English | Telugu

సాయికిర‌ణ్‌ను దేవుడ‌నుకున్న తాగుబోతు!

టాలీవుడ్ లో సినిమాల్లో నటించి ఇప్పుడు సీరియల్స్ చేస్తూ మంచి బిజీ ఆర్టిస్ట్ గా మారిన సాయి కిరణ్ మనందరికీ తెలుసు. 2000లో విడుదలైన మూవీ 'నువ్వే కావాలి'లో "అనగనగా ఆకాశం ఉంది" అనే పాటతో మంచి పాపులర్ అయ్యాడు సాయికిరణ్. ప్రకాష్ పాత్రలో సెకండ్ హీరోగా చేసినా గుర్తుండిపోయే రోల్ లో నటించాడు. ఈ సాయికిరణ్ గాయ‌కుడు రామ‌కృష్ణ కుమారుడు అన్న విషయం కూడా అందరికి తెలుసు. ఐతే ఆయన 'నువ్వే కావాలి' సక్సెస్ ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. తర్వాత చేసిన మూవీస్ ఫ్లాప్ అయ్యేసరికి తెరమరుగయ్యాడు.

'నువ్వే కావాలి' తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు' వంటి మూవీస్ లో యాక్ట్ చేశాడు సాయికిరణ్. ఆ తర్వాత మంచి ఆఫర్స్ రాకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. జగపతి, షిర్డీసాయి, నక్షత్రం, గోపి గోడ మీద పిల్లి మూవీస్ లో నటించాడు. బిగ్ స్క్రీన్ మీద అనుకున్న స్థాయిలో క్లిక్ అవకపోయేసరికి స్మాల్ స్క్రీన్ మీద దృష్టి పెట్టి 'కోయిలమ్మ' సీరియల్ లో నటించి పర్వాలేదనిపించాడు.

'కోయిలమ్మ' సీరియల్ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో మహేంద్ర రోల్ లో నటిస్తున్న సాయికిరణ్ మనందరికీ తెలుసు. అలాంటి సాయికిరణ్ కి ఇటీవల నరసింహ స్వామి ఆలయంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎదురయ్యింది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. తానుఆలయానికి వెళ్ళినప్పుడు మద్యం మైకంలో ఉన్న ఒక వ్యక్తి సాయికిరణ్ ని చూసి, అతనే నిజమైన దేవుడిగా భావించి ప్రపంచంలోని సమస్యలు పరిష్కరించాలంటూ "రా దిగిరా" అంటూ డిమాండ్ చేసాడు. సాయికిరణ్ కూడా అతన్ని ఏమీ అనలేక సైలెంట్గా అతన్ని దీవించేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

బుల్లితెర సెలబ్రిటీస్ చాలామంది ఈ వీడియోకి కామెంట్స్ చేశారు. ఐతే నెటిజన్స్ మాత్రం మీరు నిజంగా నరసింహస్వామి లానే కనిపిస్తున్నారు. మీ ముఖంలో ఆ ఆధ్యాత్మిక భావన అనేది కనిపిస్తుంది కాబట్టే అతనికి మీరు దేవుడిలా కనిపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.