English | Telugu

శ్రీ‌ముఖిపై అన్న‌పూర్ణమ్మ ట్రిపుల్ ఆర్‌ పంచ్

స్టార్ మా లో ఓంకార్ ప్రొడ్యూస్ చేసిన కామెడీ షో `కామెడీ స్టార్స్`. ఈ షోలో గ‌త కొన్ని నెల‌లుగా యాంక‌ర్ గా మెరిసిన శ్రీ‌ముఖి తాజాగా నాగ‌బాబు ఎంట్రీతో అక్క‌డి నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. నాగ‌బాబు ఎంట్రీ త‌రువాత ఈ షోని `కామెడీ స్టార్స్ ధ‌మాకా`గా మార్చేశారు. శ్రీ‌ముఖి ప్లేస్ లో ఈ షోకి దీపికి పిల్లి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో ఈ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన శ్రీ‌ముఖి ఈటీవీ కోసం మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌రికొత్త‌గా ప్రారంభిస్తున్న `జాతిర‌త్నాలు` స్టాండ‌ప్ కామెడీ షోకు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

శ్రీ‌ముఖితో పాటు ఈ షోలో న‌టి ఇంద్ర‌జ కూడా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ షోలో అన్న‌పూర్ణ‌మ్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి, కృష్ణ భ‌గ‌వాన్‌, భ‌ద్రం స్టాండ‌ప్ కామెడీ చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌మోలో పోసాని, కృష్ణ భ‌గ‌వాన్‌, భ‌ద్రం వేసిన పంచ్ లు అదిరిపోయాయి. అయితే అన్న‌పూర్ణ‌మ్మ ఏకంగా శ్రీ‌ముఖిని టార్గెట్ చేసి వేసిన పంచ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

శ్రీ‌ముఖి గురించి కొంచెం చెబుతానే అంటూ మొద‌లుపెట్టింది అన్న‌పూర్ణ‌మ్మ‌.. టీవీల్లో అంద‌రూ రాముల‌మ్మా రాముల్మ‌మా అంటారుగా అదే తెలుసు త‌న‌కి టీవీ ముందు కూర్చున్న వాళ్లు మాత్రం రావ‌ద్ద‌మ్మా.. రావ‌ద్ద‌మ్మా అంటుంటారు. అంటే పంచ్ వేసేసింది. ఆ త‌రువాత శ్రీ‌ముఖిని స్టేజ్ మీద‌కి పిలిచిన అన్న‌పూర్ణ‌మ్మ నిన్ను ట్రిపుల్ ఆర్ సినిమాలో అడిగారా అంది.. దీనికి శ్రీ‌ముఖి అడ‌గ‌లేదే అని చెప్పింది.. వెంట‌నే `అదేంటీ.. నువ్వు మాట్లాడితే ఆర్ ఆర్ వేసిన‌ట్టువుంట‌ది క‌దా ట్రిపుల్ ఆర్ వాళ్లు నిన్ను పిల‌వాలి క‌దా? అంటూ మ‌రో పంచ్ వేసింది. దీంతో శ్రీ‌ముఖి ముఖం మాడిపోయింది. ఈ పంచ్ ల‌కి ఇంద్ర‌జ ప‌డి ప‌డి న‌వ్వ‌డంతో అక్క‌డున్న వారంతా న‌వ్వుల్లో మునిగిపోయారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.