English | Telugu

మేము వస్తే ఈ స్టేజీకే కల వచ్చింది..మీరు వస్తే ఈ స్టేట్ కి కళొచ్చింది సర్

ఈ దీపావళికి మాస్ జాతర పేరుతో అక్టోబర్ 20 న ఒక ప్రొగ్రమ్ రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు. "ఏదేమైనా శేఖర్ నువ్వొచ్చాక ఈ స్టేజికి అద్భుతమైన కళ వచ్చింది" అంటూ నాగబాబు శేఖర్ మాష్టర్ ని పొగిడేసాడు. వెంటనే శేఖర్ కూడా "మేమొస్తే ఈ స్టేజీకే కళ వచ్చిందేమో మీరొస్తే ఈ స్టేట్ కె కళొచ్చింది సర్" అని చెప్పాడు. ఇక ఆది వచ్చి శేఖర్ మాష్టర్ కి, నాగబాబు కొత్త వస్త్రాలున్న పాక్స్ ని ఇచ్చాడు. శేఖర్ మాష్టర్ ఐతే ఆ పాక్ చూసి "ఈ కలర్ బాబు గారికి సెట్ అవుతుంది.

నువ్వు వెళ్లి ఇది చెప్పి ఆ కవర్ తీసుకుని ఈ కవర్ ఇచ్చేయి" అని చెప్పాడు. అదే విషయాన్నీ ఆది వెళ్లి నాగబాబుకు చెప్పాడు. "బాబు గారు ఈ కవర్ శేఖర్ మాష్టర్ కి ఇచ్చేద్దాం అడుగుతున్నాడు" అన్నాడు. "అడగటానికి ఆడేవాడు..చెప్పడానికి నువ్వు ఎవడవురా" అన్నారు నాగబాబు. "నేనొక జడ్జిగా చెప్తున్నా ఈ కలర్ నీకు బాగుంటుంది" అంటూ నాగబాబు చెప్పారు. "నేను కూడా జడ్జ్ గానే చెప్తున్నా సర్ ఈ కలర్ మీకు బాగుంటుంది" అన్నాడు. "జడ్జ్మెంట్ వరకు వచ్చావంటే నువ్వు బెటర్ జడ్జ్ ఆ, నేను బెటర్ జడ్జ్ ఆ తేల్చుకుందాం ఈరోజు" అంటూ పందెం కాసుకున్నారు. "తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం సర్" అంటూ శేఖర్ మాష్టర్ దాక్కునే సరికి.."తేల్చుకుందాం అంటూ వెనక్కి వెళ్తున్నావేంటి" అంటూ నాగబాబు అడిగారు. "ఏంటి సర్ ముందుండే తేల్చుకోవాలి ఏంటి దూరం నుంచి తేల్చుకోకూడదా ఏంటి" అంటూ కౌంటర్ వేసాడు శేఖర్ మాష్టర్. అలా ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పాక్స్ ని విసిరిగొట్టి తేల్చుకుందాం పదా అనుకున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.