English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్నపై మండిపడ్డ శివన్నారాయణ.. తనని కాపాడేది ఎవరంటే?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -564 లో... సుమిత్రకి తనకి ఉన్న వ్యాధి గురించి చెప్పడానికి జ్యోత్స్న ప్రయత్నం చేస్తుంది కానీ సుమిత్ర వినకుండా నిద్రపోతుంది. ఆ మాటలన్నీ సుమిత్ర తప్ప మిగతా వాళ్లంతా విని జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటారు.

అసలు నువ్వు కన్నకూతురివేనా మీ అమ్మకి ఉన్న వ్యాధి తనకే చెప్పాలనుకున్నావ్.. ఒకేసారి చంపాలని చూసావని జ్యోత్స్న పై కాంచన కోప్పడుతుంది. పెంచిన కూతురికి అయినా ప్రేమ ఉంటుంది కానీ నీకు అసలు ఏ ప్రేమ లేదని కాంచన అంటుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇచ్చి జ్యోత్స్నని ఎవరు ఏం అనద్దు తల్లికి బాలేదని తెల్సి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంది. ఇప్పుడెమో ఏకంగా చంపాలని చూసింది.. దైర్యం చెప్పాల్సిన వాళ్లే ఇలా చేస్తే ఎలా ఉంటుంది.. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు నాన్న.. సుమిత్రని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతానని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. నువ్వు ఎందుకురా వెళ్లడం అని శివన్నారాయణ అంటాడు.

జ్యోత్స్నకి ఆ సలహా ఇచ్చింది నువ్వేనా అని పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. అది చేసిన తప్పుకి నన్ను అంటున్నారని పారిజాతం కోపంగా జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత మా అమ్మని కావాలనే చంపాలని చూసింది.. లేదంటే జ్యోత్స్న సొంత కూతురు కాదని తెలుస్తుంది కదా అని కార్తీక్ తో దీప చెప్తుంది.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి తనని కోప్పడుతుంది. నాకు అన్యాయం జరుగుతుంది గ్రానీ.. అసలు నేనంటే ఎవరికి ఇష్టం లేదు.. ఇదే పని ఆ దీప చేస్తే నిజం చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుందని అంటారు. నేను చేస్తే తప్పు, నేరం అంటున్నారు.. ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడేసేది ఒక్కరే అని జ్యోత్స్న అంటుంది.

మరొకవైపు శ్రీధర్ ఇంట్లోకి దాస్ వస్తాడు. నా కొడుకు తప్పు చేసాడు బావ.. నేను వాడిని నీకే అప్పగిస్తున్నాను.. నువ్వే వాడిని చూసుకోవాలని కాశీ బాధ్యతలు శ్రీధర్ కి అప్పజెప్పి దాస్ వెళ్ళిపోతాడు. మరొకవైపు కాంచన, శివన్నారాయణ, దశరథ్ ముగ్గురు కలిసి సుమిత్ర దగ్గరికి వస్తారు. సుమిత్ర పరిస్థితి చూసి దశరథ్ ఎమోషనల్ అవుతుంటే కార్తీక్ దైర్యం చెప్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.