English | Telugu

ఎనిమిదో రోజు నామినేషన్లో ఉందెవరు..?

బిగ్ బాస్ ఎనిమిదో రోజు 'బాక్స్ బద్దలైపోయే' సాంగ్ తో మొదలైంది. బిగ్ బాస్, కంటెస్టెంట్లతో మాట్లాడుతూ "ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా కీలకమైంది, ప్రతీ ఒక్కరికి ఒక్క ఓట్ మాత్రమే లభిస్తుంది. ఎవరిని బయటికి పంపిస్తే బిగ్ బాస్ ఇంటికి మంచిది అనిపిస్తుందో వారినే నామినేట్ చేయండని" బిగ్ బాస్ చెప్పాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఉన్న కుండను బావిలో పడేసి, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణం చెప్పండని, కెప్టెన్‌గా ఉన్న ఆదిత్య ఈ నామినేషన్ నుండి తప్పుకుంటున్నాడని, ఆరోహీ నామినేషన్ ను మొదలుపెట్టమని బిగ్ బాస్ చెప్పాడు.

ఆరోహీ, ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. నువ్వు మాట్లాడే విధానం బాలేదని చెప్పి వెళ్ళిపోయింది. శ్రీహాన్ , గీతూని నామినేట్ చేసాడు. 'నువ్వు మగవాళ్ళకు బుద్ధి లేదు అని అన్నావ్ ', అది నాకు నచ్చలేదని చెప్పి శ్రీహాన్ వెళ్ళిపోయాడు. ఫైమా, రేవంత్ ను నామినేట్ చేసింది. నిన్ను నామినేట్ చేయడానికి కారణం సండే ఫండే రోజూ అందరి మీద సీరియస్ అయ్యావు. అది నాకు నచ్చలేదని చెప్పింది.

ఆదిరెడ్డి నామినేషన్ మొదలుపెట్టే ముందు ఆరోహీతో మాట్లాడాడు. నీతో రాపో ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలా, టాస్క్ లో బాగా ఫర్మామెన్స్ చేసినవాళ్ళు ఉండాలా అని అడిగాడు. దానికి ఆరోహీ 'టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేసినవాళ్ళు ఉండాలి' అని చెప్పింది. నువ్వు సరిగ్గా ఆడకపోయినా అందరూ ఆడలేదు మరి అలా ఎలా అంటున్నావ్ అని, తర్వాత మెరీనా-రోహిత్ ఇద్దరిని కలిపి నామినేట్ చేసాడు.ఆ తర్వాత చంటి, గీతూని నామినేట్ చేసాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసారు.

ఎనిమిదవ రోజు గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి,రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.