English | Telugu

సోనియా కుళ్ళు.. నిఖిల్ కన్నీళ్ళు.. ఇదేం పత్తాపారం సామి!

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొ కంటెస్టెంట్ బిహేవియర్ కి బయట ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంది. నిన్న మొన్నటిదాకా సోనియా, నిఖిల్ రాసుకొని తిరిగారు‌. నిన్నటి ఎపిసోడ్ లో దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని చెప్పుకున్నారు.

అసలేం జరిగిందంటే.. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి ఫుడ్ లేకుండా బిగ్ బాస్ అన్నీ లాగేసుకుంటే.. నిఖిల్ వాళ్ళకి ఫుడ్ లేదని సోనియా ఏడ్చేసింది. అయితే తను ఏడ్చిందానికి అసలు రీజన్ అదేనా అంటే కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్, సోనియా మట్లాడింది టెలి కాస్ట్ చేశాడు బిగ్ బాస్. అందులో ఏం ఉందంటే.. నా వల్ల నీ గేమ్ డిస్టబ్ అవుతుందంటే నాతో నువ్వు ఉండకు.. నేను నీతో ఉండను అని సోనియాతో నిఖిల్ చెప్తాడు. ఆ తర్వాత హౌస్ లో ఫుడ్ కోసం ప్రతీ క్లాన్ నుండి ఒక్కొక్కరిని తీసుకొని గేమ్ ఆడించాడు‌ బిగ్ బాస్.

ఈ టాస్క్ లల్లో గెలిచిన వారికే ఫుడ్ అని చెప్పడంతో అందరు పోటీపడి ఆడారు. ముందుగా యష్మీ టీమ్ గెలిచి రేషన్‌ను సొంతం చేసుకున్న వెంటనే సోనియా తెగ ఏడ్చేసింది. ఇంతకు గెలిచింది వాళ్ల టీమ్ ఏ అయినా సోనియా ఎందుకేడుస్తుందో ఎవరికి అర్థం కాలేదు. కానీ దానితో మనకేం సంబంధం ఓదార్పు ఇవ్వడమే ముఖ్యం అన్నట్లు వెంటనే సోనియాను దగ్గరికి తీసుకొని అభయ్ నవీన్ ఓదార్చాడు. ఇక సోనియా ఏడుస్తుందని తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు సోనియా ప్రేమికుడు నిఖిల్. కానీ ఏం లేదు.. ఏం లేదు అంటూ నిఖిల్‌ని పక్కకి పంపేసి మరీ అభయ్ ఓదార్చాడు. ఇక తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు.. తర్వాత పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. ఇలా ఎంతమంది ఓదార్చిన సోనియా కన్నీళ్ళు ఆగలేదు. ఆ తర్వాత నిఖిల్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. మణికంఠ ఫుడ్ దొంగతనం చేద్దామని చెప్పిన నా వల్ల కాదని చెప్పేశాడు. మరి వీరి మధ్య ఏం జరుగుతుందో బిబి(Biggboss) ఆడియన్స్ కే తెలుస్తుంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.