English | Telugu

Sonia elimination: ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేషన్..

బిగ్ బాస్ సీజన్-8 లో ఓ శఖం ముగిసింది. అంటే ఇక్కడ శఖం అని ఎందుకు అన్నానంటే.. సోనియా ఇన్ ఫ్లూయెన్స్, ఆ తర్వాత ఎలా కంటెస్టెంట్స్ ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది. అదే హౌస్ లో నిన్న జరిగిన సండే ఎపిసోడ్ లొ సోనియా ఎలిమినేషన్ అయి బయటకు వచ్చింది.

సోనియా ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సీజన్ సెవెన్ లో రతిక, సీజన్ 8 లో సోనియా అంటు.. అబ్బ సాయిరాం సోనియా ఎలిమినేషన్ అయ్యిందంటూ తెగ కామెంట్లు చేసేస్తున్నారు అభిమానులు. ఇక నామినేషన్ లో ఉన్నవారందరిని సేవ్ చేస్తూ చివరగా అదిత్య ఓం, సోనియా, మణికంఠ మిగలగా వారిని యాక్షన్ రూమ్ కి పంపించాడు నాగ్ మామ. అక్కడ ఆదిత్య ఓం సేవ్ అయ్యి హౌస్ లోకి వచ్చాడు.

చివరికి మణికంఠ, సోనియాలు మాత్రమే మిగిలారు. ఇక హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌తో నాగార్జున మాట్లాడుతూ.. మీరు మణికంఠ ఆటలో పనికి రాడు.. జీరో అని అన్నారు. అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అలాగే ఆడియన్స్ సోనియాని లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.. హౌస్‌లో ఉన్న మీ తొమ్మది మంది.. ఎవరి పక్షాన నిలబడితే వాళ్లు హౌస్‌లో ఉంటారు. మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతారు. సోనియా, మణికంఠలో ఎవరు ఉండాలో వెళ్లాలో నిర్ణయం మీదే అని అన్నారు నాగార్జున. మీరు వేసే ఓటింగ్ మీకు నాకు తప్ప యాక్షన్ రూంలో ఉన్న వాళ్లకి తెలియదు. కానీ మిమ్మల్ని ఆడియన్స్ వాచ్ చేస్తుంటారు.. మీకు 8 సెకన్లు మాత్రమే టైమ్ అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు‌ నాగార్జున. ఈ మణికంఠ హౌస్‌లో ఉండాలని కోరుకునే వాళ్లు లేచి నిలబడండి అని నాగార్జున అడిగాడు. దాంతో హౌస్‌లో ఉన్న తొమ్మది మందిలో.. నిఖిల్, పృథ్వీ, నైనికలు తప్ప.. మిగిలిన ఆరుగురు నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, ప్రేరణ, విష్ణు ప్రియ, సీతలు మణికంఠే సేవ్ అవ్వాలని స్టాండ్ తీసుకున్నారు. దాంతో ఆడియన్స్ ఓటింగ్, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అయ్యిందని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మణికంఠ డేంజర్ జోన్‌ వరకు వచ్చినందున తనని జైలుకి పంపిస్తున్నట్టు.. జైలు నుంచి ఎప్పుడు బయటకు రావాలనేది బిగ్ బాస్ ప్రకటిస్తారని నాగార్జున చెప్పాడు. దాంతో మణికంఠ తనని సేవ్ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.