English | Telugu

మోహన్ బాబుతో గొడవ..షోలో కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ!

నటుడు బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన్ని చూస్తేనే భయపడతారు చాలా మంది. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ ఫేస్ తోనే కనిపిస్తారు. నవ్వడం అనేది చాలా అరుదు. ఇలాంటి సీరియస్ ఫేస్ వెనక కూడా కొన్ని బాధలు ఉన్నాయి. వాటిని ఆర్కే షోలో చెప్పి కంట తడి పెట్టారు బెనర్జీ. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామనుకొని వచ్చాను కానీ నటుడిని అయ్యాను. "ఎలా అంటే ఒకసారి అమితాబ్ సినిమాకు పనిచేస్తున్న టైంలో ఒక కన్నడ యాక్టర్ రాలేదు.

ఇక చేసేదేం లేక అమితాబ్ గారు నన్ను పిలిచి ఆ సీన్స్ చేయమని చెప్పారు. అలా నటుడిగా మారాను" అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ విషయానికి వస్తే మోహన్ బాబు సంగతేమిటి అని అడిగేసరికి.."కంటతడి పెట్టుకున్న బెనర్జీ చిరంజీవి గారు అసోసియేషన్ కోసం ఏదైనా చేద్దామనుకునే వ్యక్తి. ప్రకాష్ రాజ్ కూడా అంతే.

ఐతే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో తనీష్ ని మోహన్ బాబు తిట్టారు. ఆ టైములో నేను అక్కడికి వెళ్లి గొడవలొద్దు అని విష్ణుతో చెప్పాను. పక్కనుంచి మోహన్ బాబు వచ్చి పచ్చి బూతులు తిట్టి కొట్టడానికి వచ్చారు. ఇక ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా" అని అన్నారు బెనర్జీ.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.