English | Telugu

'నాకు వంట రాదా ? ఫుట్ బాల్ ఆడతా వెజిటబుల్స్ తో'

ఆహా ఓటిటి వేదికపై ఎన్నో షోస్ స్ట్రీమ్ అవుతూ ఆడియన్స్కి పిక్చర్ క్లారిటీని అందించడంతో పాటు ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇదే వేదికపై "చెఫ్ మంత్ర సీజన్ 2 " స్టార్ట్ అయ్యింది. హోస్ట్ గా మంచు లక్ష్మి ఈ షోని హ్యాండిల్ చేస్తోంది. "చెఫ్ మంత్ర సీజన్ 1 "ని శ్రీముఖి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. దీనికి సంబంధించి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ 3 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో కొణిదెల నిహారిక, కాల భైరవ గెస్టులుగా వచ్చేసారు.

ఇక మంచు లక్ష్మి వాళ్ళతో వంట చేయించి ఎన్నో విషయాలు కూడా అడిగి తెలుసుకుంది. "కుకింగ్ వచ్చా" అని నిహారికను లక్ష్మి అడిగేసరికి "ఫుట్ బాల్ ఆడతా వెజిటబుల్స్ తో" అని ఆన్సర్ ఇచ్చింది నిహారిక. "అవునా సరే మీ ఆయన్ని అడిగితే తెలిసిపోతుందిగా" అని చైతన్యకు ఫోన్ చేసింది మంచు లక్ష్మి. మరి అటు నుంచి "హలో" అని వినిపించింది కానీ ఆ వాయిస్ ఎవరిదో మాత్రం అర్ధం కాలేదు. ఇంతలో కాలభైరవని షోలోకి ఇన్వైట్ చేసింది. "ఏమిటి ఈ పేరు.. మీ పేరెంట్స్ కి ఇంకా మంచి పేరు దొరకలేదా" అని ఫన్నీగా అడిగింది లక్ష్మి. ఇక ఇద్దరితో కలిసి దోశలు వేయించింది.

నిహారిక దోశ చాలా క్యూట్ గా వచ్చిందని కాంప్లిమెంట్ ఇచ్చింది. అమ్మేస్తే బోల్డు డబ్బులు వస్తాయి అని లక్ష్మి అనేసరికి డబ్బులు రావడం విషయం కాదు పరువు పోకుండా ఉండాలి అది ఇంపార్టెంట్ అంది. లక్ష్మి నవ్వేసింది. చివరికి నిహారిక ఒక అద్దిరిపోయే డిష్ చేసింది. దాన్ని ముగ్గురూ ఆస్వాదిస్తూ తిన్నారు. "థిస్ ఈజ్ ది రియల్ గుడ్ ఫుడ్ కుకింగ్ షో" అని ఫైనల్ టచ్ ఇచ్చేసింది మంచు లక్ష్మి. ఇక ఈ ఎపిసోడ్ అక్టోబర్ 14 న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.