English | Telugu

కండ‌లు కాదు బాబూ.. కామెడీ కావాలి!

అచ్చ‌మైన భీమ‌వ‌రం యాస‌, అదిరిపోయే టైమింగ్‌, పంచ్‌ల మీద పంచులు... ఇదీ సునీల్ అంటే. విజ‌య‌భాస్క‌ర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాల్లో క‌మెడియ‌న్‌గా తిరుగులేని పాత్ర‌లు చేసి.. ఒక్క‌సారిగా `స్టార్` అయిపోయాడు. బ్ర‌హ్మానందం త‌ర‌వాత‌.. ఆ స్థాయిలో బిజీగా ఉంటూ, పారితోషికం తీసుకొనే క‌మెడియ‌న్‌గా ఒక ద‌శ‌లో సునీల్ పేరు చెప్పుకొనేవారు. క‌మెడియ‌న్‌గా బండి మాంఛి స్పీడుమీదున్న‌ప్పుడు హీరోగా ట్రాక్ మార్చాడు సునీల్‌. తొలుత ఆ బండీ సాఫీగానే సాగింది. అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, పూల రంగ‌డు లాంటి సినిమాల‌తో హిట్స్ కొట్టాడు. రూ.3 కోట్ల హీరోగా మారాడు. క‌మెడియ‌న్‌గా ప‌ది సినిమాల‌కు పంపాదించేది.. హీరోగా ఒక్క‌సారి అందుకొన్నాడు. దానికి తోడు క్రేజూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ లెక్క‌లేసుకొన్నాడు.

అంతా బాగానే ఉంది. అయితే సునీల్ క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారి పెద్ద త‌ప్పు చేశాడ‌ని అత‌ని స‌న్నిహితులు, శ్రేయోభిలాషులూ వాపోతుంటారు. సునీల్ ట్రాక్ రికార్డు చూస్తే ఆమాటా నిజ‌మే అనిపిస్తుంటుంది. పూల‌రంగ‌డు త‌ర‌వాత సునీల్ హీరోగా విజ‌యాలు అందుకోలేదు. త‌డాఖా హిట్ట‌యినా అది నాగ‌చైత‌న్య ఖాతాలోకి వెళ్లిపోయింది. సునీల్‌ని హీరోగా `భ‌రిస్తూ` సినిమాలు తీయ‌డం క‌ష్ట‌మ‌నే స్థాయికి వ‌చ్చేశాడు. దానికి కార‌ణం.. అన్నం పెట్టిన కామెడీని వ‌దిలేయ‌డ‌మే. సునీల్ కండ‌లు పెంచి, సిక్స్ ప్యాక్ తెచ్చుకొని, మాస్ ఇమేజీ కోసం తాప‌త్ర‌య‌ప‌డ‌డం సునీల్ కెరీర్‌కి ఇబ్బందిక‌రంగా మారింది. ఎంత హీరోగా మారినా, సునీల్ నుంచి ఆశిస్తోంది కామెడీనే. ఆ సంగ‌తి త‌న‌కీ తెలుసు. కామెడీ అందివ్వ‌గ‌లుగుతున్నాడు గానీ, అది కొంచెమే అవుతోంది.

హీరోయిజం, హీరోయిన్‌తో రొమాన్స్‌, యాక్ష‌న్ పార్ట్ అంటూ కామెడీని ప‌క్క‌న పెట్టేస్తున్నాడు సునీల్‌. దాంతో ప్రేక్ష‌కులూ నిరుత్సాహానికి గుర‌వుతున్నారు. సునీల్ ట్రేడ్ మార్క్ వినోదాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మిస్ అవుతున్నారు. దానికి తోడు బంతిలా గుండ్రంగా ఉండే సునీల్ కాస్త స‌న్న‌గా రివ‌ట‌లా మారాడు. ఈ ఆకార‌మూ ఇబ్బందిగానే అనిపిస్తోంది. సునీల్ ఇది వ‌ర‌కే బాగున్నాడు అన్న‌వాళ్లూ లేక‌పోలేదు. యాక్ష‌న్ మోజులోంచి సునీల్ బ‌య‌ట‌కు వ‌చ్చి కామెడీ చేస్తేనే త‌ప్ప‌.. మెప్పించ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం చాలామందిలో వ్య‌క్తం అవుతోంది. తాజాగా సునీల్ న‌టించిన కృష్ణాష్ట‌మి టీజ‌ర్ విడుద‌లైంది. అందులోనూ సునీల్ యాక్ష‌న్ ఇమేజ్ కోసం తాప‌త్ర‌య‌ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి ఈ యాక్ష‌న్ మోజులోంచి సునీల్ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాడో... ఎప్పుడు కామెడీ పండిస్తాడో. ఈ ద‌శ‌లో సునీల్‌ని ర‌క్షించేది న‌వ్వులే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.