English | Telugu

పాజిటివ్ టాక్ వస్తే చాలు.. కుర్ర హీరోకి 'అన్నీ మంచి శకునములే'!

రేపు(మే 18) విడుదలవుతున్న 'అన్నీ మంచి శకునములే' సినిమాకి నిజంగానే శకునం, సమయం మంచిగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఈ నెలలో ఇప్పటిదాకా విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయాయి. పైగా వేసవి సెలవలు కావడంతో థియేటర్లలో సరైన సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదే ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే'కి కలిసొచ్చే అంశం. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు.. ప్రేక్షకులు భారీగానే థియేటర్లకు కదిలే అవకాశముంది. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేవు. పైగా ఇది కుటుంబమంతా కలిసి చూసి ఆనందించదగ్గ సినిమా అని ప్రచార చిత్రాలు తెలియజేశాయి. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి.. మంచి విజయాన్ని అందుకునే అవకాశముంది. అయితే ఈ విజయం మిగతా టీం వారితో పోలిస్తే హీరోగా నటించిన సంతోష్ శోభన్ కి చాలా కీలకం.

'తను నేను' సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్.. 'పేపర్ బాయ్'తో పరవాలేదు అనిపించుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో అతను నటించిన 'ఏక్ మినీ కథ' నేరుగా ఓటీటీలో విడుదలైంది కాబట్టి ఫలితం గురించి చెప్పలేము. ఆ తర్వాత మారుతి దర్శకత్వం వహించిన 'మంచి రోజులు వ‌చ్చాయి' ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇక గతేడాది నవంబర్ లో వచ్చిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత రెండు నెలకే ఈ ఏడాది జనవరిలో 'కళ్యాణం కమనీయం'తో పలకరించాడు సంతోష్. కానీ అది ఓటీటీ సినిమా అనే పేరు తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇక ఫిబ్రవరిలో 'శ్రీదేవి శోభన్ బాబు'తో మరో పరాజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస పరాజయాలతో సతమతమవుతూ సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సంతోష్.. 'అన్నీ మంచి శకునములే' పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

'అన్నీ మంచి శకునములే' సినిమాకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. 'అలా మొదలైంది', 'ఓ బేబీ' సినిమాలతో ఆకట్టుకున్న నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. అలాగే 'జాతి రత్నాలు', 'సీతారామం' వంటి ఘన విజయాలతో జోరు మీదున్న ప్రముఖ నిర్మాత సంస్థ స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఓ యంగ్ హీరో నటించిన సినిమా అయినప్పటికీ ఎక్కడా వెనకాడకుండా మంచి బడ్జెట్ తోనే నిర్మించారు. పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే దాదాపు 20 కోట్లు వచ్చాయని సమాచారం. మరి ఇన్ని విశేషాలతో వస్తున్న ఈ సినిమాతోనైనా సంతోష్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.