English | Telugu

అవి బొగ్గులా..గోభి మంచూరియానా ?

చెఫ్ మంత్ర సీజన్ ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఇంకో కొత్త జంట వచ్చింది. వాళ్ళే విరాజిత - ప్రసాద్ బెహరా.. ఐతే గత ఎపిసోడ్స్ లో కనిపించిన విష్ణు ప్రియా - పృద్వి జోడి ఈ షో రాలేదు. కాబట్టి వాళ్ళ ప్లేస్ లోకి వీళ్ళను తెచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా విష్ణు ప్రియా - పృద్వి జోడి బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణు ప్రియా మీద కేసు ఫైల్ ఐన విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు కూడా విష్ణు ప్రియా వెళ్ళింది. నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళ ప్లేస్ లోకి ప్రసాద్ బెహరా - విరాజిత ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. వస్తూనే గిన్నెలో మాడిపోయిన ఒక ఐటెంని తెచ్చాడు. "ఏదో తెచ్చినట్టున్నారు" అని సుమ అడగడంతో "బొగ్గులు, మీలాగా స్టవ్ మీద వండదు విరాజిత...బొగ్గుల మీద వండుతుంది..."అని చెప్పాడు.

అతని మాటలకు బ్రేక్ వేస్తూ "ప్రసాద్ ఇది గోబీ మంచూరియా" అని విరాజిత సీరియస్ గా చెప్పింది. "ఏంటి ఇది గోబీ మంచూరియానా " అంటూ సుమ, చెఫ్ జీవన్ ఇద్దరూ షాకయ్యారు. తర్వాత జీవన్ చేసిన ఉగాది పచ్చడితో శుభప్రదంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పింది సుమ. "ఈ పచ్చడి లాగా మీ లైఫ్ ఎప్పుడూ పచ్చి పచ్చిగా ఉండాలి" అంటూ ఉగాది పచ్చడి తిన్న దీపిక విష్ చేసింది. దానికి జీవన్ తలబాదుకున్నాడు. తర్వాత ఉగాది పచ్చడి తిన్న యాదమ్మ రాజు..ముఖం అదోలా పెట్టి 65 అన్నాడు. అంటే చెఫ్ జీవన్ లాగి పెట్టి డిప్ప మీద ఒక్కటిచ్చి మార్కులు నేనియ్యాలి నువ్వు కాదు అన్నాడు. తర్వాత కంటెస్టెంట్స్ తో తనకు లడ్డూ తినాలని ఉంది అని చెప్తూ ఆ టాస్క్ ఇచ్చాడు. దానికి సుమ కౌంటర్ వేసింది. "అంటే అన్నానంటారు కానీ మీరే లడ్డూలా ఉన్నారు" అని కామెడీ చేసింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.