English | Telugu

Eto Vellipoyindhi Manasu : అడుగడుగునా యాగానికి అడ్డంకులే.. భార్యాభర్తలు కలిసి పూర్తిచేయగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -203 లో...... రామలక్ష్మి మోకాళ్ళ పై ప్రదక్షిణలు చేస్తుంటే అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఇలా పీడ కల వచ్చింది అందుకే ఇలా చేస్తే మంచి జరుగుతుందని, ప్లీజ్ ఆపకండి అని రామలక్ష్మి అంటుంది. ఏం చేసిన మీ గురించి కదా బాబు ఆపకండి అని సుజాత అనగానే.. సరే అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. శ్రీవల్లి తన ముందు కొబ్బరి చిప్పలు వేస్తుంది దానిపై కాలు వెయ్యడంతో గుచ్చుకొని రక్తం వస్తుంది.

అది చూసి సీతాకాంత్ కంగారుపడుతూ పక్కన కూర్చొపెట్టి పసుపు పెడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు పంతులు దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి, ఇది కింద పడకుండా తీసుకొని వెళ్లి యాగం లో ఉపయోగించండి అని అంటాడు. దాంతో రామలక్ష్మి వాటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్తుంది. ఎలాగైనా అవి పడేయాలని శ్రీవల్లి అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సీతాకాంత్ ఆపి కొంచెం మెల్లిగా రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి నడుస్తుంటే తన కాలు అడ్డం పెడుతుంది. కాని శ్రీవల్లినే కింద పడిపోతుంది. ఆ తర్వాత రామాలక్ష్మిపై ఎలా ఎటాక్ చెయ్యాలి అని రౌడీ ఆలోచిస్తుంటే అప్పుడే తన పట్టి కింద పడిపోవడం రౌడీ చూస్తాడు. అది తన చేతిలోకి తీసుకుంటాడు ఆ తర్వాత రామలక్ష్మి తన పట్టి లేదని చూసుకొని ఎక్కడో పడిపోయింది చూస్తానని రామలక్ష్మి వెళ్తుంది. మరొకవైపు ఆగిపోయే యాగానికి నువు ఎందుకు హడావిడి చేస్తున్నావని శ్రీలతతో సందీప్ అంటాడు. ఇలా చేస్తే మనపై డౌట్ రాదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి స్వామి వేషమ్ లో ఉన్న రౌడీ దగ్గరికి వస్తుంది. తన పట్టి చూసి తీసుకుంటుంది. అప్పుడే రౌడీ కత్తి తియ్యబోతుంటే సీతాకాంత్ వాళ్లు వస్తారు.

ఆ తర్వాత అందరు యాగం దగ్గర సకల వస్తారు. రామలక్ష్మి సీతాకాంత్ లు కలిసి రావడం చూసి వాళ్ళు వస్తున్నారని ఆశ్చర్యంగా శ్రీలత సందీప్ లు చూస్తారు. ఆ తర్వాత ఈ యాగాన్ని ఆపడానికి నేను ట్రై చేసాను కానీ వర్కవుట్ కాలేదని వాళ్ళతో శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత యాగం దగ్గర పనులు చేస్తుంటే.. నీ లాంటి చెడు ఆలోచనలున్న వాళ్లు ముట్టుకోవద్దని మాణిక్యం అంటాడు. అప్పుడే అందరు వస్తారు. మీ నాన్న అత్తయ్యని ఇలా అన్నాడని రామలక్ష్మికి శ్రీవల్లి చెప్తుంది. ఏదో తెలియక అన్నాడని సుజాత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.