English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రభావతి 2.0 ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్ లో‌ మూడవ వారం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. ‌ఒక్కో కంటెస్టెంట్ భావోద్వేగాలకి లోనవుతున్నారు.

తాజాగా వదిలిన ప్రోమోలో బిగ్ బాస్ ఓ కోడిని సెటప్ చేసి , అందులో ఎగ్స్ ఉంచి, కంటెస్టెంట్స్ తీసుకోమని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ' బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి (prabavathi 2.0) ' అనే టైటిల్ తో వదిలిన ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఆదిత్య ఓం, పృథ్వీ ఇద్దరు ఫీజికల్ అయినట్టుగా తెలుస్తుంది.

విష్ణుప్రియ, యష్మీలకు గాయాలు జరిగినట్టుగా వారి ఆర్గుమెంట్స్ బట్టి తెలుస్తుంది‌. నిన్న జరిగిన టాస్క్ లో అభి, నిఖిల్, సోనియా, యష్మీల మధ్య గొడవ జరుగగా..‌ ఇప్పుడు ఆదిత్య ఓం, పృథ్వీ, యష్మీ ల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఎవరెవరి మధ్య గొడవ జరిగిందనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ''ప్రభావతి 2.0 ' టాస్క్ బిగ్ బాస్ అనే టైటిల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ ప్రోమోని మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.