English | Telugu

ఇమ్మూకి పెళ్లి ప్రపోజల్.. వైర‌ల్ అయిన వీడియో

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అసలు ఎలాంటి గుర్తింపు లేనివాళ్లు కూడా ఈ వేదిక మీదకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ షో ద్వారా సుధీర్, రష్మీ, ఆది, వర్ష, ఇమ్మానుయేల్.. ఇలా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు జబర్దస్త్ వేదిక మీద పెర్ఫార్మ్ చేసే కమెడియన్స్ అందరూ కూడా వేరే షోస్ కి వెళ్లి అక్కడ కూడా సందడి చేస్తున్నారు. ఆ క్ర‌మంలో శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న "జాతిరత్నాలు" స్టాండప్ కామెడీ షోకి వచ్చి ఎంటర్టైన్ చేసాడు ఇమ్మానుయేల్‌. ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఈ ప్రోమోలో అందరూ ఎవరి స్కిట్స్ లో వాళ్ళు కామెడీని పండించారు. ఐతే ఈ షోలో ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి ఇమ్మూకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ప్రోమోలో అందరూ ఎవరి స్కిట్స్ తో వారు కామెడీ పండించినప్పటికీ, ఓ లేడీ ఫ్యాన్ ఇమ్మానుయేల్ కి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం హైలైట్ గా నిలిచింది. "ఆకాశంలో వెళ్తుంది రాకెట్టు.. నీకోసం నా లైఫ్ ని పెడతాను తాకట్టు" అని ప్రపోజ్ చేసింది ఆ అమ్మాయి.

ఆమె మాటలు విన్న ఇమ్మానుయేల్ "పెళ్లి చేసుకుంటానంటే చెప్పు?" అని అడిగేసరికి ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే, చేసుకుంటానని చెప్పి స్టేజి పైకి వచ్చింది. తర్వాత ఇమ్మూతో "నీకు పెళ్లి ఓకేనా?" అని శ్రీముఖి అడగడంతో ఆ ప్రోమో ఎండ్ ఐపోతోంది. ఐతే ప్రస్తుతం వర్ష లేకుండా వేరే అమ్మాయి ఇమ్ముకు ప్రపోజ్ చేసేసరికి ఈ వీడియో వైరల్ గా మారింది. ఒకవేళ వర్షకు ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో చూడాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.