English | Telugu

వర్షంలో భర్తతో కలిసి అనసూయ ఆటలు...

అనసూయ ఏది చేసిన వింతగానే ఉంటుంది. ఆమె కామెంట్స్ కానీ ఆమె పోస్టులు కానీ అందరినీ తనవైపు తిప్పుకునేలానే ఉంటాయి. రీసెంట్ గా అనసూయ ఒక పోస్ట్ పెట్టింది. వర్షంలో తన భర్తతో కలిసి బాడ్మింటన్ ఆడుతూ కనిపించింది.

ఆమె షార్ట్ జీన్స్ లో టీ షర్ట్ లో కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె స్టైలిష్ లుక్ లో అందరినీ మెస్మోరైజ్ చేస్తూ కనిపించింది. ఇలాంటి పిక్స్ పెట్టగానే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అందరికీ తెలుసు కదా. అనసూయ కూడా అదే పెట్టింది. "వాళ్లేమంటారంటే ఈవిడేంటి ప్రతీ విషయాన్ని పోస్ట్ చేయాలా అని అంటారు. ఐతే నేను ఏమంటానంటే మా మధ్య ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయని అందరికీ తెలియడం కోసం..మా మధ్య కూడా ఇలాంటి అందమైన క్షణాలు, నిజమైన ప్రేమ ఉన్నాయని చెప్పడం కోసం. ఇంకోటేంటంటే ఇలాంటి మెమోరీస్ దాచుకోవడం కోసం కూడా" అని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "ఇక్కడ వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరేమో వర్షంలో బాడ్మింటన్ ఆడుతున్నారు." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ 'పుష్ప 2'తో పాటు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అలాగే అనసూయ ఇతర భాషల చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అనసూయ తన కెరీర్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫామిలీ ఫొటోస్ ని తన ఇంట్లో పెంచుకునే పక్షుల ఫొటోస్ ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.