English | Telugu

వైవీఎస్..ఈసారి కొట్టాల్సిందే ..!!

సాహసాలకు పెట్టింది పేరైన వైవీఎస్.. ‘రేయ్’ లాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ ఇంకో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో మంచి చిత్రాలను అందించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వైవీఎస్‌ చౌదరి. ఆ తర్వాత నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మించాడు. నిర్మాతగా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న చౌదరి గత కొంత కాలంగా తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాడు. ఈయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఈయన తీవ్ర ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌తో ‘రేయ్‌’ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించి తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాడు. ‘రేయ్‌’కి పెట్టిన బడ్జెట్‌లో కనీసం సగం కూడా రిటన్‌ అవ్వలేదు. దాంతో ఈ దర్శక నిర్మాత తర్వాత సినిమాకు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు చౌదరి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తన బొమ్మరిల్లు బ్యానర్‌లో తానే స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు.

కొత్త సినిమాకు ఇప్పటికే ఫిల్మ్‌ ఛాంబర్‌లో టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు. అంతా కొత్త వారితో తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చౌదరి ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమాతో తన టాలెంట్‌ను మరోసారి తెలుగు ప్రేక్షకులను చూపించి, ఇండస్ట్రీలో తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అదనపు హంగుల మీద కాకుండా కొంచెం కంటెంట్ మీద దృష్టిపెట్టాలి. అప్పుడే మళ్లీ నిలబడగలడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.