English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీలో స్ర‌వంతి కులాల ర‌చ్చ‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.. దీని కార‌ణంగా రెండు జంట‌లు తీవ్ర ఇబ్బందులుకు ట్రోలింగ్ కు గురైన విష‌యం తెలిసిందే. ఎలాంటి లిమిటేష‌న్స్ లేకుండా వ్య‌క్త‌గ‌త విష‌యాల్లోకి కూడా తొంగిచూసిన బిగ్‌బాస్ షో ఇప్ప‌డు 24 గంట‌ల నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అంటూ ఓటీటీలో మొద‌లైంది. టెలివిజ‌న్ తో పోలీస్తే అక్క‌డ సెన్సార్ అంత‌గా వుండ‌క‌పోవ‌డంతో కంటెస్టెంట్ లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ప‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇప్పుడు మ‌రో వాద‌న కూడా వినిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇంత వ‌ర‌కు బిగ్ బాస్ లో కులాల ప్ర‌స్థావ‌న వినిపించ‌లేదు కానీ బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో ఏకంగా ఏ కంటెస్టెంట్ కులాల ప్ర‌స్థ‌వన‌కు నాంది ప‌ల‌క‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 17 మంది కంటెస్టెంట్ ల‌తో మొద‌లైన ఓటీటీ బిగ్ బాస్ షో మొత్తానికి అనుకున్న‌ట్టే ముమైత్ ఖాన్ ఎలిమినేష‌న్ తో ఫ‌స్ట్ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌ని పూర్తి చేసింది. ఇక హౌస్ లో వున్న మిగ‌తా కంటెస్టెంట్ లు బ‌య‌టి కంటే హౌస్ లోనే మ‌రింత మోటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read:ఒకేసారి 20 ఓటీటీ ప్లాట్ ఫాంలలో రిలీజ్.. పూనమ్ కౌర్ సంచలన రికార్డ్

ఇందులో స్ర‌వంతి కూడా ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. స‌హ కంటెస్టెంట్ ల‌తో ప‌చ్చిగా మాట్లాడుతూ హౌస్ లో నానా ర‌చ్చ చేస్తోంది. ఎవ‌రు ప‌చ్చిగా మాట్లాడితే వారికి వీడియోలో ఎక్కువ స్కోప్ వుండ‌టంతో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా వ‌ర‌కు కంటెస్టెంట్ లు ప‌చ్చిగా మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. యాంక‌ర్ స్ర‌వంతి లాంటి వాళ్లైతే వ్య‌క్తిగత విష‌యాల్ని కూడా చెప్ప‌డం, కులాల ప్రస్థావ‌న తీసుకురావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. త‌న రెండో పెళ్లి గురించి చెప్పిన యాంక‌ర్ స్ర‌వంతి మ‌రింత లోతుగానే మాట్లాడి షాకిచ్చింది. అజ‌య్‌, బిందు మాధవిల‌తో కూర్చుని త‌న కులం గురించి ప్ర‌స్థావించింది. పోను పోను స్ర‌వంతి ఇంకా ఎలాంటి హ‌ద్దుల్ని చెరిపేసి ర‌చ్చ చేస్తుందో న‌ని అంతా అనుకుంటున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.