English | Telugu

దూరదర్శన్ నటీమణులతో ఒక సీరియల్ వస్తే బాగుండు

ఒకప్పుడు దూరదర్శన్ రాజ్యమేలే రోజుల్లో వచ్చే కొన్ని సీరియల్స్ ఐనా కానీ వాటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ఆడియన్స్. అలాంటి దూరదర్శన్ ఛానల్ వచ్చిన రుతురాగాలు సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అలాగే డామిట్..కథ అడ్డం తిరిగింది. అలాగే భమిడిపాటి రామగోపాళం కథలు, వేయి పడగలు, ఆనందో బ్రహ్మ ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు. ఇక ఋతురాగాలు సీరియల్ లో నటించిన శృతి, ప్రీతి నిగమ్ అలాగే డామిట్ కథ అడ్డం తిరిగింది సీరియల్ లో నటించిన జ్యోతి రెడ్డి వీరంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు గ్రీన్ నటీమణులుగా చెలామణి అవుతూనే ఉన్నారు.

ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ మూవీస్ లో నటిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లంతా కలిసి ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. "ఆనాటి ఆ స్నేహమానంద గీతం" అనే పాటకు వాళ్ళు స్టెప్స్ వేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు. "మీరు మళ్ళీ మంచి సీరియల్స్ తో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చేసిన నెగటివ్ రోల్స్ కాకుండా మంచి కామెడీ రోల్ చేయాలని యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి మంచి మంచి వంటలు చేయాలని కోరుకుంటున్నా" అంటూ పోస్ట్ పెట్టారు. "ఇక వీళ్లంతా కూడా మంచి అవకాశం వస్తే అందరం కలిసి నటించాలని ఉంది" అని రిప్లై ఇచ్చారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.