English | Telugu

హౌస్ లో కొత్త కెప్టెన్ గా  సూర్య!

బిగ్ బాస్ హౌస్ లో గత మూడు రోజులుగా సాగుతోన్న కెప్టెన్సీ టాస్క్ నిన్నటితో ముగిసింది. అయితే చివరగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో 'ఆఖరి వరకు ఆగని పరుగు' అనే టాస్క్ జరిగింది. ఇందులో కెప్టెన్ పోటీదారులుగా శ్రీసత్య, వసంతి, అర్జున్ ,ఆదిరెడ్డి, రేవంత్, సూర్య, రాజ్, రోహిత్ లు ఉండగా, ఇందులో ఫైమా సంచాలకులురాలిగా వ్యవహరించింది. కాగా టాస్క్ నియమాలు బిగ్ బాస్ వివరించాడు. "పోటీదారుల ఫోటో మరియు పేరుతో ఉన్న పూలకుండీలు ఉంచబడ్డాయి. అయితే బజర్ రాగానే ఎవరు అయితే వారి పేరుతో ఉన్న పూలకుండి కాకుండా వేరే వాళ్ళది తీసుకువస్తారో వారు సేఫ్, వారిది వారు తీసుకెళ్తే గేమ్ నుండి అవుట్ అవుతారు. అందరికంటే చివరగా తెచ్చిన పోటీదారులు మరియు తన చేతిలో ఎవరి పూల కుండి ఉంటుందో వారు, ఇద్దరు మిగత హౌస్ మేట్స్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని, ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే టాస్క్ లో కొనసాగుతారు. మిగతా పోటీదారు టాస్క్ నుండి తొలగించబడతాడు" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.

ఈ టాస్క్ లో మొదటగా రాజ్ తన పూల కుండి తానే తెచ్చుకోవడం వల్ల టాస్క్ నుండి తొలగిపోగా, తర్వాత చివరగా ఆదిరెడ్డి, వసంతి వచ్చారు. హౌస్ మేట్స్ ఓట్లలో ఎక్కువ ఆదిరెడ్డికి రాగా, ఆదిరెడ్డి గేమ్ లో ముందుకెళ్ళాడు. వసంతి టాస్క్ నుండి తొలగించబడింది. తర్వాత రేవంత్, శ్రీసత్య మిగిలారు. ఓట్లు శ్రీసత్యకి ఎక్కువ వచ్చాయి. తను ముందుకెళ్ళగా, రేవంత్ తొలగించబాడ్డాడు. తర్వాత అర్జున్ మరియు రోహిత్ మిగిలారు. రోహిత్ టాస్క్ లో ముందుకెళ్ళగా, అర్జున్ తొలగిపోయాడు. చివరగా సూర్య మరియు రోహిత్ ఉండగా రోహిత్ కు ఎవరు సపోర్ట్ చెయ్యలేదు. సూర్యకి హౌస్ మేట్స్ ఎక్కువ సపోర్ట్ రావడంతో, సంచాలకులురాలిగా వ్యవహరించిన ఫైమా, కెప్టెన్ గా సూర్యని ప్రకటించింది.

ఆ తర్వాత కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన సూర్యకి, హౌస్ మేట్స్ అందరు కృతజ్ఞతలు తెలిపారు. "రాజు ఎక్కడున్నా రాజే" అంటూ ఇనయా అనగా, సూర్య 'ప్రభాస్' లా మిమిక్రీ చేసి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక హౌస్ లో తొలిసారి కెప్టెన్ గా బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడో చూడాల్సి ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.