English | Telugu

బిగ్ బాస్ షో పై రాజా రవీంద్ర కామెంట్స్


కాకమ్మ కథలు షో ఫినాలే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి నవీన్ చంద్ర, రాజా రవీంద్ర వచ్చారు. ఇక వీళ్ళ మధ్య నడిచిన కాన్వర్జేషన్ మరీ డబుల్ మీనింగ్ గా సాగింది. "నవీన్ చంద్ర మీరు అనవసరంగా రాజా రవీంద్రతో రావాల్సి వచ్చినందుకు సో సారీ..సీజన్ 3 లో మళ్ళీ పిలుస్తాను" అని చెప్పింది. ఇక రాజా రవీంద్రతో ఎం అన్నదంటే "రాజా రవీంద్రను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ నాకు ఆయన షేడ్స్ అర్ధం కావడం లేదు. ఒక మనిషిని చూస్తే ఆయన ఈ రోల్ అయ్యుంటుంది అని మనం అనుకుంటాం. మీరు ఏ రోల్ చేసినా అలాగే ఉండదు" అంది తేజు. "జనాలు నన్ను ఒక ఇమేజ్ లో చూస్తారుగా క్యారెక్టర్ లో అది ఉండదు. "మనిద్దరం కలిసి ఒక సినిమా చేసాం ఐతే క్యారవాన్ లోంచి నువ్వు బయటకు రాలేదు." అని రాజా రవీంద్ర అనేసరికి "మీరు క్యారవాన్ రాలేదా ఐతే" అని కౌంటర్ వేసింది తేజు. "సోషల్ మీడియా లేక ముందు మీరే సోషల్ మీడియా మీకు గుర్తుందా " అని అడిగింది తేజు. దానికి రాజా రవీంద్ర పడీ పడీ నవ్వేసాడు.

"మీరు తెలియకుండా జనాలు మీ గురించి ముందే అనుకునే ఒక నిజమైన విషయం ఏంటి" అని అడిగింది. "అదే ఈడికి నోటి దూల అని" అన్నాడు. "అవును ఇది నిజమే" అంది తేజు. తర్వాత రాపిడ్ ఫైర్ అడిగేసరికి "నిజానికి మీరు లైఫ్ లో రాపిడ్ ఫైర్ ఆడుతున్నారు. కానీ అది ఎవరికీ తెలియడం లేదు" అంది తేజు. "ఒకవేళ మీరు బిగ్ బాస్ కి వెళ్లి ఉంటే మీరు సర్వైవ్ అయ్యేవాళ్ళా " అని అడిగింది. "వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు" అని చెప్పాడు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు, చేస్తున్నాడు. అలాగే మూవీస్ కి డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.