English | Telugu

Karthika Deepam2 : ఎమోషన్స్ తో అల్లాడించిన దీప, కార్తీక్.. జ్యోత్స్న కట్టుకథ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -267 లో... నా కూతురిని చూస్తానంటూ దీప పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కార్తీక్ వెనకాలే వెళ్తాడు. నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తుంటే.. శౌర్యా ఏమవుతుందని కార్తీక్ అంటాడు. శౌర్యకి ఏమని చెప్పారు.. ఏదో చెప్పారు.. ఈ ఆపరేషన్ అంటూ ఏం చెప్పలేదు. నువ్వు శౌర్య ముందు ఏడవనని నాకు మాటివ్వమని దీపతో కార్తీక్ అంటాడు. దీప ఏడుస్తుంటుంది. కార్తీక్ మళ్ళీ మళ్ళీ అంటుంటే దీప మాటిస్తుంది.

మరోవైపు శివన్నారాయణ దగ్గరికి దశరథ్ వస్తాడు. చెల్లి ఆస్తులన్నీ వదిలేసి అప్పుకోసం ఇక్కడికి వచ్చింది. తనకి హెల్ప్ చెయ్యాలి అని దశరథ్ అంటాడు. ఇది నువ్వు అంటున్నావా నీ వెనకాలున్న వాళ్ళు అనిపిస్తున్నారా అని సుమిత్రని ఉద్దేశించి శివన్నారాయణ అంటాడు. నన్ను క్షమించండి మావయ్య నేను ఎప్పటికి పరాయిదాన్నే కానీ కాంచన మీ కూతురని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. అందరూ కలిసి హెల్ప్ చేసేలా ఉన్నారు. ఈ సిచువేషన్ లో అందరు ఒక్కటైనా ఆశ్చర్యపొనవసరం లేదు.. ఇప్పుడు నాకు నచ్చినట్లు కథని అల్లుతాను.. శౌర్య ఆరోగ్యం బాలేదని వీళ్లకి చెప్పొద్దని జ్యోత్స్న అనుకుంటుంది. వాళ్లకి సాయం చెయ్యాల్సిన అవసరం లేదు.. ఎందుకు అంటే శౌర్య హాస్పిటల్ లో లేదు.. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంది నేను దీప ఇంటికి వెళ్లేసరికి మంచిగా పిండి కలుపుకుంటూ ఉంది. ఎందుకు ఇలా అందరిని మా ఇంటికి డబ్బు కోసం పంపావంటే అందులో మా అత్త వాటా కూడా ఉందనని దీప చెప్పిందంటు జ్యోత్స్న అనగానే.. చూసావా అంటూ శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. దశరథ్ బాధగా వాళ్ళనేం అనలేక వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మంచి పని చేసావని జ్యోత్స్నని మెచ్చుకుంటుంది పారిజాతం. దీప హాస్పిటల్ కి వెళ్తుంది. శౌర్య నీకొక సర్ ప్రైజ్ అంటూ దీపని కార్తీక్ చూపించగానే.. శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. శౌర్య ముందు తన బాధని బయటకు కన్పించనివ్వదు. బయటకు వచ్చి దీప ఏడుస్తుంటే అప్పుడే కార్తీక్ వచ్చి.. శౌర్య గురించి నీకెలా తెలిసిందని అడుగుతాడు. జ్యోత్స్న చెప్పిందని దీప అనగానే.. జ్యోత్స్నపై కార్తీక్ కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.