English | Telugu

 `గుప్పెడంత మ‌న‌సు` : బ‌య‌ట‌ప‌డిన దేవ‌యాని కుట్ర‌

మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `గుప్పెడంత మ‌న‌సు`. వ‌సుధార , రిషిల చిలిపి ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సాగుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. తాజాగా మంగ‌ళ‌వారం 299వ ఎపిసోడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ‌సు కోసం జ‌గ‌తి ఇంటికి వ‌చ్చిన రిషి అక్క‌డే వ‌సు వంట చేయ‌డంతో భోజ‌నం కూడా లాగించేస్తాడు. ఆ త‌రువాత వ‌సుకి థ్యాంక్స్ చెప్పేస్తాడు.

ఇది చ‌లా గొప్ప విష‌యం సార్‌. జ‌గ‌తి మేడ‌మ్ ఇంటికి రావ‌డం.. ఇక్క‌డే భోజ‌నం చేయ‌డం నిజంగా గొప్ప విష‌యం సార్ అంటుంది. ఆ మాట‌లు విన్న వెంట‌నే రిషికి ఇగో త‌న్నుకొస్తుంది. వెంట‌నే `నిజ‌మే క‌దా.. నేనేంటి ఇక్క‌డ తిన్నాను` అన‌కుంటూ వ‌సు పిలుస్తున్నా ఆగ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు రిషి. క‌ట్ చేస్తే జ‌గ‌తి, మ‌హేంద్ర ఇంటికి వ‌చ్చేస్తారు. మ‌హేంద్ర‌కు కాల్ రాగానే బ‌య‌టికి వెళ్లిపోతారు. అక్క‌డ డైనింగ్ టేబుల్‌పై రెండు ప్లేట్లు వుండ‌టాన్ని గ‌మ‌నించిన జ‌గ‌తి `ఏంటి వ‌సు రెండు సార్లు తినేసి ప్లేట్‌లు క‌డ‌గ‌డం మానేసావా? అంటుంది. రిషి వ‌చ్చిన విష‌యం చెప్పేస్తుంది వ‌సు.

విష‌యం తెలియ‌గానే జ‌గ‌తి న‌వ్వే ఓ గెస్ట్‌వి అంటూ షాకిస్తుంది. ఇదిలా వుంటే రిషి, వ‌సుధార‌ల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని దేవ‌యాని ఆరాతీయ‌డం మొద‌లుపెడుతుంది. ఆ విష‌యం మ‌హేంద్ర‌కు తెలుస్తుంది. దేవ‌యాని కుట్ర గురించి తెలుసుకున్న మ‌హేంద్ర `వ‌దిగారు ఏం చేస్తున్నా ఓపిక ప‌డుతున్నాను.. ఆమె భ‌య‌ప‌డే రోజు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని మ‌హేంద్ర అంటాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. కాలేజీకి వెళుతూ వ‌సుధార‌తో రిషి చేసిన చిలిపి ప‌ని ఏంటీ అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.