English | Telugu

అభిమన్యు చేతిలో యశ్ ఓటమికి వేద కారణమా ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగుతున్న ఈ సీరియ‌ల్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది. రేటింగ్ ప‌రంగానూ మంచి ప్లేస్ లో కొన‌సాగుతోంది. ఏడేళ్ల క్రితం స్టార్ ప్ల‌స్ లో ప్ర‌సారం అయి సూప‌ర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహ‌బ్బ‌తే` సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. క‌న్న‌డ న‌టీన‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. నిరంజ‌న్‌, కోల్ క‌తా న‌టి డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, బేబి మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్ త‌దిత‌నులు న‌టించారు.

కార‌ణం చెప్ప‌మ‌ని హిమ‌ని నిల‌దీసిన నిరుప‌మ్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా స‌రికొత్త మ‌లుపులు తిరుగుతూ ఆస‌క్తిక‌ర ట్విస్ట్ ల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జూన్ 1 బుధ‌వారం తాజా ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. హిమ పెళ్లి చూపుల కోసం వ‌చ్చిన వారిన నిరుప‌మ్ ఎందుకు బెదిరించాడు?.. ఈ విష‌యం తెలిసి సౌంద‌ర్య, ఆనంద‌రావులు ఎలా రియాక్టయ్యార‌న్న‌ది ఈ రోజు ఎపిసోడ్ లో ఆస‌క్తిక‌రం. బుధ‌వారం ఎపిసోడ్ లో హిమ‌కు పెళ్లి ఫిక్స‌యింద‌ని నిరుప‌మ్ తో స్వ‌ప్న చెబుతుంది. ఆ మాట‌లు విన్న వెంట‌నే నిరుప‌మ్ కుప్ప‌కూలిపోతాడు.

హైపర్ ఆది ఇంట్లో మర్డర్

అనుకోకుండా హైపర్ ఆది ఇంట్లో మర్డర్ జరిగేసరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి అతన్ని అతని భార్యని ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ వస్తారు. ఆదిని హోస్ట్ ప్రదీప్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అసలు మర్డర్ ఎలా జరిగింది ? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆదిని కన్ఫ్యూస్ చేస్తూ ఉంటారు. ఆది ఆన్సర్ తప్పు చెప్తే చాలు చేతికి, కాలికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. నీ ఫోన్ లో ఎక్కువగా లేడీస్ నంబర్స్ ఉన్నాయి కదా ? అని అడివి శేష్ అడిగేసరికి అలాంటివేమి ఉండవ్ అని చెప్తాడు ఆది. వెంటనే షాక్ తగులుతుంది ఆదికి. దాంతో ఒక్కసారిగా కెవ్వు మంటాడు.

26 వసంతాలు పూర్తి చేసుకున్న 'ఋతురాగాలు'

ఏ సీరియల్ అంటే ఇష్టం అని అమ్మా వాళ్ళను అడిగితే ఇప్పటికీ చెప్పే పేరు ఋతురాగాలు. రూపాదేవి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా నటించిన అద్భుతమైన ధారావాహిక ఇది. ఇదొక ఫామిలీ ఓరియెంటెడ్ డైలీ సీరియల్ గా అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రతీ పల్లెనూ, ప్రతీ గడపను పలకరించింది. 1996 లో మొదలైన ఈ సీరియల్ 1999 వరకు సాగింది. దూరదర్శన్ రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఎంతో కొత్తదనంతో సరికొత్త ప్రేమ కథతో అందరినీ ఆకట్టుకుని టాప్ రేటింగ్స్ ని సంపాదించుకుంది. సాయంత్రం 4 .30 ఐతే చాలు అప్పటివరకు ఇంటి గుమ్మాల్లో ఉన్నవారంతా టీవీల ముందు వాలిపోయేవారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రతి రోజు సరికొత్తగా సాగిన సీరియల్ గా ఇప్పటికి చెప్పుకుంటారు.

ఇమ్మానుయేల్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పూర్ణ

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. సుధీర్ యాంకరింగ్ సరదాగా సాగిపోతుంటే, జబర్దస్త్ నటీనటుల స్కిట్స్, డ్యాన్సులు ప్రతీ ఆదివారం మధ్యాహ్నం చక్కగా ఎంటర్టైన్ చేస్తోంది.  ప్రతీ వారం ఏదో ఒక స్పెషలిటీ అనేది ఈ సీరియల్ లో కనిపిస్తుంది. మ‌ల్లెమాల సంస్థ ద్వారా ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి సక్సెస్ ని కూడా అందుకుంది. ఎంతో మంది సామాన్యులను కూడా ఈ వేదిక ద్వారా ప్రతీ వారం పరిచయం చేస్తూ వాళ్లలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆనాటి అందాల నటి ఇంద్రజ ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.