Read more!

English | Telugu

మేమెప్పటికీ విడిపోము...ఆ రెండు కుర్చీలు ఖాళీ కావడం నిజంగా బాధాకరం  

 

సిక్స్త్ సెన్స్ సీజన్ 5  లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వచ్చారు. వీళ్ళ ఇద్దరి రియల్ స్టోరీనే సినిమాగా "మళ్ళీ పెళ్లి" పేరుతో త్వరలో  రాబోతోంది. "మీరు ముద్దుగా పవిత్ర లోకేష్ గారిని ఏమని పిలుస్తారు" అని ఓంకార్ అడిగేసరికి "అమ్ములు అని పిలుస్తాను ఇంకా ముద్దొస్తే అమ్ము అంటాను... ఇంకా ముద్దొస్తే..వద్దులే " అని తప్పించుకున్నాడు నరేష్. వీళ్ళతో పాటు ఈ స్టేజి మీద ఆడియన్స్ ని అలరించడానికి "డెడ్ పిక్సల్స్ మూవీ టీమ్ నుంచి నిహారిక కొణిదెల, అక్షయ్, సాయి రోనాక్ వచ్చారు, ఇంకా   సేవ్ ది టైగర్స్ మూవీ నుంచి అభినవ్, పావని గంగిరెడ్డి  వచ్చారు. కాసేపు సాంగ్స్ , డాన్సేస్ తో ఎంటర్టైన్ చేశారు...  కృష్ణ చేసి "జుంబారే " సాంగ్ కి ఆయన్ని ఇమిటేట్ చేస్తూ నరేష్ డాన్స్ చేసాడు.

తర్వాత ఓంకార్ " మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటి" అని అడిగేసరికి "ఆకాశం మీద పడినా, భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం" అని చెప్పాడు నరేష్. "కృష్ణ గారు అంటే మీకు ఎంత ఇష్టం" అని నరేష్ ని అడిగాడు ఓంకార్. "అమ్మ చనిపోయినప్పుడు ఇంకా మమ్మీ అని పిలుచుకునే పిలుపు లేదని అనుకున్నా..అమ్మ కృష్ణ గారు ఇద్దరూ ప్రతీక్షణం కలిసే ఉండేవాళ్ళు. షూటింగ్ ఉన్నా లేకపోయినా కలిసే ఉండేవాళ్లు. అమ్మ పోయాక ఇద్దరి చైర్స్ లో ఒకటి ఖాళీగా కనిపించింది. అప్పుడు నా మనసు చాలా బాధపడేది. ఆయనలో అమ్మను చూసుకునేవాడిని. నేను ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు తన పక్క సీట్ లో అమ్మ ఫోటో పెట్టుకునేవారు. ఆయన ఆమెను ఎంత మిస్ అయ్యారో అప్పుడు తెలిసింది. అంతలోనే ఆయన కూడా సడెన్గా వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోవడం ఆ రెండు చైర్స్ ఖాళీ కావడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు." అని ఫీలవుతూ చెప్పాడు నరేష్. ఇలా కొంచెం ఫన్నీగా, ఇంకొంచెం ఎమోషనల్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది.