English | Telugu

ఇండియన్ సినిమాకి మరో సవాలు విసరబోతున్న కేజీఎఫ్ యష్ 

కేజీఎఫ్ సిరీస్ తో భారత దేశ వ్యాప్తంగా స్టార్ డమ్ ని సంపాదించుకున్న నటుడు యష్ .ఆ సిరీస్ తోనే యష్ పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. అంతే కాకుండా కన్నడ సినీ పరిశ్రమ కూడా ఇండియా వైడ్ గా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించే సినిమా తియ్యగలదు అని కూడా నిరూపించింది. కానీ కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ ఇప్పటి వరకూ ఎలాంటి కొత్త సినిమాని ప్రకటించలేదు.కానీ తాజాగా యష్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రాక్ స్టార్ యశ్ తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా తన డీపీ ని చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చెయ్యడమే కాదు లోడింగ్ అంటూ ఇంగ్లీష్ లో రాసి ఉన్న ఒక పిక్ ని డీపీ గా పెట్టడంతో ఇప్పుడు యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఖచ్చితంగా అది తమ అభిమాన హీరోకి సంబందించిన కొత్త మూవీ అప్డేట్ అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. కాగా యష్ కొత్త మూవీ అప్ డేట్ కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న యష్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరిలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుంది.

2007 లో వచ్చిన జంబడ హుడిగి అనే చిత్రం ద్వారా కన్నడ సినీ రంగ ప్రవేశం చేసిన యష్ ఇప్పటి వరకు 20 చిత్రాలకి పైగానే చేసాడు. 2018 ,22 లో వచ్చినకేజీఎఫ్ చాప్టర్ 1 ,2 లతో రికార్డు కలెక్షన్స్ ని సృష్టించడమే కాకుండా ఎన్నో సినిమాలకి సవాలు విసిరిన యష్ తన కొత్త చిత్రాన్ని త్వరగా ప్రారంభించాలని అలాగే ఆ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులని సృష్టించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.