English | Telugu

పవన్ కళ్యాణ్ తో డేటింగ్ ఇష్టం అంటున్న సురేఖావాణి!

ఒక‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ సురేఖా వాణి. తెలుగులో అమ్మ, వదిన రోల్స్ చేస్తూ హోమ్లీగా కనిపించే బ్యూటీ సురేఖ. ఏజ్ 50కి దగ్గరవుతున్నా కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంటుంది. భర్త చనిపోయాక చాలా రోజులపాటు సురేఖవాణి బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఈ మధ్య సుప్రీత తనను మొత్తం మార్చేసిందని సురేఖావాణి చెప్పుకొచ్చింది. ఇటీవల 'నిఖిల్ తో నాటకాలు' షోకి వచ్చిన సురేఖవాణి తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎలాంటి క్వాలిటీస్ అతనిలో ఉండాలో కూడా చెప్పి ఫన్ చేసింది.

సుప్రీత కూడా "అమ్మకి పెళ్లి చేసేస్తేనే బెటర్, లేదంటే నా బుర్ర తింటూ ఉంటది" అంటూ కామెడీ చేసింది. ఆ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది. తర్వాత సుప్రీతకు మందు తాగిస్తూ సురేఖ చేసిన హడావిడి కూడా మస్త్ వైరల్ అయ్యింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పింది సుప్రీత. వాళ్ళ నాన్న విషయంలో చాలా బాధపడిందని చెప్పింది.

అలాగే అమ్మకు వోడ్కా అంటే ఇష్టమని, డ్రెస్సింగ్ స్టయిల్లో శారీస్, మోడరన్ డ్రెస్సెస్ ఎక్కువగా ఇష్టం అని చెప్పింది. అలాగే డేటింగ్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరితో చేస్తుంది అని అడిగేసరికి "పవన్ కళ్యాణ్" అని చెప్పింది సుప్రీత.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.