English | Telugu

Brahmamudi : ఆస్తి అంటే మోజు పెరిగిందా.. అందుకే అలా అన్నావా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -491 లో....కళ్యాణ్ తను రాసిన బుక్ ని ఒకతను అమ్ముతుంటే.. ఆ బుక్ కావాలని అడుగుతాడు కానీ వాటికి డబ్బులు ఉండవు. ఎప్పుడైనా ఇవ్వండి కవుల పరిస్థితి ఇంతేనని అతను అనగానే.. నేను కవిని అని మీకెలా తెలుసని కళ్యాణ్ అనగానే.. ఆ బుక్ పై మీ ఫోటో చుసినా అని అతను చెప్తాడు. మీరు ఎప్పటికైనా గొప్పవారు అవుతారని అతను కళ్యాణ్ తో అనగానే.. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే ధాన్యలక్ష్మి, రుద్రాణిలు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. నా కొడుకు రోడ్డుపై తిరుగుతుంటే.. నువ్వు మాత్రం మహారాజులాగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. నీ కొడుకు అవన్నీ అనుభవిస్తానంటే.. ఎవరైనా వద్దని చెప్పారా ఇంటికి రమ్మనంటే రావడం లేదు కదా అని అపర్ణ అంటుంది. ఏమైంది నీకు ఈ రుద్రాణి బయటకు వెళ్లి ఇవన్నీ నేర్పి తీసుకొని వచ్చిందా అని ప్రకాష్ అంటాడు. ఆ తర్వాత నా కొడుకుకి న్యాయం కావాలని ధాన్యలక్ష్మి అంటుంది. వాడిని తీసుకొని రా నేనే న్యాయం జరిపిస్తానని సుభాష్ అంటాడు. ఈ ఆస్తిని ముక్కలు చెయ్యండి. మీ వాటా మీరు తీసుకొని.. మా వాటా మాకు ఇవ్వండి కళ్యాణ్ కి ఇస్తానని ధాన్యలక్ష్మి అనగానే.. ఏమంటున్నావ్ ఇది తరతరాలుగా వస్తున్న ఉమ్మడి ఆస్తి. దీన్ని ముక్కలు చెయ్యడం ఏంటి? దీన్ని అనుభవిచండమే కానీ అమ్మడం జరగదులు.. పంచడం జరగదని ఇందిరాదేవి కోప్పడుతుంది. నీకు ఎంత దైర్యమంటు ధాన్యలక్ష్మిని ప్రకాష్ కొట్టబోతుంటే.. సుభాష్ ఆపుతాడు. నేను అన్న దాంట్లో తప్పేంటి? నీలాగే మీ కొడుకు కూడా బ్రతకాలా అని ధాన్యలక్ష్మి అంటుంది.

అ తర్వాత సీతారామయ్య వచ్చి ఈ ఆస్తులు ముక్కలు చేయడం ఉండదు. నీ బాధ నాకు అర్థమైంది. కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చేవరకు రాజ్ ఆఫీస్ బాధ్యతల నుండి.. తప్పుకుంటాడని సీతారామయ్య అనగానే అందరు షాక్ అవుతారు. అ తర్వాత మీ నిర్ణయం తప్పు అని నేను అనుకుంటున్నాను. ఆఫీస్ లో బాధ్యతలు తీసుకోకుండా ఉంటే కంపెనీ నష్టపోతుందని కావ్య అనగానే.. తాతయ్య నిర్ణయానికి అడ్డు చెప్తావా అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కళ్యాణ్ రాడు వచ్చేలా లేడు.. అప్పటివరకు కంపెనీ పరిస్థితి ఏంటని కావ్య అడుగుతుంది. ఏంటి నీకు ఆస్తులపై మోజు పెరిగిందా అందుకేనా కళ్యాణ్ రావడం వద్దని అంటున్నావని రాజ్ అనగానే.. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.