English | Telugu

నితిన్ దెబ్బకి దిగొచ్చిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గుంటూరు కారం' నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ధమ్ మసాలా'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్మాత నాగవంశీ త్వరలో సెకండ్ సింగిల్ వస్తుందని ప్రకటించాడు.. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో రెండో పాట ఎప్పుడంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గట్టిగా అడుగుతున్నారు. తాజాగా వారికి హీరో నితిన్ కూడా తోడు కావడంతో నిర్మాత తప్పక తాజా అప్డేట్ ఇచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

'మ్యాడ్' మూవీ విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, "మా సినిమా చూసి మీకు నవ్వు రాకపోతే మీ డబ్బులు వెనక్కిస్తాం" అన్నాడు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తన కొత్త సినిమా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రమోషన్స్ లో నితిన్ మాట్లాడుతూ "మా సినిమా చూసి మీరందరూ కడుపుబ్బా నవ్వకపోతే.. మీ డబ్బులు వంశీ గారు వెనక్కిస్తారు" అని సరదాగా అన్నాడు.

నితిన్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగవంశీ "ఆ రోజు మ్యాడ్ వైబ్ లో అలా అనేసాం.. మీరు ఇలా లాక్ చేస్తే ఎలా" అని ట్వీట్ చేశాడు. దానికి బదులిచ్చిన నితిన్ "ఏదో ఎక్స్ ట్రా ఆర్డినరీ వైబ్ లో నేనూ అనేసా. అది ఓకే కానీ, గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్నాం. అప్డేట్ ఎప్పుడు ఇంతకీ" అంటూ ఇరికించేశాడు. దీంతో ఇక తప్పక వంశీ గుంటూరు కారం అప్డేట్ ఇచ్చేశాడు. "పనులు జరుగుతున్నాయి. ఇంకో రెండ్రోజుల్లో సూపర్ అనౌన్స్‌మెంట్ ఇస్తాం" అని తెలిపాడు. దీంతో మహేష్ ఫాన్స్ సంబరపడుతున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.