడే కావ్యని అందరి దృష్టిలో బ్యాడ్ చెయ్యాలని రాహుల్ అంటాడు. చేస్తాను రాజ్ చేతే కావ్యని గెంటేలా చేస్తానని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్, సుభాష్ లు ఇంటికి వస్తారు. అపర్ణ ఎలా ఉందని ఇందిరాదేవి అడుగుతుంది . చూసారా కదా అంటు రాజ్ కోప్పడతాడు. ఎవరినో నమ్మి తప్పు చేసానని రాజ్ అనగానే.‌. తప్పు నువ్వు చెయ్యలేదు. ఈ కావ్య చేసిందంటు రాజ్ ని రెచ్చగొట్టేలా రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి గారు టైమ్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాకండి అని కావ్య అంటుంది. అందరికి మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావ్.. అసలు అపర్ణని వదిలి ఎక్కడికి వెళ్ళావని ఇందిరాదేవి అడుగుతుంది. ఎవరో ఒకతను కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుంది. అది కూడా రాహుల్ చేస్తున్నాడు.. మీరు రాకపోతే కంపెనీ పరువు పోతుందన్నారు.. అందుకే వెళ్ళాను.. అత్తయ్య గారు వెళ్ళమంటేనే వెళ్ళానని కావ్య అంటుంది.

కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది ఫేక్ కాల్ అని కావ్య చెప్తుంది. ఎంత బాగా కథ అల్లావని రుద్రాణి అంటుంది. రుద్రాణికి కావ్య సమాధానం చెప్తుంటే షటప్ అని రాజ్ కావ్యపైకి అరుస్తాడు. నీకెందుకు కంపెనీ? ఏం అయితే నీకెందుకంటూ కావ్యపై రాజ్ విరుచుకుపడతాడు. నువ్వు తప్పు చేసావ్.. నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం.. నిన్ను జీవితంలో మాత్రం క్షమించనని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.