English | Telugu

యష్మీ ఫ్లిప్పింగ్ స్టార్.... నాగార్జున ముందే నిజాలు బయటపెట్టిన ఫ్యాన్!

బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం వీకెండ్ వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కో కంటెస్టెంట్‌కు ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చాడు. అందులోను కన్నడ బ్యాచ్ కి గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది.‌ ముఖ్యంగా యష్మీకి గట్టిగా క్లాస్ పీకాడు నాగ్ మామ. యష్మీ కన్నడ కుట్టి.. తన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం అభినయంతో పాటు టాస్క్ లలో తనదైన శైలిలో దూసుకుపోతుంది కానీ ఈ అమ్మడు ప్లస్ పాయింట్ ల తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. తనకి నచ్చిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది. తనకి నచ్చని వాళ్ళు ఉంటే కన్నెత్తి అయిన చూడదు.

హౌస్ లో యష్మీ తనకంటూ ఒక స్కోప్ క్రియేట్ చేసుకుంది. అందులో నిఖిల్, ప్రేరణ, పృథ్వీలు మాత్రమే ఉంటారు. మిగతా హౌస్ మేట్స్ తో ఒకరకమైన అటిట్యూడ్ తో ఉంటుంది. గత వారం నుండి ఈ అమ్మడు నిఖిల్ తో ప్రేమాయణం కూడా నడిపిస్తుంది. టాస్క్ లో అయితే తన డెసిషన్ అనేది స్టేబుల్ గా ఉండదు. ఈ వారం జరిగిన టాస్క్ లో యష్మీ, ప్రేరణ గౌతమ్ ముగ్గురు ఒక టీమ్ కాగా అందులో ఒకరు టాస్క్ నుండి బయటకు వెళ్ళాలని బిగ్ బాస్ చెప్పగా యష్మీ, ప్రేరణ ఇద్దరు కలిసి గౌతమ్ ని తొలగిస్తారు. అదే విషయం నాగార్జున యష్మీని అడుగుతాడు. సర్ తను మెగా చీఫ్ అయినప్పుడు అడినంత కసిగా ఇప్పుడు ఆడట్లేదు అందుకేనని యష్మీ చెప్తుంది. అప్పుడే గౌతమ్ రియాక్ట్ అవుతు.. సర్ నన్ను తీసిసేటప్పుడు నాకు ఇది చెప్పలేదు. నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావ్ కదా మాకు ఛాన్స్ రావాలని అంటున్నానని అంది అని గౌతమ్ అంటాడు.

అంటే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.. మీకే చెప్పాను తనకి అది చెప్పానని యష్మీ అనగానే అంటే హౌస్ లో ఒక్కొక్కరికి ఒక్కోలాగా చెప్తావా.. అందుకే నిన్ను ఫ్లిప్ యష్మీ అంటున్నారని స్టూడియోలో ఉన్న ఆడియన్స్ ని అడుగుతాడు నాగార్జున. యష్మీ గురించి ఏం అనుకుంటున్నారు చెప్పండి అని ఒక ఆడియన్ ని అడుగగా.. ఎక్కువ ఫ్లిప్ చేస్తుంది యష్మీ.. తను తప్పని అనగానే వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తుంది యష్మీ. ఇదిగో ఇదే వద్దని నాగార్జున చెప్తాడు.. నీకు ఏడుపు వస్తున్నప్పుడు.. నువ్వు తప్పు చేసినట్టే.. ఆ సిచువేషన్ లో ప్లిప్ అవ్వకుండా ఉండమని నాగార్జున సలహా ఇస్తాడు. మరి నిజంగా యష్మీ ప్లిప్ అవ్వకుండా ఉండగలదా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.