English | Telugu

Bigg Boss 8 Telugu: అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ సీజన్ 8.. హౌస్ లో ఏం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్ 8 లో సెకెండ్ వీకెండ్ వచ్చేసింది. నిన్న అనగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ నామినేషన్ పాయింట్స్ తో కూడిన సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇది రికార్డు అంటు ఓ విషయం చెప్పాడు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్ కలిపి అన్ బిలేబుల్, అన్ బ్రేకెబుల్ సిక్స్ బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మన బిగ్ బాస్ సీజన్ 8 సాధించింది అంటు తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకున్నాడు నాగార్జున. ఇప్పటి వరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్లని క్రాస్ చెయ్యడమే కాదు.. ఆల్ ఓవర్ ఇండియాలోని అన్ని బిగ్ బాస్ సీజన్ ల టీఆర్పీని కూడా బ్రేక్ చేసిందంటు నాగార్జున చెప్పాడు.

ఇక శుక్రవారం జరిగిన ప్రమోషన్ టాస్క్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. మణికంఠ వేరొక టీమ్ నుండి కారం పొడి దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తాడు. దాంతో విష్షుప్రియ తనపై కోప్పడుతుంది. నువ్వు దొంగతనం చేసావని చెప్పాలి కదా.. మళ్ళీ ఎందుకు తిరిగి ఇవ్వడమంటూ చిన్న ఆర్గుమెంట్ జరుగుతుంది. మన పర్ స్పెక్టివ్ స్టర్ విష్ణు మప్రియని కూల్ చెయ్యాలని ట్రై చేస్తాడు. ఇదంతా బిగ్ స్క్రీన్ మీద అందరు చూసేస్తారు. ఇక హౌస్ లో మూడు క్లాన్ లు ఉన్న విషయం అందరికి తెలిసిందే. మూడు క్లాన్ లు ఉన్నా టీమ్ లలోని తమ క్లాన్ సభ్యుల పర్ఫామెన్స్ బాగుంటే గ్రీన్ లో... బాగోకపోతే రెడ్ లో పెట్టాలని నాగార్జున చెప్పగా.. ముందుగా యష్మీ తన క్లాన్ మెంబర్స్ అయిన అభయ్, పృథ్వీలని గ్రీన్ లోను శేఖర్ బాషా, ప్రేరణ, సోనియాలని రెడ్ లో పెడుతుంది. ఆ తర్వాత నైనిక క్లాన్ లో నబీల్, విష్ణుప్రియ, సీతలని గ్రీన్ లో ఆదిత్య ఓమ్ లని రెడ్ లో పెడుతుంది. ఇక నిఖిల్ తన క్లాన్ మెంబెర్ ఒక్కడే మణికంఠ ఉండడంతో ఆతని పర్ఫామెన్స్ బాగుందని గ్రీన్ లో పెడతాడు.

హౌస్ మేట్స్ ల్ ఉన్న చిన్నచిన్న మిస్ అండర్ స్టాండింగ్స్ ని క్లారిఫికేషన్ చేసి అందరికి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు నాగార్జున. సోనియా నామినేషన్ లో విష్ణుప్రియని ఫ్యామిలీ పరంగా అన్నదాని గురించి క్లారిటీగా సీసీటీవీ ఫుటేజ్ వేసి చూపించాడు‌ నాగార్జున. నీకు చూసేవాళ్ళు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ మాకు చూస్తారన్నావ్ అలా అనడం కరెక్టా అని నాగార్జున అడుగగా.. సోనియా సారీ చెప్తుంది. ఇకముందు అలా మాట్లాడితే ప్రేక్షకులు ఏం చేస్తారో తెలుసు కదా అంటు సోనియాకి వార్నింగ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ చాలాసార్లు ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావ్.. టంగ్ స్లిప్ అవుతున్నావ్.. ఇంకొకసారి అలా అయితే అంటూ గన్ చూపిస్తాడు నాగార్జున. యష్మీ మణికంఠ విషయంలో ఉన్న ఇష్యూని వీడియో ఫుటేజ్ లో వేసి చూపించగా యష్మీనే తప్పు అని చూపించగా మాట్లాడేలేక ఎమోషనల్ అవుతుంది. ఇలా ఒక్కొక్కరి గురించి ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసినట్టే చురకలు అంటించాడు నాగార్జున. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన నబీల్, సీతలకి గ్రీన్ బ్యాండ్ ఇచ్చాడు నాగార్జున.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.