English | Telugu

బ్రేకింగ్ న్యూస్ హెడ్ లైన్స్ లో సుధీర్, ఇమ్ము

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ గురించి అందరికీ తెలుసు. ఇమ్ము, వర్ష లవ్ ట్రాక్ కి పునాది కూడా ఈ జబర్దస్త్ లోనే పడింది. సుధీర్, రష్మీ లవ్ ట్రాక్ తర్వాత వర్ష, ఇమ్ము లవ్ ట్రాక్ మస్త్ ఫేమస్ అయ్యింది. ఐతే ప్రస్తుతం ఇమ్ము పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామంటూ ప్రభుత్వం ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రకటించేసరికి షాక్ అయ్యాడు. దీనికి కారణం ఏంటంటే "నైజీరియా, వెస్ట్ ఇండీస్, కెన్యా దేశాలు ఇమ్ము కోసం పోట్లాడుకుంటున్నాయట. మా వాడంటే మా వాడు అంటూ కొట్టుకు ఛస్తున్నాయట". ఈ డైలాగ్ కి ఇమ్ము నవ్వాలో ఏడవాలో అర్ధం కాక సైలెంట్ గా ఉన్నాడు. అలాగే సుధీర్ గురించి కూడా సోషల్ మీడియాలో ఒక బ్రేకింగ్ న్యూస్ ట్రోల్ అవుతోంది. "పందుల పెంపకం వీడియోలో కూడా..వి వాంట్ సుధీర్, వి వాంట్ సుధీర్ " అంటూ కామెంట్స్ పెడుతున్నారట నెటిజన్స్. ఇలా స్పెషల్ బ్రేకింగ్ న్యూస్ బులెటిన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వారం ఇలా సుధీర్, ఇమ్ము వార్తలకెక్కారు. ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ పేరు "భలే మంచి రోజు"..ఈ డైలాగ్స్ ఆ ఎపిసోడ్ లోవి. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో ఈటీవీలో రెగ్యులర్ గా న్యూస్ బులెటిన్స్ వచ్చే న్యూస్ రీడర్స్ తో ఈ బ్రేకింగ్ న్యూస్ చదివించారు. మల్లెమాల నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా ఈ షోకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసినట్లు కనిపిస్తోంది. వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేశారు అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వార్షికోత్సవ స్పెషల్ ఎపిసోడ్ 28 వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలు ప్రసారం కాబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.