English | Telugu

ఆర్పీ మీద కౌంటర్ ఎటాక్ తో జాతిరత్నాలు!

జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయినా కిర్రాక్ ఆర్పీ చాలా రోజుల తర్వాత ఆ మల్లెమాల సంస్థ గురించి అక్కడి ప్రొడక్షన్ ఫుడ్ గురించి చేసిన కామెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కొంతమంది ఆర్పీ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది మాత్రం ఆర్పీ కి కౌంటర్ ఎటాక్స్ కూడా ఇచ్చారు. ఇలా ఈ కాంట్రవర్సీ ఎలా గోలా కాస్త సద్దుమణిగినట్లు కనిపించింది. ఐతే ఇప్పుడు ఇదే థీమ్ తో జాతిరత్నాలు షోలో ఒక స్పూఫ్ చేశారు. ఈ స్పూఫ్ లో పంచ్ ప్రసాద్, నూకరాజు, ఇమ్మానుయేల్, శ్రీముఖి పార్టిసిపేట్ చేశారు. ఈ నలుగురు రౌండ్ టేబుల్ లా కూర్చుని డిబేట్ కార్యక్రమం నడిపిస్తారు.

"మీకు ఆరోగ్యం బాగోనప్పుడు మీరు ఏదైతే సంస్థలో పని చేస్తున్నారో ఆ సంస్థ మీకు నిజంగానే అన్యాయం చేసిందా అంటూ ఇమ్మానుయేల్ ప్రసాద్ ని అడుగుతాడు" మీకనే కాదు అందరికీ ఈ విషయం గురించి చెప్పాలి అంటూ ప్రసాద్ తన ఎక్స్పీరియన్స్ ని చెప్పబోతాడు . ఐతే అతను మాట్లాడిన మాటల్ని కట్ చేసేస్తారు. తర్వాత నూకరాజు వచ్చి "మీరు చేసే సంస్థలో ఫుడ్ బాగోదని టాక్ నడుస్తోంది..దీని గురించి మీరేం చెప్తారు అని ప్రసాద్ ని అడుగుతాడు. ఇలా ఈ డిబేట్ చాలా ఘాటుగా జరిగినట్టు ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఆర్పీ మీద ఎలాంటి కౌంటర్లు వేశారు ? అనే విషయం తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. ఐతే మల్లెమాల ఇలా ఆర్పీకి మళ్ళీ గట్టిగా కౌంటర్లు ఇవ్వడానికి స్కిట్స్ వేయిస్తోందనే విషయం అర్థమౌతోంది. మరి ఆర్పీ ఈ స్కిట్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ? అసలు రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.