English | Telugu

Karthika Deepam2 : ఒకే బెడ్ పై దీప, కార్తీక్.. ఆమె మాటని నెరవేరుస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -202 లో .....కార్తీక్ బాబు తో భార్యలాగా ఉంటానని నాకు మాటివ్వమని అనసూయ అంటుంది. దాంతో నేను ఉండలేనని దీప అనగానే.. అయితే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అనసూయ అంటుంది. ఏదో మీరు పెట్టె బుక్కెడు మెతుకుల కోసం నేను ఇక్కడ ఉండడం లేదు.. మీరు సంతోషంగా ఉంటే చూసి వెళదామని అనుకున్నానని అనసూయ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడే కాంచన వచ్చి అనసూయ మాట ఇవ్వమని అడిగిన దాంట్లో తప్పేముంది.. కార్తీక్ చేసింది మంచి పని అని కాంచన సమర్థిస్తుంది. దీపకి కాస్త సమయం ఇవ్వమని కాంచన అంటుంది.

నువ్వు నాకు మాటివ్వకున్న సరే గాని నేను చెప్పినట్లు కార్తీక్ బాబు తో ఉండమని అనసూయ చెప్తుంది. మరొకవైపు తాతయ్య ఎందుకు చిన్న నానమ్మతో ఉన్నాడని శౌర్యా అనగానే.. చెప్తే అర్ధం చేసుకునే వయసు కాదని అనుకొని చిన్న నానమ్మకి హెల్ప్ చెయ్యడానికి ఉన్నాడని అంటుంది. అలా అనగానే మరి నువ్వు బాధపడడం లేదా అని శౌర్య అనగానే.. నాకు మీరందరు ఉన్నారు కదా అంటుంది. అయినా జ్యోత్స్న, గ్రానీ లు ఎందుకు వచ్చి గొడవ చేస్తున్నారు. మనం హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా అని అంటుంది. మనం దూరంగా వెళ్తే రారు కదా అని శౌర్య అంటుంది. అందరిలాగే మీరు ఉంటే చూడాలని ఉంది నాన్న అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది శౌర్య. ఆ తర్వాత పారిజాతం జ్యోత్స్న లు మాట్లాడుకుంటుంటే సుమిత్ర వచ్చి దీప కొట్టిన దాని గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది. నీకెలా తెలుసు అని జ్యోత్స్న అనగానే.. నేను వచ్చానని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న తనపై కోప్పడుతుంది. ఒక కార్తీక్ తప్ప ఏం అడిగినా చెయ్యడానికి రెడీ అని సుమిత్ర అనగానే.. దీపని బావ నుండి వేరు చెయ్ అని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది. జ్యోత్స్న వెళ్ళిపోయాక మీరు నా కూతురు నీ వదిలెయండంటు పారిజాతానికి వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర.

అదంతా విన్న దశరథ్ రిసెప్షన్ కి వెళ్లకుండా ఉండాల్సింది ఇంకెప్పుడు అలా వెళ్లకని అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. నా మెడలో తాళి తీసి జ్యోత్స్న మెడలో కట్టండి అని దీప అనగానే.. అలా జరగదన్నట్లు కార్తీక్ మాట్లాడతాడు. ఆ తర్వాత దీప నేలపై పడుకొని అత్తయ్య చెప్పినట్లే ఉండాలని ఉంది కానీ అన్నం పెట్టిన వాళ్లకు అన్యాయం చేసినట్లు అవుతుందని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.